పాడి పంటలు

Monday, January 31, 2011

వలస బతుకుల్లో తులసి కాంతులు * మార్పు తెచ్చిన తులసి సాగు...* మహిళలు సాగించిన తులసి విప్లవం

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్ప మరేమీ ఉండేవి కావు. పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్‌ లేవు.సరైన పోషకాహారం లేదు. భర్తలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఆదాయం అంతంత మాత్రమే. ఈ దృశ్యం ఒక దశాబ్దం కిందటిది. పదేళ్ళు గిర్రున తిరిగేసరికి ఇప్పుడక్కడ అంతా ఆనందమే.ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, అన్ని రకాల వసతులతో కూడుకున్న ఆ గ్రామాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. సుమారు 300మంది మహిళలు సాగించిన తులసి విప్లవం వారి జీవితాలనే మార్చేసింది.

tulasi1 
1998.. ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న మహిళ లు అంతవరకు తమ గ్రామంలో చేస్తున్న వ్యవసాయంలో సమూలమార్పులు తీసుకు రావడానికి నడుం బిగించారు. తద్వా రా తమ జీవితాలతో పాటు తమ కుటుంబాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకో వాలని సంకల్పించారు. వీరంతా వలస జీవితం గడిపే కార్మికుల భార్యలు. వారంతా కుటుంబ సభ్యులను ఊరిలోనే వదిలేసి ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళుతుంటారు. అనే క ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తుంటారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో మాత్రమే సొంత గ్రామానికి వచ్చి పనులు చేసుకుంటారు.

అలా ఓసారి అందరూ కలిసినప్పుడు వచ్చిన ఆలోచనే తులసి పెంపకం. తులసిలో అనేక ఆర్గానిక్‌ పదార్థాలు ఉన్నాయి. అందుకే దాని పెం పకం ద్వారా తమ కుటుంబాలను బాగుచేసుకోవాలని నిర్ణయించారు. తులసి పెంప కానికి సంబంధించి అన్ని రకాల విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే అందు లోకిి అడుగు పెట్టారు. ఇందుకు సాయం చేసేందుకు ఒక కార్పొరేట్‌ సంస్థ ముందుకు వచ్చింది.వారి లక్ష్యం ముందు వారు పడిన శ్రమ చాలా చిన్నది గా మారిపోవడంతో ఇప్పుడు వారి ఆనందానికి ఆకాశమే హద్ద యింది.

మార్పు తెచ్చిన తులసి సాగు...
Tulsi2 
ఇప్పుడు వారి కుటుంబాలు వల స వెళ్లకుండా ఊరిలోనే వ్యవసా యపనులు చూసుకుంటూ హా యిగా జీవిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు విజయం సాధించారు. ప్రస్తుతం వారు లక్నోలో ఉన్న ఆర్గానిక్‌ ఇండియా అనే మల్టీ నేషనల్‌ కంపెనీ కోసం ఆర్గానిక్‌ తులసిని ఉత్పత్తి చేస్తున్నారు. ఆ ర్గానిక్‌ ఇండియా సంస్థ తులసి ఉత్పత్తికి అజమ్‌ఘర్‌ను ఎన్నుకోవడానికి ప్రధానకారణం అక్కడి భూములు తులసి పండించడానికి అనుకూలంగా ఉండడం తో పాటు ఆ జిల్లా అన్ని రకాలుగా అభివృ ద్ధి చెందే అవకాశాలు ఉండడమే.

40 సంవత్సరాల విమలమౌర్య అజమ్‌ ఘర్‌ జిల్లాలోని బిజౌరా గ్రామానికి చెందిం ది. గత 10 సంవత్సరాలుగా ఆర్గానిక్‌ తు లసిని పండిస్తున్నారు. ఈ తులసితో ఆర్గా నిక్‌ టీలు, ఆరోగ్యానికి ఉపయోగపడే వివి ధరకాల మందులు తయారు చేస్తున్నారు. మొదట తులసి పండించడం ప్రారంభిం చింది వివులనే. ఆర్గానిక్‌ ఇండియా నుంచి మొదటి అవకాశాన్ని వినియోగించుకున్న ది కూడా ఆమె.తనతోపాటు మరి కొంత మంది మిహళలతో కలసి తులసి పండించ డం ప్రారంభించారు. 35 సంవత్సరాల బీను విశ్వకర్మ కమెన్‌ పూర్‌ గ్రామానికి చెందినవారు. నలుగురు పిల్లలు.

tulasi 
‘కుటుంబాన్ని పోషించడమే చాలా కష్టంగా వున్న సమయంలో మేము తులసి పెంపకం మొదలు పెట్టిన తర్వాత దానితో మా అనుబంధం ఎంతగానో పెరిగింది. గతంలో మేము చేసిన వ్యవసాయానికి భిన్నంగా తులసి పెంప కం మొదలెట్టాం. కంపెనీ నిర్దేశించిన మార్గదర్శ కాలను అనుసరించే తులసిని పండిస్తాము.మొదట మేము చేయగలమా? అనుకున్నాము. కానీ తులసి పండించడానికి ప్రత్యేక పద్ధతులు వినియోగించాల్సిన అవసరం లేదని సాధారణ పంటల మాదిరే పండించ వచ్చని నిరూ పణ అయిన తర్వాత మా మీద మాకు విశ్వాసం పెరిగింది’ అని ఆమె చెబుతున్నారు.

అందరూ విజేతలే..
జిల్లాలోని మహిళలను ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి. ఆర్గానిక్‌ ఇండి యా కంపెనీ ఇక్కడి గ్రామస్తులకు తులసి పం డించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పింది. పెట్టుబడి పెట్టడానికి కూ డా ముందుకు వచ్చింది. అయితే వారి గ్రామా లు అభివృద్ధి చెందిన తర్వాత సంస్థ పెట్టుబడి సంస్థకు ఇచ్చేలా ఒక ఒప్పందం కుదుర్చు కుంది. ఇప్పుడు జిల్లాలోని వివిధ గ్రామాల్లో సుమారు 300 మంది మహిళలు తులసి సా గు మీదే అధారపడి ఉన్నారు. సుమారు 2వేల ఎకరాల్లో తులసి సాగవుతుంది. జులై, ఆగస్టు లో తులసిని విత్తితే నవంబర్‌ వరకు కోతకు వస్తుంది. కనీసం 2వేల టన్నుల వరకు ఇక్కడ ఉత్పత్తి సాగిస్తున్నారు. కిలో ఒక్కింటికి రూ. 100 చొప్పున కంపెనీ రైతులకు చెల్లిస్తోంది.

Tulsi3 
తులసి సాగు తర్వాత పది సంవత్సరాల క్రితం ఉన్న గ్రామాలకు ఇప్పుడున్న గ్రామాల కు చాలా తేడా వచ్చింది. గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి.ప్రత్యేకంగా అల్లో పతి, ఆయుర్వేదిక్‌ ఆసుపత్రులు, వైద్యులు ఉన్నారు. గ్రామస్తులకు వారు ఉచిత వైద్యం అందిస్తారు. రోగులకు అవసరమైన మందులు అందజేయడంతో పాటు, హెర్బ ల్‌ ఉత్పత్తులను అందిస్తారు. శానిటేషన్‌ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది.వారి ఇళ్ళ ల్లో టాయ్‌లెట్ల నిర్మాణానికి కూడా సంస్థ సహకరించింది. బ్యాంకింగ్‌ సంస్థలు ఉన్నా యి. రైతులు పండించిన పంటకు సంబంధిం చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ యా బ్యాంకుల్లో నేరుగా వారి ఖాతాలో జమా అయ్యేలా ఆర్గానిక్‌ ఇండియా ఏర్పాట్లు చేసింది.

వెల్లివిరిసిన గ్రామీణ వికాసం....
ఆయా గ్రామాల్లో సామాజిక పరిస్థితులు కూడా అంతంత మాత్రం గానే ఉండేవి. బిజౌరా, కమెన్‌పూర్‌ గ్రామాల్లో 1999లో 63 శాతం స్కూల్‌ డ్రాపౌవుట్స్‌ ఉండేవారు. ఇప్పుడది 29 శాతానికి తగ్గింది. విమల, బీను వంటి రైతుల పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి డాక్టర్‌ను కలవాలంటే వారం ముందే పేరు నమోదు చేయించుకోవాలి. వైద్యులు ప్రతి రోజు రెండు పూటల వైద్య సేవలు అందిస్తారు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. తులసి సాగు, కోత సమయంలో మగవారు వారి భార్యలకు సహాకారం అందిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని పంటలు..
ఈ వ్యవసాయ పద్ధతిని ప్రవేశ పెట్టడంలో ఆర్గానిక్‌ ఇండియా అం తర్జాతీయ సిఇఓ కృష్ణగుప్తా కృషి కూడా ఎక్కువే అని చెప్పా లి. అక్కడి మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయ న చేసిన ప్రయత్నం విజయవం తమైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వారితో గోధమ, పప్పుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు, పుష్పాలు సాగు చేయించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.చేేయూతనందిస్తే ఎంతటి కార్యానై్ననా అవలీలగా పూర్తి చేయగలమని ఈ మహి ళామణులు నిరూపించారు. తక్కువ కాలంలోనే వారి కుటుంబాలతో పాటు గ్రామా న్ని అభివృద్ధి చేసుకున్నారు.

No comments:

Gouthamaraju as WUA