tag:blogger.com,1999:blog-10055745898124943942024-03-05T04:40:22.895-08:00రైతురైతు లకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోండిGouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.comBlogger103125tag:blogger.com,1999:blog-1005574589812494394.post-51348313959930287532012-09-09T09:22:00.000-07:002012-09-09T09:22:02.667-07:00ఆంధ్ర ప్రదేశ్ లో జల కళ <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span id="PDSAIbreak"></span><br />
<center>
<span style="font-size: large;"><b style="color: blue;">ఆంధ్ర ప్రదేశ్ లో జల కళ </b></span><br /><img height="304" src="http://www.eenadu.net/pro7.jpg" width="450" /></center>
<span style="font-family: EENADU;"><span style="color: black;"><span></span></span></span>
<center>
<img height="319" src="http://www.eenadu.net/pro10.jpg" width="450" />
<br />
<img height="401" src="http://www.eenadu.net/pro1.jpg" width="450" />
<br />
<img height="411" src="http://www.eenadu.net/pro3.jpg" width="450" />
<br />
<img height="327" src="http://www.eenadu.net/pro2.jpg" width="450" />
<br />
<img height="311" src="http://www.eenadu.net/pro6.jpg" width="450" />
<br />
<img height="227" src="http://www.eenadu.net/pro8.jpg" width="450" />
<br />
<img height="349" src="http://www.eenadu.net/pro4.jpg" width="450" />
<br />
<img height="341" src="http://www.eenadu.net/pro5.jpg" width="450" />
<br />
<img height="302" src="http://www.eenadu.net/pro11.jpg" width="450" />
<br />
<img height="137" src="http://www.eenadu.net/pro9.jpg" width="450" /></center>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-49316365717631106792012-08-11T22:44:00.000-07:002012-08-11T22:44:02.011-07:00బడుగుల B-School<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1 class="headline">
</h1>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><img align="center" src="http://www.andhrajyothy.com/i/2012/aug/12-8sun14.jpg" /><br /><b style="color: blue;">బడా వ్యాపారవేత్తలకు పనికొచ్చే బిజినెస్ స్కూళ్లు నగరానికొకటి ఉన్నాయి.
కాని, చిరు వ్యాపారుల్ని, నిరుపేదల్ని పైకి తెచ్చే స్కూళ్లు? అలాంటివి కూడా
ఉంటాయా అనుకుంటున్నారా! ఎక్కువ లేవు కాని ఒకటైతే ఉంది. మహారాష్ట్రలోని
సతారా జిల్లా మహ్సవడ్లో ఉంది ఓ బడుగుల బి-స్కూల్. మహిళల కోసమే నెలకొల్పిన
దాని పేరు 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'. మేదర్లు, వడ్రంగులు, కమ్మర్లు,
కుమ్మర్లు, తోపుడుబండ్ల, పూల అంగళ్ల, కూరగాయల వ్యాపారులు.. వీళ్లే అక్కడ
విద్యార్థులు.
</b></span>
<span style="font-size: large;"><br /><br /><b style="color: blue;">వనిత, MDBS.</b></span>
<span style="font-size: large;"><br />
ఎంబీబీఎస్ గురించి తెలుసు, ఎంబీఏ సంగతీ తెలుసు. మరి, ఈ కొత్త కోర్సు
గురించి ఎప్పుడూ వినలేదే? ఎక్కడుంది..? అనే ముందు వనిత గురించి నాలుగు
ముక్కలు. ఒకప్పుడు ఆమె కోళ్లఫారం యజమాని. ఒక రోజు ఉన్నట్లుండి వైరస్
సోకింది. కోళ్లన్నీ రాత్రికి రాత్రే చనిపోయాయి. అప్పుల్లో చిక్కుకున్న
వనితకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ఆ సమయంలో
కూలిపోయిన తన కుటుంబాన్ని తిరిగి నిలబెట్టింది ఎండిబిఎస్ చదువు. కోర్సు
పూర్తయ్యాక బ్యాంకులో రుణం తీసుకుని.. డిస్పోజబుల్ (వాడి పారేసే) కప్పులు,
ప్లేట్లను ఉత్పత్తిచేసే యూనిట్ను ప్రారంభించింది. ఇప్పుడు తన దగ్గర 12
యంత్రాలు, పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ మధ్యన ప్రధాని మన్మోహన్సింగ్
చేతుల మీదుగా అవార్డును సైతం అందుకుందీ వనిత. ఆమె చదువుకున్నది ఏ ఖరీదైన
బిజినెస్ స్కూల్లోనో కాదు. కేవలం రూ.25 ఫీజు చెల్లించి 'మాన్ దేశీ
బిజినెస్ స్కూల్'లో చదివిందంతే.<br /><br />
మనకు తెలిసిన బి-స్కూల్ అంటే.. సువిశాలమైన క్యాంపస్. హంగూఆర్భాటం.
సూటుబూటు. లక్షల్లో ఫీజులు. క్యాంపస్ ఇంటర్వ్యూలు. భారీ వేతన ప్యాకేజీలు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనికుల్ని మరింత ధనికులుగా తీర్చిదిద్దేది.
కంపెనీలను లాభాల బాటపట్టించే ఉద్యోగులను ఉత్పత్తిచేసేది. కాని, "సారె
తిప్పినా బండి నడవని కుమ్మరికి, బడిసె పట్టుకున్నా బతకలేని వడ్రంగికి,
ఎన్ని బుట్టలల్లినా కాసింత బువ్వ తినలేని మేదరికి.. బతుకు పాఠాలు బోధించే
బడులను ఎందుకు స్థాపించలేకపోతున్నాం..'' అనుకుంది ఒక మహిళ. ఆమె పేరు చేత్నా
గలా సిన్హా.<br /><br /><b style="color: blue;">కరువుకు పరిష్కారం..</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/12-8sun15.jpg" /></span>
<span style="font-size: large;">
ముంబయికి చెందిన సిన్హా అందరూ నడిచే దారిలో నడవరు. ఆమెది ఎప్పుడూ భిన్నమైన
మార్గం. అభివృద్ధి అంటే పైనున్న వాళ్లను మరింత పైకి తీసుకెళ్లడం కాదు.
అట్టడుగునున్న గ్రామీణపేదల్ని పైకి తీసుకురావడం. అలాగే కనుమరుగైపోతున్న
వృత్తులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం.. అనుకుంది ఆమె. మహారాష్ట్రలోని
సతారా, షోలాపూర్, సంగ్లి, రాయ్గడ్, రత్నగిరి, కొల్హాపూర్ కరువు ప్రాంతాలు.
ప్రతి పల్లెలోనూ సగానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలే నివసిస్తుంటారు.
అరకొర నీళ్లున్న చోట చెరకు, జొన్న, మొక్కజొన్న పండితే పండినట్లు. లేకపోతే
గడ్డి కూడా మిగలదు. రైతుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇక కూలీల అగచాట్లు
చెప్పనక్కర్లేదు. <br /><br />విషయం తెలుసుకున్న చేత్నా గలా సిన్హా 'మాన్'
తాలూకాకు వెళ్లింది. ప్రజల బాధలు అర్థం చేసుకుంది. కేవలం మహిళల కోసం 'మాన్
దేశీ ఫౌండేషన్'ను నెలకొల్పింది. దీని కిందే 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్',
'మాన్ దేశీ మహిళా బ్యాంక్'లను ఏర్పాటు చేశారామె. ఇప్పుడా బ్యాంకులో 1.14
లక్షల సభ్యులు ఉన్నారు. చిరు వ్యాపారులు, నిరుపేదలు ఆ బిజినెస్ స్కూల్లో
నైపుణ్యాలను నేర్చుకుంటారు. బ్యాంకులో రుణాలు తీసుకుని.. ఉపాధి పొందుతారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడు.. వారికి సంఘంలో గౌరవం
లభిస్తుంది. నాణ్యమైన జీవితంతోపాటు పిల్లలకు చదువులు అబ్బుతాయి. స్థూలంగా
మాన్ దేశీ ఫిలాసఫీ ఇదే!<br /><br /><b style="color: blue;">దిశదిశలా స్ఫూర్తి..</b></span>
<span style="font-size: large;"><br />
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బి- స్కూళ్లకు పాఠ్యాంశాలను రూపొందించడం కంటే..
మాన్ దేశీ బిజినెస్ స్కూల్కు పాఠ్యప్రణాళిక తయారు చేయడం చాలా కష్టం.
ఇందులో విద్యార్థులంతా దినకూలీలు, గాజులు అమ్ముకునేవారు, వడ్రంగులు,
మేదర్లు, దర్జీలు, తాపీమేస్త్రీలు, బడి మానేసిన పిల్లలు. అందులోనూ అందరూ ఒక
వయస్కులు కాదు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్లు. మూడోవంతు మందికి
వేలిముద్రలు వేయడం ఒక్కటే తెలుసు. "బ్యాంకు అకౌంట్లు, లోన్లు, చెక్కులు,
డిడిలు వంటి చిన్న చిన్న విషయాలను అర్థమయ్యేలా చెప్పడం ఒక పెద్ద సవాలు.
రకరకాల ప్రయోగాలతో బోధించినా ఫలితం లేకపోయేసరికి.. పల్లెల్లో బాగా
ప్రాచుర్యంలో ఉన్న జానపద గాథలు, నాటకాల ద్వారా ఆర్థిక పాఠాల్ని చెప్పాం.
పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది..'' అన్నారు స్కూల్ టీచర్లు. <br /><br />మాన్
దేశీ స్కూల్ పాతిక కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి రెండు రోజుల
నుంచి మూడు మాసాల కాలవ్యవధి ఉంటుంది. ప్రత్యేక కోర్సులకైతే ఏడాది నుంచి
రెండేళ్లు పడుతుంది. రూ.25 నుంచి రూ.1200 మధ్యన ఫీజులు ఉంటాయి.
ఫైనాన్షియల్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్,
మేనేజ్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, డ్రెస్ డిజైనింగ్, ఇంగ్లిష్
లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్.. వంటి కోర్సుల్లో తర్ఫీదు ఇస్తారు. ఉదాహరణకు -
బుట్టలల్లే వ్యాపారి మార్కెట్ను ఎలా విస్తరించుకోవచ్చు? ఇనుపసామాన్లు
రిపేరు చేసే నిపుణుడికి మరమ్మతు పరికరాలు ఎక్కడ దొరుకుతాయి? ముడిసరుకుల్ని
ఎప్పుడు కొనాలి? వినియోగదారులతో ఎలా మాట్లాడాలి? బ్యాంకుల్ని ఎలా
సంప్రదించాలి? అప్పులు, రుణాలు, వడ్డీలు, బీమా, పింఛను, సబ్సిడీలు.. ఇలా
ఒక్కటేమిటి? ఆర్థికంతో ముడిపడిన ప్రతి అంశాన్నీ పాఠంగా చెబుతారు. ఈ
విషయాలన్నీ అవగాహన లేకే.. చిరువ్యాపారులు రాణించలేకపోతున్నారంటుంది మాన్
దేశీ సంస్థ. వ్యాపారంలో నైపుణ్యం లేని వారికి కూడా శిక్షణ తరగతుల్ని
నిర్వహిస్తున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే కచ్చితంగా ఉపాధి దొరికే
కోర్సులకే ప్రాధాన్యం ఉంటుంది.<br /><br />
మాన్ దేశీ స్కూల్ గురించి ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఏల్
యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్మెంట్, డ్యూక్, చికాగో యూనివర్శిటీలు కూడా ఆసక్తి
చూపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల్ని ఇక్కడికి పంపించి అధ్యయనం
చేయిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా మాన్ దేశీ గురించి ఆసక్తి
చూపించారు. ఆయన భారత్కు వచ్చినప్పుడు తనను కలవమని చేత్నా గలా సిన్హాకు
ఆహ్వానం పంపించారు. ముంబయికి వెళ్లిన చేత్నా ఒబాను కలిసి.. మాన్ దేశీ
గురించి వివరించారు. "ప్రపంచంలోనే బడుగుల కోసం ఏర్పాటు చేసిన బిజినెస్
స్కూల్ ఇదొక్కటే. ఇలాంటి స్కూళ్ల వల్ల పేదరికానికి పరిష్కారం దొరుకుతుంది. <br /><br />వృత్తుల్ని
నాశనం కాకుండా కాపాడుకోవచ్చు..'' అంటూ 'ద బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్'
ప్రశంసించింది. ప్రస్తుతం పేరున్న అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లన్నీ మాన్
దేశీ స్కూల్కు నిధులను, బోధనా సహాయాన్ని అందిస్తున్నాయి. హెచ్ఎస్బిసి,
యాక్సెంచర్, ఎస్ఐడిబిఐ, నబార్డ్ వంటి సంస్థలు తోడ్పాటునివ్వడం వారికి
కలిసొచ్చింది. ఇప్పటివరకు 30 వేల మంది మాన్ దేశీ బిజినెస్ స్కూల్లో
చదువుకున్నారు. వీరిలో డెభ్బైశాతం మంది చిరువ్యాపారాలను విజయవంతంగా
చేసుకుంటున్నారు. వీరందరికీ ఆర్థిక అక్షరాస్యత పెరగడమే కాకుండా.. జీవితం
పట్ల ఆత్మవిశ్వాసం ఏర్పడిందని అధ్యయనాలు చెబుతున్నాయి.<br /><br /><b style="color: blue;">ప్రయోగాల పాఠశాల..</b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/aug/12-8sun16.jpg" /></span>
<span style="font-size: large;">
మాన్ దేశీ స్కూలు ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. సాధారణ కోర్సులతో
సరిపెట్టుకోకుండా.. ప్రత్యేక కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాంటి కొత్త
కోర్సుల్లో ఒకటి 'బ్రాండెడ్ దేశీ ఎంబీఏ'. ఇందులో బ్రాండింగ్,
అడ్వర్టైజింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్లలో తర్ఫీదునిస్తారు. అమెరికాకు
చెందిన యాక్సియోన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కోర్సుకు వెన్నుదన్నుగా
నిలిచింది. ఇంత చేస్తున్నా.. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులకు ఈ బిజినెస్
స్కూల్లో చదువుకునే అవకాశం దొరకడం లేదు. అందుకే, చేత్నా గలా సిన్హాకు
కొత్త ఆలోచన తట్టింది. అదే 'మొబైల్ బిజినెస్ స్కూల్'. ఈ కార్యక్రమానికి
మాన్ దేశీ ఉద్యోగిని అని పేరుపెట్టారు. బస్సులోపల చక్కటి తరగతి గదిని
ముచ్చటగా డిజైన్ చేశారు.<br /><br /> ఇది బ్యాటరీతో ఎనిమిది గంటల సేపు
పనిచేస్తుంది. కంప్యూటర్లు, బ్లాక్బోర్డులు, వీడియోతెరలు అన్నీ ఉన్నాయి
ఇందులో. "వాళ్లు మా దగ్గరికి రావడం కష్టమైతే, మేమే వాళ్ల దగ్గరికి
వెళ్లాలన్నది మా ఆలోచన. దాని ఫలితమే ఈ మొబైల్ స్కూల్. ఇప్పటి వరకు
బస్సులోనే తొమ్మిది వేల మందికి చదువుకునే అవకాశం కల్పించాం...'' అని
చెప్పారు మాన్ దేశీ నిర్వాహకులు. తొలిదశలో కర్ణాటకలోని హుబ్లీలో మాత్రమే
మొబైల్ స్కూల్ను నడుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. "నేను ఇంట్లో కుట్టు
పని చేస్తాను. ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్గా శిక్షణ తీసుకుంటున్నాను. మా
ఊర్లో కరెంటు బిల్లులు చెల్లించే షాపును పెట్టాలనుకుంటున్నాను. అందుకు
సరిపడా సామర్థ్యం వచ్చిందిప్పుడు నాకు'' అని చెప్పింది పాతికేళ్ల భూమిక
సారె.<br /><br /><b style="color: blue;">లోకల్ రేడియో..</b></span>
<span style="font-size: large;"><br />
మాన్ దేశీ ఫౌండేషన్ పాపులారిటీ కారణంగానే ఈ స్కూలుకు కూడా ఇంత పేరు
వచ్చింది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ గత పదిహేనేళ్లుగా మహారాష్ట్రలోని కరువు
జిల్లాల్లో మహిళాభివృద్ధి కోసం ఎంతగానో పనిచేస్తోంది. విద్య, వైద్యం,
ఆర్థిక అక్షరాస్యత, పర్యావరణం, స్వయం సహాయక బృందాల గురించిన చైతన్యం
తీసుకొస్తోంది. అది పేదల్ని మేల్కొలిపేందుకు 'మాన్ దేశీ తరంగ్' అనే
కమ్యూనిటీ రేడియోను నెలకొల్పింది. చుట్టుపక్కల పల్లెల్లో ఈ రేడియో
కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. నాటకాలు, కథల రూపంలో పౌష్టికాహారం,
అంటురోగాలు, అక్షరాస్యత పట్ల నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాణాంతక
వ్యాధులైన ఎయిడ్స్ గురించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రసారాల్లో
గ్రామీణులను కూడా భాగస్వాములను చేస్తోంది రేడియో. ఓటరుకార్డు ఎలా
తీసుకోవాలి? బియ్యం కార్డు ఎక్కడ పొందవచ్చు? పండ్లు, కూరగాయల్ని ఎలా
పండించుకోవచ్చు? వారసత్వ ఆస్తుల్లో మహిళలకు ఎందుకు వాటా దక్కడం లేదు?
ఇలాంటి కార్యక్రమాలతోపాటు.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్ కోర్సుల వివరాలు,
ప్రవేశ సమాచారాన్ని కూడా ప్రసారం చేస్తుంటారు.<br /><br /><b style="color: blue;">పల్లె వెలుగులు..</b></span>
<span style="font-size: large;"><br />
మాన్ దేశీ ఫౌండేషన్ పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 'మాన్
దేశీ ఛాంపియన్స్' పేరుతో గ్రామీణ క్రీడాకారులకూ ప్రోత్సాహమిస్తోంది.
ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్లకు కావాల్సిన పరికరాల్ని,
దుస్తుల్ని సమకూరుస్తున్నారు నిర్వాహకులు. "గ్రామాలతో మాకు విస్తృతంగా
సంబంధాలు ఉండడం వల్ల.. బడి మానేసిన పిల్లలందరూ మా బిజినెస్ స్కూల్లో
చేరగలుగుతున్నారు'' అంటున్నారు సంస్థ ప్రధాన కార్య నిర్వహణాధికారిణి
వనితాషిండే.<br /><br />
ఒకసారి ఆస్మా తంబోలి అనే అమ్మాయి వాళ్ల ఆఫీసుకు వచ్చింది. తనకు ఏదైనా
పార్ట్టైమ్ ఉద్యోగం ఇస్తే చేస్తానంది. "ఇంత చిన్న వయసులోనే నీకెందుకు
ఉద్యోగం'' అని ప్రశ్నించారు సంస్థ ప్రతినిధులు. "ఊరి నుంచి బడికి
వెళ్లాలంటే చాలా దూరం. సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగితే బడి
మానేయమన్నారు'' అని సమాధానం ఇచ్చింది. ఉద్యోగంలో చేరితే వచ్చే జీతంతో
సైకిల్ కొనుక్కుని బడికి వెళ్లాలన్నది ఆ అమ్మాయి ఆలోచన. ఆ అమ్మాయి
అనుభవాన్నే స్ఫూర్తిగా తీసుకుంది మాన్ దేశీ సంస్థ. 'ఫ్రీడం రైడర్' పేరుతో ఓ
కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుపేద పిల్లలకు వడ్డీలేని రుణాలతో
సైకిళ్లను పంపిణీ చేసింది. దీనివల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది.<br /><br />
మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు.
దానికొక మార్గం కనిపెట్టింది మాన్ దేశీ. ఎండకు, వానకు గంటల తరబడి కూర్చోవడం
వల్లే.. అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు నిర్ధ్దారించారు.
చిరువ్యాపారులు పనిదినాలను కోల్పోవడం వల్ల అప్పులు పెరిగిపోతాయి కదా. కొంత
ఆలోచించాక మార్కెట్లోని ప్రతి చిరువ్యాపారికి పెద్ద గొడుగును అందించే
'అంబ్రెల్లా ప్రోగ్రామ్'ను ప్రవేశపెట్టింది మాన్ దేశీ. వాళ్లు ఆశించిన
ఫలితాలే వచ్చాయి.<br /><br />
చిన్నకారు రైతుల్ని గట్టెక్కించేందుకు ఉచిత భూసార పరీక్షలు, పశు వైద్యం,
పాడి పోషణ మొదలైన సదుపాయాల్ని కూడా కల్పిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో
పాలడైరీలను కూడా ఏర్పాటు చేశారు.<br />
"మాన్ దేశీ బ్యాంకు, మాన్ దేశీ స్కూలు ఇవి రెండూ మాకు రెండు కళ్లులాంటివి.
నాకు బాల్యవివాహం అయింది. భర్త చనిపోయాడు. స్కూల్లో చేరాక.. కొత్త జీవితం
మొదలైంది. గతంలో నాకైతే నోట్లను లెక్కపెట్టడం కూడా చాతనయ్యేది కాదు.
ఇప్పుడు ఎంత మొత్తానికి ఎంత వడ్డీ అవుతుందో నోటికి చెప్పేస్తున్నా...''
అంటోంది లక్ష్మీ షీలర్. మాన్ దేశీలో చదువుకున్న మరో గ్రాడ్యుయేట్ నందిని
లోహర్. ఆమె గోండవ్లె కర్మరాజ్ గుడి దగ్గర దేవుని పటాలు అమ్ముతుంటుంది.
ఒకప్పుడు భవిష్యత్తు ప్రణాళిక ఉండేదే కాదు. "పండుగలు, ఊరేగింపులు,
జాతర్లప్పుడు.. గుడికి భక్తుల సందడి చాలా ఎక్కువ. కాని, నా చేతిలో రూపాయి
ఉండేది కాదు. డిమాండ్కు తగినట్లు పటాలను పెట్టలేకపోయేదాన్ని. స్కూల్లో
చేరా ముందే ముడిసరుకును ముందే ఎందుకు కొనాలో అర్థమైంది. అందుకే సీజన్ రాక
ముందే కలప ఫ్రేములు, గ్లాసు, కటింగ్ పరికరాలు, పోస్టర్లు కొనుక్కొచ్చి
దాస్తాను. సీజన్ వచ్చేనాటికి పటాలు తయారుచేసి ఉంచడంతో లాభాలు పెరిగాయ్..''
అంటూ చెప్పుకొచ్చింది నందిని.<br /><br />
రైతులకు కూడా చేయూతనిస్తోందీ సంస్థ. ఈ ఏడాది మన రాష్ట్రంలోలాగే
మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవడం లేదు. సతారా ప్రాంతంలో కరువు వల్ల పాడి
పశువుల్ని అమ్మేసుకోవాల్సి వస్తోందని మాన్ దేశీ స్కూల్లో చేరిన నిరుపేదలు
సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లు వెంటనే స్పందించి ఉచిత పశు సంరక్షణ
శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పరిసర గ్రామాల ప్రజలు పశువుల్ని,
మేకల్ని తోలుకొస్తే వాటికి గడ్డి, దాణాతోపాటు రైతులకు ఉచిత భోజన వసతులు
కల్పించారు. దీంతో రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మహారాష్ట్ర
ముఖ్యమంత్రి కూడా ఈ శిబిరాన్ని సందర్శించారు. వర్షాలు జోరందుకునే వరకు
శిబిరాన్ని కొనసాగించనున్నట్లు మాన్ దేశీ ప్రకటించింది.<br /><br /><b style="color: blue;">వారెన్ బఫెట్ ఆసక్తి...</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/12-8sun17.jpg" /></span>
<span style="font-size: large;">
"మాన్ దేశీ బిజినెస్ స్కూల్లో బోధించే ఆర్థిక పాఠాలు ఏ పుస్తకాల్లోనూ
కనిపించవు. నిరుపేదల జీవితాలను అధ్యయనం చేసి తయారుచేసినవి ఇవి. ఉదాహరణకు
మీకొక విషయం చెబుతాను.. భారతదేశంలో మగవాళ్లకు తాగుడు అలవాటు ఎక్కువ.
నిరుపేదల్లో ఇది మరీ ఎక్కువ. మగవాళ్ల తాగుడు వల్ల తీవ్రంగా నష్టపోతున్నది
ఆడవాళ్లే! రోజూ కూలికి వెళ్లి వందో రెండొందలో ఇంటికి తీసుకొస్తే.. దాని
కోసం మగవాళ్లు కూచుక్కూర్చుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు సెంటిమెంటును
వాడుకున్నాం. ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని లాక్కెళ్లడం చాలా సులువు. అదే,
భార్య మెడలో వేసుకున్న బంగారు గొలుసులనో, చేతులకు తొడుక్కున్న గాజులనో
తీసుకెళ్లడం కొంత వరకు కష్టం. అలా చేసిన మగవాళ్లను మా సమాజం గౌరవించదు.
అందుకే, ఆడవాళ్లందరూ అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకున్నాక బంగారాన్ని కొనమని
ప్రోత్సహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. సమస్య చాలా వరకు తగ్గింది..''<br /><br />
చేత్నా గలా సిన్హా ప్రసంగం పూర్తి కాకముందే.. ఓ పెద్దాయన లేచి నిల్చుని
చప్పట్లు కొట్టాడు. ఇదొక మంచి ఆర్థికపాఠం అన్నారు. ఆయన ఎవరో కాదు
ప్రపంచంలోనే అపర కుబేరుడైన వారెన్ బఫెట్. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్
అమెరికాకు ఆహ్వానిస్తే.. చేత్నా అమెరికాకు వెళ్లింది. ఆ సమావేశానికి
బిల్గేట్స్, వారెన్ బఫెట్లాంటి హేమాహేమీలంతా హాజరయ్యారు. ఆమె ప్రసంగానికి
ఎంతోమంది దాతలు స్పందించారు. బడుగుల బిజినెస్ స్కూల్ గురించి వివరాలు
అడిగి తెలుసుకున్నారు.<br /><br /><b style="color: blue;">మా వృత్తికి గౌరవం తీసుకొచ్చాను..</b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/aug/12-8sun50.jpg" /></span>
<span style="font-size: large;">
బుట్టలు అల్లే మేదరి వృత్తి మాది. మాన్ దేశీ బిజినెస్ స్కూల్లో చేరేవరకు
వ్యాపార కిటుకులు నాకు పెద్దగా తెలియవు. కోర్సు పూర్తయ్యాక కొత్త
ప్రపంచంలోకి వెళ్లినట్లుంది. ఇదివరకు అప్పటికప్పుడు వెదురు తెచ్చుకుని
బుట్టలు అల్లి అమ్ముకునేదాన్ని. మార్కెట్ గిరాకీ కూడా తెలిసేది కాదు. గతంలో
మధ్యవర్తుల నుంచి వెదురు కొనడం వల్ల గిట్టుబాటయ్యేది కాదు. ఇప్పుడు రైతుల
నుంచే నేరుగా కొంటున్నాను. మా ఊరి నుంచి ముంబయికి 270 కిలోమీటర్లు.
బుట్టల్ని ముంబయి తీసికెళ్లి అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేశాను. దీన్నే
వ్యాపార పరిభాషలో బిజినెస్ ప్లానింగ్ అంటారట. ఆ విషయాన్ని స్కూల్లో
చెప్పార్లెండి. <br /><br />ముంబయిలోని పండ్లు, కూరగాయల వ్యాపారులతో
సంప్రదింపులు జరిపాను. రెగ్యులర్గా బుట్టల్ని కొనేందుకు వారు ఒప్పుకోవడంతో
నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు బుట్టలు కొనేవాళ్లే లేరని
దిగులుపడేదాన్ని. ఇప్పుడు ఎంత పని చేస్తే అంత మార్కెట్ ఉందని అర్థమైంది.
బస్సు ఎక్కాలంటేనే భయపడే నేను ఇప్పుడు సెల్ఫోన్లో వ్యాపారులతో
మాట్లాడుతున్నాను. చెక్కుల మీద సంతకాలు చేస్తున్నాను. నెలకు ఒకసారి
నేనొక్కదాన్నే ముంబయికి వెళ్లి వస్తున్నాను. ఒకప్పుడు నన్ను ఊర్లో వాళ్లు
పేరు పెట్టి పిలిచేవాళ్లే కాదు. ఇప్పుడు 'మాలన్గారు' అంటున్నారు. నాద్వారా
మా వృత్తికి కూడా గౌరవం పెరిగినందుకు సంతోషంగా ఉంది.<br /><b style="color: purple;">- మాలన్, మేదరి వృత్తి </b></span>
<span style="font-size: large;"><br /><br /><b>* సండే డెస్క్, Andhra Jyothy</b></span>
</div>
</div>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1005574589812494394.post-77910648845846175422012-06-03T09:48:00.000-07:002012-06-03T09:48:54.121-07:00మామిడి రా'రాజులు'<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><h1 class="headline"></h1><div id="page1"><div class="RunningText"><span style="font-size: large;"> <a href="http://3.bp.blogspot.com/-_G5whTA8W8w/T8uUmL1IMwI/AAAAAAAAnvI/jJctkvhHvtI/s1600/mango.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-_G5whTA8W8w/T8uUmL1IMwI/AAAAAAAAnvI/jJctkvhHvtI/s400/mango.jpg" width="343" /></a><br />
<b><br />
<span style="color: red;">ఇన్నాళ్లూ మండుటెండల్లో వేపుకుతిన్న వేసవి.. మరికొన్ని రోజుల్లో వెళ్లిపోతోంది. వేసవి ఎండల్ని భరించిన అందరికీ మధురమైన జ్ఞాపకం ఏదైనా ఉందా అంటే .. అది మామిడి మాధుర్యం అనే చెప్పవచ్చు. పండ్ల రుచుల్ని ఆస్వాదించిన వాళ్లకే కాదు. మామిడిని సాగు చేస్తున్న రాజుల కుటుంబాలకూ ఇదే అనుభవాన్ని మిగిల్చి వెళుతోంది ఈ వేసవి. మామిడి సాగులో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. పరువు కోసం పంట పండించే ఈ సామాజిక వర్గం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో వేలాది ఎకరాల మామిడి తోటల్ని సాగు చేస్తోంది. తరతరాల వారసత్వ సంపదగా భావిస్తోంది. దేశంలోనే అరుదైన మామిడి రకాల్ని పండించి.. ప్రధాన నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు ఎగుమతుల్ని చేస్తోంది. </span></b></span></div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><span style="font-size: large;"><b><span style="color: red;">రాజుల మామిడి సాగుపైనే ఈ స్టోరీ..</span></b><br />
<img align="right" height="232" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun31.jpg" width="400" /><br />
<b style="color: purple;">పండ్లలో రారాజు?<br />
మధురఫలం, అదేనండీ మామిడి.<br />
మరి, మామిడిని పండించడంలో మారాజులు ఎవరు?<br />
ఇంకెవరు? విజయనగరం రాజులు.<br />
రాజులు రాజ్యాలను కోల్పోయినా.. మామిడితోటల మీద మమకారాన్ని ఇప్పటికీ వదులుకోవడం లేదు.</b></span> <span style="font-size: large;"><br />
<br />
విజయనగరం, బొబ్బిలి ఒకప్పటి రాజుల సంస్థానాలు. ఇప్పుడవి లేవు కాని, వాళ్ల అడుగుజాడల్లో మొలకెత్తిన విలాసమైన మామిడితోటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తోటల సాగులో నష్టమొచ్చినా, కష్టమొచ్చినా.. రాజదర్పం ఊరికే ఉండనిస్తుందా? అప్పులు చేసైనా సరే, ఆస్తులు కరిగిపోయినా సరే.. పచ్చటి తోటలు కళకళలాడాల్సిందేనంటున్నారు రాజులు. తోటల్లోనే రాజప్రాసాదాలు నిర్మించి (గెస్ట్హౌస్లు) మామిడిని పండించడం వీరి సంప్రదాయం. ఈ సంస్కృతి పాతకాలం రాజుల నుంచే వచ్చినా ఇప్పటికీ కొనసాగుతోంది. తాతతండ్రుల నుంచి వచ్చిన మామిడి తోటలంటే ప్రతి రాజు కుటుంబానికీ మహా ప్రీతి.<br />
<br />
విజయనగరంలో అప్పటి రాజవంశీయులైన పీవీజీ రాజు మొదలుకొని ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్గజపతి రాజుల వరకు మామిడితోటల సాగును వారసత్వ సంపదగా భావిస్తున్నారు. బొబ్బిలి సంస్థాన పాలకులైనవెలమదొర రాజారావు బహుదూర్ రంగారావు కుటుంబం మామిడి తోటలకు పెట్టింది పేరు. ఈ రెండు కుటుంబాల రాజవంశీయులతోనే మామిడితోపుల సాగుకు బాటలు పడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో 15 వేల హెక్టార్లను రాజుల సామాజికవర్గమే సాగు చేస్తున్నది.<br />
<br />
మామిడిపంటల మీద రాజులకు ఎప్పటి నుంచో మోజుంది. బొబ్బిలి సంస్థానంలో ఒకటైన రాజాం (శ్రీకాకుళం) కోట పరిసరాల్లో 'గుర్రాం' అనే ఒక రకం మామిడి చెట్టు ఉండేదట. ఆ చెట్టు పండ్లు రాలిన వెంటనే బొబ్బిలి రాజావారికి అందజేయడానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసేవారట. అలనాడు రాజుల మనసుదోచిన ఆ మామిడి పండ్లకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. ఒకప్పటి తీపిగుర్తుగా గుర్రాం రకం మామిడితోటల్ని వెలమదొరలు ఈనాటికీ వందలాది ఎకరాల్లో సాగు చేస్తుండటం విశేషం. బొబ్బిలి వెలమదొర సాలా వెంకట మురళి కృష్ణ వంద ఎకరాల్లో 30 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. అత్యంత నాణ్యమైన 'కేసరి' రకానికి 2009లో రాష్ట్రస్థాయి ప్ర«థమ బహుమతి దక్కింది. అమ్రపాలి, నీలిమ రకాలకు కూడా ఆ తరువాతి సంవత్సరం మరో అవార్డు లభించింది. విజయనగరం, బొబ్బిలిలోని మామిడితోటల మాధుర్యం.. ఢిల్లీని కూడా తాకింది. సీజన్ వచ్చిందంటే చాలు.. రాజధాని నుంచి మామిడి వ్యాపారులు ఉత్తరాంధ్రకు పరిగెత్తుకొస్తారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు ఎగుమతి చేస్తున్నారు.<br />
<br style="color: blue;" /><b style="color: blue;">తోటలే బంగారం...</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun32.jpg" /></span> <span style="font-size: large;"> రాజుల మామిడికి దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ రావడం వెనుక తరాల శ్రమ దాగుంది. లాభాల కోసం రాజులు వ్యవసాయం చేయరు. నిష్టతో ప్రతిష్ట కోసం పంట పండిస్తారు. చదువు సంధ్యలకంటే మామిడితోటల పెంపకంపైనే ఎక్కువ శ్రధ్ధ కనబరుస్తారు. మొక్కలు నాటిన రోజు నుంచి పెరిగి పెద్దయి, కాపుకొచ్చే వరకు వారి కంటి మీద కును కుండదు. నిజానికి ఈ ప్రాంతంలో మామి డికంటే.. సరు గుడు తోటల సాగే బాగా గిట్టుబాటు అవుతుంది. కాని రాజులు మామిడిని కాదని మరో పంటను సాగు చేసేందుకు ఇష్ట పడరు. "ఎకరా సరుగుడు తోటకు ఎంత లేదన్నా రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం వస్తుంది. <br />
<br />
కాని ఇవి భూగర్భజలాలను హరిస్తాయి. అందుకే మా కుటుంబాలకు మామిడి తోటలంటేనే ప్రాణం. మామిడి పర్యా వరణానికి మేలు చేస్తుంది. పది మందికి తియ్యటి ఫలాల్ని అందించామన్న సంతృప్తిని మిగిలిస్తుంది. అందుకే దిగుబడి ఎంత వచ్చినా వెనుకంజ వసే ప్రసక్తే లేదు'' అంటు న్నారు రాజులు. మధ్య తరగతి కుటుం బాలు ఎంత బంగారం ఉంటే అంత భద్రత ఉన్నట్లు భావిస్తారు. రాజులు కుటుంబాల్లో అలా కాదు. పెళ్లిళ్లతో బంధు త్వాల్ని కలుపు కోవాలన్నా, ఎన్ని ఎకరాల మామిడి తోటలు ఉన్నాయో? చూశాకే ఇంట్లో మేళ తాళాలు మోగుతాయి. ఆడ పిల్లలకు బంగారానికి బదులు మామిడితోటల్ని కట్నంగా రాసిస్తా రంటే.. వాటికున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.<br />
<br style="color: blue;" /><b style="color: blue;">ఎక్కడ ఎక్కువ సాగు..?</b></span> <span style="font-size: large;"><br />
ఆలమండ, భీమాలి, జొన్నవలస, గంట్యాడ, డెంకాడ, కొత్త వలసలలో వేలాది ఎకరాల మామిడి తోటల్ని రాజులే సాగు చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్లోని బొబ్బిలి పరిధిలో వెలమదొరల తోటలు ఉన్నాయి. మామిడి మొక్కల నర్సరీలను కూడా రాజులే పెంచుతున్నారు. ఎల్.కోటలోని భీమాలి రాజుల నర్సరీలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా పేరొందిన మేలైన మామిడి రకాల మొక్కలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. విజయనగరం, బొబ్బిలి రాజులు సాగు చేస్తున్నన్ని మామిడి రకాలు మరెక్కడా సాగు కావడం లేదు. వ్యాపార అవసరాల కోసం వేసిన దేశవాళీ, హైబ్రీడ్, నార్త్ ఇండియా, సౌత్ఇండియాలతో కలిపి 50 మామిడి రకాలను సాగు చేస్తున్నారు. బంగినపల్లి, సువర్ణరేక, పనుకులు, చిన్నరసం, పెద్దరసం, చెరుకురసం, బారామతి (పునాస మామిడి), కోలంగోవ, హిమామ్ పసంద్, దసేరీ, లంగడా, నీలం, మల్లిక, ఆమ్రపాలి, కేసర్, సఫేదా, సుయా, నీలుద్దీన్, నీలిషాన్, జహంగీర్, స్వర్ణ జహంగీర్, పెద్ద సువర్ణరేక, పోలిపిల్లి సువర్ణరేక, పానకాలు, ఆల్ఫాన్సో వంటి రకాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.<br />
<br />
<b style="color: blue;">'మార్చి'కొస్తే మంచిది...</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun33.jpg" /></span> <span style="font-size: large;"> ఇక్కడి వాతావరణానికి సరిపోయే పనుకు మామిడి, రాజు మామిడి రకాలను మొట్టమొదట విజయనగరంలో సాగుచేసింది రాజులే. అయితే సువర్ణరేక, బంగినపల్లి రకాల మాదిరిగానే ఇవి కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు దిగుబడి రాకపోవడంతో రైతులకు ఇబ్బందులొస్తున్నాయి. అందుకే, మార్చిలోపు పంట చేతికొచ్చే కొత్త రకాల కోసం అన్వేషిస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్లో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు నష్టం వాటిల్లుతోందని రాజుల అభిప్రాయం. మార్చిలోపు పంట చేతికొస్తే, వాతావరణ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అందుకే ఇలాంటి రకాల కోసం పరిశోధించాలని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు (ఐఏఆర్ఐ) జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోషియేషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మధ్య ఐఏఆర్ఐ పరిశోధనల్లో వెలువడిన కొత్త రకాలు.. పూసాప్రతిపా, పూసా ఫాస్ట్, పూసా లాలీమాలు కూడా మార్చి తర్వాతే దిగుబడిని ఇస్తున్నాయి.<br />
<br />
మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు విజయనగరం జిల్లా నుంచి కేవలం మామిడి వ్యాపార ఎగుమతుల వల్లే.. ఈస్ట్కోస్టు రైల్వేకు రూ.5 కోట్లు రాబడి వస్తుంది. రైల్వే వ్యాగన్ల ద్వారా విజయనగరం నుంచి న్యూఢిల్లీకి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి. ఏడాది ముందుగానే ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి రైతులకు పెట్టుబడులు ఇచ్చి మరీ మామిడి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క ఢిల్లీయే కాకుండా, కోల్కతా, ఒడిశ్సాలకూ విజయనగరం నుంచే మామిడి పండ్లు వెళుతున్నాయి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీకి మాత్రమే 40 వ్యాగన్ల సరుకు ఎగుమతయ్యింది. ఢిల్లీకి సరుకు చేరాక.. అట్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్కు మామిడి వెళుతోంది.<br />
<br style="color: blue;" /><b style="color: blue;">మింగేస్తోన్న రియల్ఎస్టేట్..?</b></span> <span style="font-size: large;"><br />
రింగురోడ్లు, సెజ్లు, అణువిద్యుత్ ఫ్యాక్టరీలు.. ఇవన్నీ సేద్యపు భూముల్ని మింగేస్తున్నట్లే.. రియల్ఎస్టేట్ దెబ్బకు మామిడితోపులు కూడా మాయమైపోతున్నాయి. తరాల నుంచి కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడితోటలు రకరకాల సమస్యల వల్ల కనుమరుగైపోవడం ఈ ప్రాంతవాసుల్ని కలచి వేస్తోంది.<br />
కొత్తవలసలోని గులిపల్లి దగ్గరున్న మిస్సమ్మ మామిడి తోటలంటే చుట్టుపట్టు పల్లెల్లో పెద్ద పేరుండేది. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలు ఇప్పుడు కనిపించడం లేదు. వన్నెపాలెంలో వందేళ్ల వయసున్న 300 ఎకరాల మామిడి తోటలు ఉండేవి. దిగుబడి తగ్గిపోవడంతో.. మామిడి చెట్లను తొలగించి లే అవుట్లను వేశారు. ఈ తోటలన్నీ ఒకప్పుడు రాజులవే! ఎన్ని సంక్షోభాలు ఎదురయినా.. మామిడితోటల పెంపకంపై వారి ఆసక్తి మాత్రం చావడం లేదు. అందుకే, భూముల్ని అమ్మేసినా.. మరో ప్రాంతంలో భూముల్ని కొనుగోలు చేసి, కొత్త తోటల్ని సాగు చేస్తున్నారు.<br />
<br />
<b style="color: blue;">ఒక్కొక్క రైతుదీ ఒక్కో కథ..</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun37.jpg" /></span> <span style="font-size: large;"> విజయనగరవాసి మునగపాటి సీతారామరాజు కుటుంబానికి వందేళ్లుగా మామిడితోటలే జీవనాధారం. తాత నారాయణరాజు నుంచి తండ్రి రామ్మూర్తిరాజుకు మామిడితోట వారసత్వంగా వచ్చింది. "నాకు నా చిన్నతనం నుంచే మామిడితోటలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే, ఆ తోటల్ని విడిచి నేను పెద్ద చదువులు కూడా చదువుకోలేక పోయాను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లకు మంచి చదువులు అబ్బలేదు. మామిడితోటల మీదే ఆసక్తి ఏర్పడింది..'' అన్నారు సీతారామ రాజు. ప్రస్తుతం జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన విజయనగరం లాంటి జిల్లాలో వరి పంట తరువాత రైతుకు ఆదాయాన్నిచ్చే మేలైన పంటలు ఏవీ లేవంటారు. జిల్లాలో జనుము, వేరుశనగ సాగు పూర్తిగా అంతరిం చింది. <br />
<br />
అందుకే, పల్లపు భూముల్లోనూ మామిడిని పండిస్తు న్నారు. ఇక్కడ మామిడిసాగు కుటుంబ ప్రతిష్టకు సంబంధించినది కూడా. దాని కోసం ఏమైనా చేస్తాం అంటారు కొత్తవలస రైతు దండు నరశింహరాజు లాంటి వాళ్లు. మొక్కలు పెంచే సమయంలో నీళ్లు లేకపోతే.. రెండ్రోజులకు ఓసారి స్వయంగా నీళ్లు పోసి పోషించుకున్నారాయన. మామిడి ఎగుమతి గురించి మాట్లాడుతూ "పెద్ద మార్కెట్లకు ఒకేసారి అన్ని ప్రాంతాల నుంచి మామిడి ఎగుమతి అవుతోంది. దీంతో మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుంది..'' అన్నారు రాజు. నలభై ఎకరాల్లో మామిడి తోటను సాగుచేస్తున్న నరశింహ రాజు ఏడాదికి పెట్టుబడి కిందే రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది భారమైనా మారే ఆలోచన చేయడం లేదు. "ఇంత పెట్టు బడిపెట్టి నష్టపోయే బదులు మరో పంట వేసుకోవచ్చు కదా'' అని తోటి రైతులు చెప్పినా రాజుకు మామిడిని వదిలే ఉద్దేశ్యం లేదిప్పుడు. ఎందుకంటే, ఆయనకు మామిడి తోటలతో 60 ఏళ్ల అనుబంధం ఉంది. తోటల సమీపంలోనే రూ.30లక్షలతో అతిథి గృహాన్ని నిర్మించుకుని సంతోషంగా జీవిస్తున్నారు శివరామరాజు కుటుంబీకులు.<br />
<br />
మామిడి రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య దళారీ వ్యవస్థ. దీన్ని తగ్గిస్తే రాజుల మామిడితోటలు ఇంత వేగంగా కరిగిపోవంటున్నారు లక్కవరపుకోట మండలం భీమాలికి చెందిన రైతు ముదునూరు జోగి జగన్నాథరాజు. మామిడిని సాగు చేయడంలో ఈ కుటుంబానికి ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఎకరాల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నది. "దళారీల వల్ల మాలాంటి కౌలు రైతులకు నష్టాలే మిగులుతున్నాయి..'' అని ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజుకు చెందిన ఇద్దరు కొడుకులు కూడా మామిడి సాగు మీదే జీవనం సాగిస్తున్నారు.<br />
<br />
<b style="color: blue;">నర్సరీలను పెంచుతూ..</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun39.jpg" /></span> <span style="font-size: large;"> ఏ పరిశోధనశాలలో కొత్తరకం మామిడి మొక్కను ఉత్పత్తి చేసినా.. విజయనగరం, బొబ్బిలికి రావాల్సిందే. అందుకే, నర్సరీలను సైతం ఇక్కడి రైతులే నిర్వహిస్తున్నారు. బంగినపల్లి, కోలంగోవ, పణు మామిడి రకాల మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి. "మేము నర్సరీలను పెంచుతున్నాం. అయితే, ఇక్కడ వస్తున్న ఇబ్బందల్లా ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు లేకపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి యార్డులను ఏర్పాటు చేస్తే మంచిది. రైతులే నేరుగా పంటల్ని తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రిలలో ఈ పద్ధతి అమలవుతోంది'' అంటున్నారు భీమాలికి చెందిన కమ్మెళ్ల కృష్ణంరాజు.<br />
<br />
మామిడి సాగులో తరిస్తున్న రాజుల కుటుంబాలు.. వ్యాపార అవసరాలకే పంట పండించరు. తోటల్లోకి కొన్ని మధురమైన మామిడి చెట్లను సొంతానికి కూడా పెంచుకుంటారు. బంధువులు, స్నేహితులకు ప్రతి సీజన్లోనూ మామిడి పండ్లను అభిమానంతో బహుమానంగా పంపించడం అలవాటు. "సేద్యంలో దిగుబడి అనేది శ్రమకు దక్కే ప్రతిఫలం. ఆ ఫలితాన్ని పదిమందితో పంచుకుంటే గొప్ప సంతృప్తి కలుగుతుంది. అందుకే, మాకు మామిడి వాణిజ్య పంటే కాదు. అనుబంధాల్ని మరింత మధురం చేసే పంట'' అంటూ తరిస్తున్నారు రాజు కుటుంబాల్లోని మామిడి రైతులు.<br />
<br />
<b style="color: blue;">మాది వందేళ్ల తీపి బంధం</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun34.jpg" /></span> <span style="font-size: large;"> మామిడి తోటలతో మా కుటుంబానికి వందేళ్ల అనుబంధం అల్లుకుంది. ముత్తాతల నుంచి తోటల పెంపకం, వ్యాపారం చేస్తున్నాము. మా నాన్నగారి తరం వరకు మామిడి సాగుతోపాటు వ్యాపారమూ లాభసాటిగానే ఉండేది. ఇప్పుడు భారంగా మారింది. రైతులు, వ్యాపారులు ఇద్దరూ సంతోషంగా లేరు.<br />
ప్రస్తుతం భీమాలిలో నర్సరీని పెంచుతున్నాం. రైతులకు మొక్కల్ని సరఫరా చేసి.. బతుకుతున్నాం. ఇన్నాళ్లూ మామిడి తోటలే మమ్మల్ని బతికించాయి. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కదాని.. మరో పని చేయడానికి సిద్ధంగా లేము. రాజుల కుటుంబాల్లో ఎంత నిరుపేదలైనా కూలి పని చేయడానికి ఇష్టపడరు. అందుకే, ఈ బాధలు పడుతున్నాం.<br />
<b>- ముదునూరు గోపాలకృష్ణ, బలిగట్టం</b></span> <span style="font-size: large;"><br />
<br style="color: blue;" /><b style="color: blue;">30 రకాలను సాగు చేస్తున్నాం</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun35.jpg" /></span> <span style="font-size: large;"> దేశంలో దొరికే మామిడి రకాలన్నీ మా తోటలో పండించాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం వందెకరాల భూమిలో 30 రకాల మామిడి చెట్లను పెంచుతున్నాం. మామిడి సాగులో మా కుటుంబానికి వందేళ్ల అనుభవం ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హైబ్రిడ్, స్థానిక రకాలు మంచి దిగుబడినే ఇస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం సువర్ణరేక, బంగినపల్లి, కోలంగోవ, కలెక్టరు రకాలను పండిస్తాం. ఇంటికి, బంధుమిత్రులకు నార్త్ ఇండియా రకాలైన దశరి, అయినా, లాంగరా, సఫేదా, కేసరి, మాల్టా, మాల్గోవా, రత్నా, అల్పాన్జో రకాలను వేశాము. కేసరి రకానికి 2009లో రాష్ట్రస్థాయి మామిడి పోటీలో ప్రథమ బహుమతి దక్కింది. సౌత్ ఇండియా మామిడి రకాలైన నీలిమా, ఆమ్రపాలి, రకాలకు 2010లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. స్థానిక రకాలైన బొబ్బిలి పీచు, మెట్టవలస, ఫిరంగి లడ్డూ, గుర్రాం, కృష్ణపసందు, స్వర్ణ సింధూ, జలాలు కూడా మధురంగా ఉంటాయి. మెట్టవలసపీచు, బొబ్బిలి పీచులనే మామిడి రకాల్లో.. 70 పండ్ల ధర రూ.7000 పలికింది.<br />
<br style="color: blue;" /><b style="color: blue;">కౌలు భూమి తగ్గింది...</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun36.jpg" /></span> <span style="font-size: large;"> ఒకప్పుడు వందల ఎకరాల్ని తీసుకుని కౌలుకు సాగు చేశాం. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. మామిడితోటలున్న భూములు కూడా తగ్గిపోయాయి. ఉన్నంతలో తక్కువ విస్తీర్ణంలో అయినా.. సొంతంగా సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అది కూలీల సమస్య. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంతో అన్ని గ్రామాల్లోనూ కూలీల కొరత ఏర్పడింది. అక్కడక్కడ దొరికే కూలీలు కూలీ రేట్లు పేంచేశారు. వస్తున్న దిగుబడికి, పెడుతున్న పెట్టుబడికి సరిపోవడం లేదు. అన్ని పంటల్లాగే మామిడికీ ఇవే కష్టాలొచ్చాయి. వీటన్నిటికి తోడు దళారులు మమ్మల్ని తినేస్తున్నారు.<br />
<b>- ఎం.వెంకట సత్యనారాయణరాజు, కొత్తవలస</b></span> <span style="font-size: large;"><br />
<br style="color: blue;" /><b style="color: blue;">రైతులు మారాలి..</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/jun/3/images/3-6sun38.jpg" /></span> <span style="font-size: large;"> మారుతున్న కాలానికి అను గుణంగా మామిడి రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం లేదు. అలా చేస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. వందలాది ఎకరాల్లో తోటలు సాగుచేసినప్పుడు ఎకరానికి మరో ఎకరానికి కొంత దూరం ఉండాలి. చెట్లు సంఖ్య పెరగాలనే ఆశతో రైతులు ఇలాంటి పద్ధతుల్ని అమలు చేయడం లేదు. దీనివల్ల మామిడి కోతలప్పుడు.. కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దిగుబడి అమ్మకాల్లో కూడా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. సీజన్లో పెరిగే ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. అందుకే, రైతులే పంట ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముకునే పరిస్థితి రావాలి.<br />
<b>- రహీమ్, ఉద్యానవన శాఖాధికారి, విజయనగరం</b></span> </div><div class="RunningText"><span style="font-size: large;"><b>by</b></span></div><div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: large;"><a href="http://3.bp.blogspot.com/-_G5whTA8W8w/T8uUmL1IMwI/AAAAAAAAnvI/jJctkvhHvtI/s1600/mango.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><br />
</a></span></div><div class="RunningText" style="color: red;"><span style="font-size: large;"><b>* బిర్లంగి ఉమామహేశ్వరరావు,<br />
విజయనగరం</b></span></div></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-3969941355006375312012-05-13T04:04:00.000-07:002012-05-13T04:04:52.928-07:00నయా (ఈస్ట్) ఇండియా కంపెనీలు!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://1.bp.blogspot.com/-y7dVSRNvayg/T6-Um15YYWI/AAAAAAAAnCA/bB7eSOw31aU/s1600/Africa.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="http://1.bp.blogspot.com/-y7dVSRNvayg/T6-Um15YYWI/AAAAAAAAnCA/bB7eSOw31aU/s400/Africa.jpg" width="347" /></a></span></div>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><b><br /><br />
<span style="color: red;">మన రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండే భూమి ఎకరం ఖరీదు ఎంత ఉంటుంది?</span><br style="color: red;" /><span style="color: red;">
ఏ లెక్కలో తీసుకున్నా సగటున 10 లక్షలైనా ఉంటుంది.</span><br style="color: red;" /><span style="color: red;">
కాని ఒక ఎకరం భూమిని కొంటే చాలదు. నాణ్యమైన విత్తనాలు వేయాలి.
శక్తిమంతమైన ఎరువులు చల్లాలి. అదృష్టం బావుండి పంట బాగా పండితే కోత
కోయటానికి ఎక్కువ మంది కూలీలను పెట్టాలి. వీటికి తోడుగా- నీరు, విద్యుత్లు
వాడుకున్నందుకు పైకం చెల్లించాలి. ఇంత చేసిన తర్వాత కూడా పంటకు సరైన రేటు
రాకపోవచ్చు. అంటే లక్షల ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తే వచ్చేది నష్టమే. ఇదీ
మన దేశంలో రైతుల పరిస్థితి.</span><br style="color: red;" /><span style="color: red;">
అదే పదిలక్ష రూపాయలకు ఒక పదమూడు వేల ఎకరాల భూమి వస్తే? పైగా అది మంచి
భూసారమున్న భూమైతే? ఆ భూమి కొనటానికి ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇస్తే?
దానిలో పండిన పంటను ఎగుమతి చేస్తే ? ఆ ఎగుమతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే?</span><br style="color: red;" /><span style="color: red;">
బాబ్బాబు.. అలాంటి అవకాశం ఎక్కడుందో చెప్పు. అప్పోసొప్పో చేసి వ్యవసాయం
చేసుకు బతికేస్తాం అంటున్నారా? మీరు ఈ కొత్త తరహా వ్యవసాయానికి ట్రై
చేయచ్చు కాని- మీ కన్నా ముందు దాదాపు ఎనభై కంపెనీలు ఈ రకమైన వ్యవసాయంలో
ఇప్పటికే దాదాపు 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేసాయి.</span></b></span><span style="font-size: large;"><img align="right" height="274" src="http://www.andhrajyothi-sunday.com/2012/may/13/images/13-5sun37.jpg" width="400" /><b><br /></b></span><span style="font-size: large;"><b><span style="color: red;"></span></b><br /><br />
ఇప్పటిదాకా ఆ విషయం మనకు ఎందుకు తెలియలేదంటే.. ఈ భూమంతా ఆఫ్రికాలోని
ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనగల్, మొజాంబిక్ మొదలైన దేశాల్లో ఉంది.
చైనా, ఉత్తర కొరియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన కంపెనీలతో పోటీ పడి మన
వాళ్లు ఆఫ్రికాలో వ్యవసాయ భూములను లక్షల ఎకరాల చొప్పున లీజుకు
తీసుకుంటున్నారు. అయితే మన వాళ్లు కుదుర్చుకుంటున్న ఒప్పందాల వల్ల తాము
చాలా నష్టపోతున్నామని ఆయా దేశాల్లో నివసించే స్థానిక ప్రజలు
ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీలొచ్చి తమ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని, తమ
హక్కులను హరిస్తున్నాయని ఆందోళనలకు దిగుతున్నారు. గతంలో బ్రిటన్ మాదిరిగా
భారత్ కూడా సామ్రాజ్యవాద ధోరణిని అనుసరిస్తోందని దుయ్యబడుతున్నారు. ఇంత
సువిశాల భారతదేశం వదలి మన కంపెనీలు వ్యవసాయం కోసం ఇతర ఖండాలకు ఎందుకు
వెళ్తున్నాయి? దాని వెనకున్న కారణాలేమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే 2008
సంవత్సరంలోకి ఒక్కసారి తిరిగి చూడాలి.
2008.. చాలా అగ్రరాజ్యాలు మరచిపోవాలనుకునే సంవత్సరం.<br /><br /><img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/may/13/images/13-5sun38.jpg" /></span>
<span style="font-size: large;">
ఆర్థిక మాంద్యంతో పాటు ఆహారపు కొరత కూడా ఆ ఏడాది ప్రపంచంలో అనేక దేశాలను
వణికించింది. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని దేశాలూ ఆహారపు కొరతను
ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు ప్రపంచయుద్ధం తర్వాత అంత ఆహారపు కొరత
ఏర్పడటం అదే మొదటిసారి. దీనికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది ఆ
ఏడాది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తి తగ్గిపోవటం. రెండోది- సాగు భూమిలో
ఎక్కువ శాతం సోయా, ఆయిల్ సీడ్స్ వంటి పంటలను పండించటం. ఆహార కొరత రావటంతో
అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఆహారపు ఉత్పత్తులను
ఎగుమతి చేసే అర్జెంటీనా, వియత్నాం వంటి దేశాలు తమ ఎగుమతులపై నిషేధం
విధించాయి. దీనితో తొలిసారి ధనిక దేశాలకు కేవలం డబ్బు ఉంటే చాలదని
అర్థమయింది. దీనితో అవి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించటం మొదలుపెట్టాయి. <br /><br />ఈ
వ్యూహంలో ప్రధానమైనది- ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల్లో ఖాళీగా
ఉన్న భూములను వ్యవసాయయోగ్యంగా చేయటం. అక్కడ తామే పొలాలను లీజుకు తీసుకుని
పంటలు పండించి, ఆ పంటలను తమ తమ దేశాలకు దిగుమతి చేసుకోవటం. అంతర్యుద్ధాలతో
సతమతమవుతున్న ఆఫ్రికా దేశాలకు ఇది ఒక అవకాశం. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న
ధనిక దేశాలకు ఇదొక అవసరం. ఆఫ్రికాలో ఇలాంటి వాణిజ్య అవకాశం ఉందని
యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు భారత్, చైనా, సౌదీ అరేబియా, కువైట్,
ఉత్తర కొరియాలు గ్రహించి వెంటనే రంగంలోకి దిగాయి. వివిధ దేశాల ప్రభుత్వాలతో
ఒప్పందాలు కుదుర్చుకుని భూములను లీజుకు తీసుకోవటం మొదలుపెట్టాయి.
ప్రపంచబ్యాంకు నివేదికల ప్రకారం 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికాలో 4.5
కోట్ల హెక్టార్ల భూమిని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి.
గ్లోబలైజేషన్ నేపథ్యంలో కొంత దూకుడుతో వ్యవహరిస్తున్న భారత్ కంపెనీలు
మిగిలిన వారి కన్నా ఒక అడుగు ముందే ఉన్నాయి.<br /><br /> ఆఫ్రికాలో ఉన్న
అవకాశాలను చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదిపాయి. దీనికి మన
ప్రభుత్వం కూడా సహకరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్,
అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, కాన్సార్టియం
ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్
మొదలైనవి ఆఫ్రికాలో వాణిజ్య అవకాశాలకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను
తయారుచేశాయి. అనేక బృందాలను ఆ దేశాలకు తీసుకువెళ్లాయి. ఇదంతా ఒక ఎత్తయితే,
ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఈ కంపెనీలకు రుణాలను ఇవ్వటానికి
అంగీకరించటం మరొక ఎత్తు. దీనితో 80 కంపెనీలు ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలతో
లక్షల ఎకరాల లీజుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ భూములను సాగులోకి తేవటానికి
అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు, వ్యవసాయ టెక్నాలజీ కొనుగోలుకు ఎక్సిమ్
బ్యాంక్ ఈ రుణాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇథియోపియాలో ప్రారంభించిన
టెన్డాహో షుగర్ ప్రాజెక్టుకు ఎక్సిమ్ బ్యాంకు 64 కోట్ల డాలర్ల రుణం మంజూరు
చేసింది. 1.75 శాతం వడ్డీతో, 20 ఏళ్ల కాల పరిమితితో ఎక్సిమ్ బ్యాంకు ఇచ్చే
ఈ రుణాలు అనేక కంపెనీలను ఆకర్షించాయి.<br /><br /><b style="color: purple;">మనకవసరమా?</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/may/13/images/13-5sun39.jpg" /></span>
<span style="font-size: large;">
దేశంలో ఉన్న మొత్తం సాగుభూమినే ఉపయోగించుకోలేని మనకు ఆఫ్రికా భూములను
లీజుకు తీసుకొని వ్యవసాయం చేయటం అవసరమా అనే ప్రశ్న తలెత్తటం సహజమే. దీని
గురించి చర్చించే ముందు మన వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని సత్యాలను
తెలుసుకోవాలి. 1970లలో హరిత విప్లవం వచ్చిన తర్వాత మన దేశంలో
వ్యవసాయోత్పత్తి బాగా పెరిగింది. సాగుభూమి కూడా బాగా పెరిగింది. కాని 1990ల
తర్వాత మన దేశంలో వ్యవసాయోత్పత్తి తగ్గుతూ వస్తోంది. నూనె, పప్పు దినుసులు
వంటి నిత్యావసరాల విషయంలో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతూ
వచ్చింది. దీనితో వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తోంది. <br /><br />ఉదాహరణకు
2008లో 54 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటే 2009లో 74 లక్షల
టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మనం చమురు తర్వాత
ఎక్కువగా ఖర్చు పెట్టేది వంట నూనెలపైనే! ఇలాంటి ఉదాహరణనే మరొక దానిని
చూద్దాం. మన పౌష్టికాహారానికి అత్యంత కీలకమైన పప్పు దినుసుల ఉత్పత్తి
2011-12 ఆర్థిక సంవత్సరంలో 15.73 మిలియన్ టన్నులు ఉంటుందని ప్రభుత్వ అంచనా.
అయితే పప్పు దినుసుల డిమాండ్ 19.91 మిలియన్ టన్నుల దాకా ఉంటుందని
భావిస్తున్నారు. అంటే దాదాపు నాలుగు మిలియన్ టన్నుల పప్పు దినుసులను మనం
దిగుమతి చేసుకోవాల్సిందే. <br /><br />అంతే కాకుండా 2020 నాటికి ఆహార ధాన్యాల
డిమాండ్ 25 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా. ప్రస్తుతం మన ఉత్పత్తి 23 కోట్ల
టన్నులే. అంటే ప్రస్తుతం మనకు బొటాబొటిగా సరిపోతున్న ఆహారధాన్యాల ఉత్పత్తి,
మరో ఎనిమిదేళ్ల తర్వాత సరిపోదు. ఏ విధంగా చూసినా, అప్పటికి మన దేశంలో
రెండు కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశం లేదనేది నిపుణుల
అంచనా. దీనితో దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఆఫ్రికా దేశాలలో వ్యవసాయం ఒక మంచి
అవకాశంగా ప్రభుత్వం కూడా భావించింది. అంతే కాకుండా ఆ దేశాల్లో నీటి కొరత
లేకపోవటం, మనతో పోల్చుకుంటే వ్యవసాయోత్పత్తికి తక్కువ ఖర్చు కావటం మొదలైన
అంశాలు కూడా ఇటు ప్రభుత్వాన్ని, అటు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. <br /><br />"ఆఫ్రికాలో
వ్యవసాయోత్పత్తికి అయ్యే ఖర్చు భారత్తో పోలిస్తే సగం ఉంటుంది. మందులు,
ఎరువులు తక్కువగా వాడచ్చు. లేబర్ చాలా తక్కువ ధరకు దొరుకుతారు. ఉత్పత్తి
చాలా ఎక్కువగా ఉంటుంది'' అంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ
గ్రూప్కు చెందిన ఎస్.ఎన్. పాండే. ప్రభుత్వం ఆహార భద్రత, ఆహార ధాన్యాల
ఉత్పత్తి కోణం నుంచి ఈ సమస్యను చూస్తుంటే కంపెనీలేమో అక్కడి అనుకూలతలు,
ఇక్కడి అననుకూలతలను బేరీజు వేసుకుంటున్నాయి. మన దగ్గర ఉన్న ఇబ్బందులు
కమతాలు చిన్నవిగా ఉండటం, వాటికి పెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా మార్చటానికి
ప్రయత్నిస్తే అనేక ప్రభుత్వ నిబంధనలు అడ్డం రావటం, ఆహారోత్పత్తులకు సరైన
గిట్టుబాటు ధరలు లేకపోవటం మొదలైన కారణాలను ఈ కంపెనీలు చూపిస్తున్నాయి.<br /><br /><b style="color: purple;">స్థానిక ఆందోళనలు..</b></span>
<span style="font-size: large;"><br />
అయితే తమ దేశాలలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు తమ గురించి పట్టించుకోవటం
లేదని చాలా ఆఫ్రికన్ దేశాల్లో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి
ఆందోళనలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇథియోపియాను చెప్పుకోవచ్చు. ఇథియోపియాలో
అడవులు ఎక్కువ. చాలామందికి ఆ అడవులే జీవనాధారం. పశువులకు మేత, జలాశయాలలో
ను, నదులలోను ఉండే నీళ్లు వారికి చాలా ముఖ్యమైన అంశాలు. ఇథియోపియా ప్రభు
త్వం ఇచ్చిన లీజుల వల్ల లక్షల హెక్టార్ల అడవులు ఈ కంపెనీల చేతుల్లోకి
వెళ్లాయి. అడవులను నరికి ప్లాంటేషన్లను ఏర్పాటు చేయాలనేది ఈ కంపెనీల
ఉద్దేశం. తమను నిర్వాసితులు చేస్తున్నారని, తమకు ఉపాధి కల్పించటం లేదని
స్థానిక ప్రజలు వాపోతున్నారు. ము ఖ్యంగా బోకో, గంబేలా ప్రాం తాల్లో భారతీయ
కంపెనీల చేతుల్లో లక్షల హెక్టార్ల భూములున్నాయి. ఈ కంపెనీలు తమ
కార్యకలాపాలను ప్రారంభించాక మూడు లక్షల మంది నిర్వాసితులయ్యారని ఒక అంచనా. <br /><br />వీరిలో
కేవలం 20 వేల మందికే కంపెనీలు ఉపాధి కల్పించాయి. ఫలితంగా స్థానికుల
ఆందోళనలు మరింతగా పెరిగాయి. భారత్కు చెందిన వేదాంత హార్వెస్ట్
ప్లాంటేషన్స్ కంపెనీ కారణంగా గంబేలాలో మజాంగిర్ అనే తెగ ప్రజలు పూర్తిగా
నిర్వాసితులయ్యారు. దీనితో వారు సాలిడారిటీ మూమెంట్ ఫర్ ఎ న్యూ ఇథియోపియా
అనే (ఖికూఉ) స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆందోళనలు చేపట్టారు. ఈ సంస్థ
చెప్పినదాని ప్రకారం కంపెనీలతో ప్రభుత్వం ఏమేం ఒప్పందాలు చేసుకుందో ఎవరికీ
తెలియదు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. వేదాంత హార్వెస్ట్
ప్లాంటేషన్స్కు సంబంధించిన వ్యవహారం ఆ దేశా«ధ్యక్షుడు గిర్మా వోల్డి
గియోర్గిస్ దాకా వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ఎన్విరాన్మెంట్ ప్రొటక్షన్
అథారిటీ ఆఫ్ ఇథియోపియా (ఈపీఏఈ) ఈ లీజుపై విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టును
వెంటనే ఆపుచేయాలని ఆదేశించింది. <br /><br />అయితే ఇథియోపియాలో రాజకీయ అస్థిరత
ఎక్కువ. అధ్యక్షుడి ఆదేశాలను పట్టించుకొనే రాష్ట్రాలు తక్కువే. అందుకే
స్థానిక గవర్నర్ వేదాంత హార్వెస్ట్కు ఇచ్చిన లీజు మరో 50 ఏళ్లు
కొనసాగుతుందని ప్రకటించాడు. "ఇథియోపియాలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా మూడు
వేల ఎకరాల భూమిని ఏ ఢిల్లీలోనో, ఇంగ్లాండ్లోనో, వాషింగ్టన్లోనో లీజుకు
ఇమ్మనండి చూద్దాం. అక్కడ ఇంత ఉదారంగా ఇవ్వటానికి కుదరనప్పుడు ఇథియోపియాలో
మాత్రం ఎందుకు అలా జరగాలి?'' అని ఎస్ఎంఎన్ఈకి చెందిన ఒబెంగ్ మెథో
ప్రశ్నిస్తున్నారు. ఇథియోపియాలో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయింది.
చివరికి ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి 12 కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను
బహిర్గతం చేశారు. వీటిలో ఐదు మన దేశానికి చెందినవే.<br /><br style="color: purple;" /><b style="color: purple;">మన ఒప్పందాల టైపే!</b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/may/13/images/13-5sun40.jpg" /></span>
<span style="font-size: large;">
మన వాటితో సహా 12 కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే- అక్కడి
ప్రభుత్వం ఎంత ఉదారంగా భూమిని ధారాదత్తం చేసిందో అర్థమవుతుంది. ఈ ఒప్పందంలో
ఇథియోపియా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా కంపెనీలు తమ
కార్యకలాపాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కాని కంపెనీలు పర్యావరణానికి
హాని కల్గిస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని ఎవరు ఎప్పటికప్పుడు కనిపెడుతూ
ఉండాలి. ఏఏ సంస్థలకు ఆ బాధ్యత ఉందనే విషయాన్ని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు.
ఒక వేళ ఈ కంపెనీలు పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి పెనాల్టీలను
చెల్లించాలనే విషయం కూడా ఒప్పందాలలో లేదు. ఒప్పందాల ప్రకారం కంపెనీలు తమ
వద్ద ఉన్న నీటి వనరులను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. వాటిపై డ్యామ్లు
కట్టుకోవచ్చు. భూగర్భ జలాలను వెలికితీయటానికి బోర్లు వేసుకోవచ్చు. కొత్త
కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టవచ్చు.<br /><br /> అయితే ఈ నీటి వనరులను
వాడుకున్నందుకు స్థానిక ప్రజలకు ఎంత చెల్లించాలి? ప్రభుత్వానికి ఏదైనా
చెల్లించాలా లేదా అనే విషయం మాత్రం ఒప్పందాలలో లేదు. ఒప్పందాలలో లేవు
కాబట్టి కంపెనీలు సహజంగానే ఎటువంటి రుసుమూ చెల్లించవు. కంపెనీలు లీజుకి
తీసుకున్న భూములున్న ప్రాంతాలలో స్థానిక ప్రజలకు విద్యుత్ సౌకర్యాలు,
ఆరోగ్య సదుపాయాలు, పిల్లల విద్య కోసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత
ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఒప్పందంలో ఇవి కేవలం కంపెనీలలో పనిచేసే వారికి
మాత్రమేనా? లేక మొత్తం ఆ ప్రాంతవాసులందరి అభివృద్ధికా? అనే విషయాన్ని
ఎక్కడా పేర్కొనలేదు. అంత కన్నా దారుణమైన విషయమేమిటంటే- కంపెనీలలో పనిచేసే
కూలీలకు ఇవ్వాల్సిన దిన వేతనాల గురించి ఈ ఒప్పందాలలో ప్రస్తావనే లేదు.
కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించి- కొత్త వ్యవసాయ టెక్నాలజీలను
ప్రవేశపెడితే, సంప్రదాయబద్ధంగా అక్కడ వ్యవసాయం చేస్తున్న రైతుల పరిస్థితి
ఏమిటి? కంపెనీలు వారికి ఏ విధంగా సహాయపడాలనే విషయం గురించి కూడా ఒప్పందాలలో
లేదు. <br /><br />ఇథియోపియాతోనే కాదు, మిగిలిన ఆఫ్రికా దేశాలతో కుదుర్చుకున్న
ఒప్పందాలు కూడా ఈ విధంగానే ఉన్నాయని ఆయా దేశాల్లో పోరాడుతున్న
ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఆఫ్రికా దేశాలు ఇటువంటి ఒప్పందాలు
కుదుర్చుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో విపత్తులు ఏర్పడతాయని నిపుణులు
హెచ్చరిస్తున్నారు. " ఈ కంపెనీలు ఎలాంటి వ్యవసాయ పద్ధతులను అక్కడ
ప్రవేశపెడతాయనే విషయంపై ఒప్పందాలలో స్పష్టత లేదు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో
రైతులు ఎరువులు ఎక్కువగా వాడలేదు. ఈ కంపెనీలు ఎక్కువ ఎరువులు
వాడుతాయనుకుందాం. తమకు అనువైన విత్తనాలను ఉపయోగిస్తాయనుకుందాం. అప్పుడు ఆ
ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా ఎటువంటి అడ్డు
అదుపు లేకుండా భూగర్భ జలాలను ఉపయోగిస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇప్పటికే అనేక ఆసియా దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి'' అంటున్నారు
ప్రపంచ బ్యాంకు నిపుణుడు డాక్టర్ డి. బయ్యర్లీ.<br /><br /><b style="color: purple;">వారి హితం కోసమే!</b></span>
<span style="font-size: large;"><br />
కంపెనీలు మాత్రం ఈ విమర్శలన్నింటినీ తిప్పి కొడుతున్నాయి. "వ్యవసాయం కోసం
మాత్రమే మనం అక్కడికి వెళుతున్నాం. కొందరు స్థానికులు వ్యతిరేకించటం సహజమే.
మన దగ్గర డిమాండ్, సరఫరా మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు బియ్యాన్నే
తీసుకుందాం. ప్రభుత్వం బాసుమతి తప్ప మిగిలిన వెరైటీల బియ్యం ఎగుమతి
చేయటాన్ని నిషేధించింది. అయితే మన కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో బియ్యాన్ని
పండించి దాన్ని ఎగుమతి చేశారనుకుందాం. అప్పుడు వారికి లాభాలు వస్తాయి.
కేవలం బియ్యం మాత్రమే కాదు. అనేక రకాల వాణిజ్య పంటలు మనకు అనవసరం. వాటిని
అక్కడ పండించి ఇక్కడకు దిగుమతి చేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి''
అంటారు ఎస్బ్యాంక్కు చెందిన రాజు పూసపాటి. తాము స్థానికులకు ఎటువంటి
అన్యాయం చేయటం లేదని, వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని కూడా
కంపెనీలు చెబుతున్నాయి.<br /><br /> " మేము అన్ని చట్టాలను గౌరవిస్తున్నాం.
ప్రస్తుతం ఇథియోపియాలో ఉన్న కూలీలకు 8 బిర్లు( స్థానిక కరెన్సీ. మన
రూపాయల్లో 24.44) వేతనం ఇస్తున్నాం. 20 వేల ఉద్యోగాలు కల్పించాలని
లక్ష్యంగా పెట్టుకున్నాం. మా కంపెనీ ఉన్న ప్రాంతంలో ఒక హాస్పటల్, సినిమా
హాల్, స్కూల్ నిర్మిస్తాం..'' అంటున్నారు కరుటూరి గ్లోబల్ అనే కంపెనీకి
చెందిన శ్రీరామకృష్ణ. అయితే ఒక సినిమా హాల్ కట్టించటం లేదా ఆసుపత్రి
కట్టించటంతో కంపెనీలకు ఉండే బాధ్యత తీరిపోదు. ఆ ప్రాంత ప్రజల సంస్కృతిని,
వ్యవసాయ పద్ధతులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి దాకా ఉన్న పరిస్థితులను
చూస్తే కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడదు. ఇక మీదటనైనా
ఆందోళనలు పెరగకుండా చూసేందుకు అవసరమైన చర్యలన్నీ ఈ కంపెనీలు తీసుకుంటాయని
ఆశిద్దాం.<br /><br /><b style="color: purple;">స్థూలంగా చూస్తే.. </b></span>
<span style="font-size: large;"><br />
* 2008లో వచ్చిన ఆహార కొరత వల్ల ఆఫ్రికా దేశాల్లో ఉన్న భూమిపై విదేశీ
కంపెనీల దృష్టి పడింది. ఆ తర్వాత ఏడాదిలో ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో ఉన్న
4.5 కోట్ల హెక్టార్ల భూమిని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. వీటిలో
మన దేశానికి సంబంధించిన 80 కంపెనీలు కూడా ఉన్నాయి.<br />
* ప్రస్తుతం అనేక దేశాల్లో ఆహార ధాన్యాల ఎగుమతులపై నిషేధం కొనసాగుతోంది.
2010లో రష్యా కూడా ఈ ఎగుమతులపై నిషేధం విధించింది. మన దేశం కొన్ని
ఆహారధాన్యాల ఎగుమతిపై నిషేధం విధించింది.<br />
* మన కంపెనీలు ఆఫ్రికాలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనే విషయంపై
రిక్ రైడిన్ అనే సామాజిక పరిశోధకుడు ఇండియాస్ రోల్ ఇన్ న్యూ గ్లోబల్
ఫార్మ్ల్యాండ్ గ్రాబ్ అనే ఒక పత్రాన్ని తయారుచేశారు. దీనిపై ఇప్పుడు
అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.<br />
* ఆహార కొరత ఉంది కాబట్టి సాగు భూమిని పెంచాలనే వాదన సరికాదనేది కొందరు
నిపుణుల అభిప్రాయం. 'దీనికి సంబంధించి రోగనిర్ధారణ కాని చికిత్స కాని చాలా
తప్పు. పేద దేశాల్లో ఆకలి ఎక్కువగా ఉండడం, పౌష్టికాహార విలువలు సరిగ్గా
లేకపోవటం ఆహార ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల కాదు. పేదరికం, అసమతుల్యమైన
పంపిణీ విధానాల వల్ల ఈ తరహా కరువులు ఏర్పడుతున్నాయి'' అని నిపుణులు
వాదిస్తున్నారు.<br />
* మన దేశంలో సగటు కమతం 1.5 ఎకరాలు మాత్రమే. పైపెచ్చుఆహార ధాన్యాలను
పండిస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువ. అందువల్ల చాలా మంది రైతులు వాణిజ్య
పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి
తగ్గుతోంది. </span></div>
<div class="RunningText">
<br /></div>
<div class="RunningText" style="color: blue;">
<span style="font-size: large;"><b>- సివిఎల్ఎన్ ప్రసాద్</b></span></div>
</div>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-76444587997895219652012-05-02T23:26:00.000-07:002012-05-02T23:26:07.087-07:00సేద్యానికి 3 మూర్తుల తోడ్పాటు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<h1>
</h1>
</div>
<div id="page1">
<div class="RunningText" style="text-align: left;">
<span style="font-size: large;"><b style="color: #274e13;"></b></span><img alt="http://www.thehindu.com/multimedia/dynamic/00951/brscmarch8_ramana2__951476f.jpg" src="http://www.thehindu.com/multimedia/dynamic/00951/brscmarch8_ramana2__951476f.jpg" /></div>
<div class="RunningText" style="text-align: left;">
<span style="font-size: large;"><b style="color: #274e13;">గడచిన పదేళ్లలో బియ్యం ధర మూడింతలైంది. పప్పులూ కొండెక్కి కూచున్నాయి.
అంతగా ధరలు పెరిగినప్పుడు వాటిని పండించే రైతులు ఈ పదేళ్లలో
లక్షాధికారులై ఉండాలి కదా. అలా జరగకపోగా వాళ్ల స్థితిగతులు నానాటికీ
తీసికట్టుగా ఎందుకు తయారవుతున్నట్టు? ప్రతిరోజూ వార్తల్లో రైతు ఆత్మహత్యల
సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్టు? ఇలా ఆలోచించి వ్యవసాయాన్ని లాభసాటి ఉపాధిగా
తయారుచెయ్యడానికి కంకణం కట్టుకున్నారు ముగ్గురు యువకులు. మూడేళ్ల క్రితం
వాళ్లు స్థాపించిన 'గ్రీన్బేసిక్స్' సంస్థ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో
వందల ఎకరాల్లో సిరుల పంటలు పండిస్తోంది. రైతులకు ఆలంబనగా ఉంటోంది.</b></span>
</div>
<div class="RunningText">
<span style="font-size: large;"><br />
<span style="color: purple;">ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి రమణబాబు, ప్రేమ్సాగర్రాజు, ఒడిశాకు చెందిన
మదన్మోహన్ - ముగ్గురూ వ్యవసాయంలో పట్టభద్రులే. </span>ముగ్గురివీ గ్రామీణ
నేపథ్యాలే కావడంతో, వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండగలా చెయ్యాలనే ఆలోచన
వారికి ముందునుంచీ ఉండేది. అనుకోకుండా ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్
సోషల్ సైన్సెస్ (టిస్)లో విద్యార్థులుగా కలిసిన వీరు 'విత్తనాల చల్లడం
మొదలు కోతల వరకు' రైతుకు సాంకేతిక సాయం అందేలా ఒక వినూత్నమైన వ్యాపార
ఆలోచనను కాగితాలమీదికెక్కించారు. దీని ద్వారా ఆదాయం పొందుతూనే రైతులకు
వ్యవసాయం గిట్టుబాటయ్యేలా చేస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
నిర్వహించిన 'ఐడియా సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్' పోటీల్లో జాతీయ స్థాయి
విజేతగా నిలవడంతో అది బాగా ప్రాచుర్యం పొందింది. ఐదేళ్ల క్రితం సంగతిది.
రెండేళ్ల హోమ్వర్క్ తర్వాత అదే 'గ్రీన్బేసిక్స్' సంస్థగా ప్రాణం
పోసుకుంది.<br /><br style="color: blue;" /><b style="color: blue;">సేవ చేస్తాం, విస్తరిస్తాం</b></span>
<span style="font-size: large;"><br />
పాతిక లక్షల పెట్టుబడితో నోటి మాటే ప్రచారంగా పొలం పనుల్లోకి దిగింది
'గ్రీన్ బేసిక్స్'. రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి
వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల
సాయంతో వాటిని పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా
రైతులకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను
లాభసాటిగా అమ్ముకొనే పద్ధతులనూ సూచిస్తుంది. "వ్యవసాయాన్ని వ్యవస్థీకృత
పరిశ్రమగా రూపొందించాలి.<br /><br /> ప్రతి రైతూ అందులో భాగస్వామి కావాలి,
అందుబాటులో ఉన్న వనరులనే మరింత సమర్థంగా ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులను,
లాభాలను పొందాలి. ఇదే మా గ్రీన్ బేసిక్స్ దృక్పథం. రైతు సమస్యలకు
సమగ్రమైన పరిష్కారాలను రూపొందించడమే మా లక్ష్యం'' అంటున్నారు
వ్యవస్థాపకుల్లో ఒకరైన రమణబాబు. ప్రస్తుతానికి గ్రీన్బేసిక్స్ సేవలు మన
రాష్ట్రంలో వరి పండించే రైతులకే పరిమితం. వీరి సేవల వల్ల రైతులకు
విత్తనాల కోసం పడిగాపులు పడటం, కూలీల కోసం ఎదురుచూడటమనే బాధలు
తప్పుతున్నాయి.<br /><br /> దిగుబడిలో ఇరవై శాతం దాకా పెరుగుదల కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ గ్రీన్బేసిక్స్ దాదాపు ఐదొందల ఎకరాల్లో 300 మంది రైతులతో
కలిసి పనిచేసింది. 2500 మంది రైతులకు మేలురకం విత్తనాల ఉత్పత్తిలో
శిక్షణనిచ్చింది. నలభై గ్రామాల్లో నాబార్డ్ నెలకొల్పిన రైతు క్లబ్బులకు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకునేలా తర్ఫీదిచ్చింది. వచ్చే
సీజన్లో మరింతమంది రైతులకు అందుబాటులో ఉండటానికి ఈ బృందం కృషి చేస్తోంది.<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/may/3nav-16.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: blue;">పేదల ఉపాధా - పెద్దల హాబీనా?</b><br />
విమర్శలను పక్కకు పెట్టి వాస్తవాలను పరిశీలిస్తే, ఇప్పటి తరాలకు సైతం మట్టి
పట్ల అనుబంధం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలోనో, మరోచోటో చేరి, మంచి సంపాదన
మొదలవగానే వ్యవసాయ భూమి కొద్దిగానైనా కొనుక్కోవాలని ఆశపడుతున్న యువత
బోలెడుమంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు సైతం పుట్టినూరికి దగ్గరగా
పంటపొలాలు కొనుగోలు చేస్తున్నారు. దీనికి భిన్నంగా గ్రామాల్లో వ్యవసాయ
కుటుంబాల్లో పుట్టిపెరుగుతున్నవారు మాత్రం పొలం పనికి సిద్ధంగా లేరు.
వ్యవసాయం పట్ల వారిలో ఆసక్తి లేదు. <br /><br />ఆరుగాలం కష్టిస్తే శ్రమకు తగ్గ
ప్రతిఫలం అందుతుందనే భరోసా లేదు. "ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇదిలాగే
కొనసాగుతూ పోతే మన దేశంలో వ్యవసాయం అధిక శాతం ప్రజల జీవనోపాధిగా కాకుండా
సంపన్న వర్గాల హాబీగా అయిపోతుంది. యువత నడుంకట్టి పొలం పనుల్లో దిగకపోతే
తిండి దొరకని రోజులు దగ్గర్లోనే ఉన్నాయి...'' అని ప్రమాద ఘంటికలు
మోగిస్తున్న గ్రీన్ బేసిక్స్ బృందం "సంప్రదాయ విధానాలకు అత్యాధునిక
సాంకేతికతను జోడిస్తేనే వ్యవసాయం గిట్టుబాటవుతుంది, లాభాల పంటను
పండిస్తుంది'' అని ధైర్యం చెబుతున్నారు. వాళ్ల కృషి ఫలితాలు శ్రీకాకుళం
జిల్లాలో వందల ఎకరాల్లో కనిపిస్తున్నాయి.<br /><br /><b style="color: red;">కొండంత కష్టం - అదే ఇష్టం</b></span>
<span style="font-size: large;"><br /><b style="color: #274e13;">"ఆహారోత్పత్తిలో ఎదురవబోతున్న విపత్కర పరిస్థితుల గురించి ఎవరికీ అవగాహన
ఉండటం లేదు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం
తగ్గిపోతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు.
ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేవు. ఇవన్నీ కలిసి వ్యవసాయ రంగాన్ని ప్రమాదకర
మైన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మేలుకోకపోతే వినాశనం
తప్పదు...''</b></span>
<span style="font-size: large;"> అని కాసింత సీరియస్గానే చెబుతున్న రమణబాబు ఒడిశాలోని
సెంచూరియన్ యూనివర్సిటీలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అగ్రిబిజినెస్ వంటి
అంశాలమీద క్లాసులు కూడా బోధిస్తుంటారు.<br /><br /><b style="color: #274e13;">"పాఠాలైతే సులువుగా
చెప్పొచ్చుగానీ, ఆచరణలో అవన్నీ ఎంత కష్టమో నాకు స్వయంగా తెలుసు. చిన్న
కమతాల మీద ఆధార పడి వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం లోని కష్టం మాటల్లో
చెప్పలేనిది'' </b></span> <span style="font-size: large;">అంటున్నాడీ యువకుడు. ఆ కష్టాన్ని సులువు చెయ్యడాన్ని
ఇష్టంగా స్వీకరించిన <b><span style="color: #38761d;">'గ్రీన్బేసిక్స్'</span></b> వంటి బృందాలు మరిన్ని తయారయితే
రైతులకు అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకేముంటుంది?<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/may/3nav-13.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: #274e13;">"రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి వాటిని ముందుగానే
సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల సాయంతో వాటిని
పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా రైతులకొచ్చే
సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను లాభసాటిగా అమ్ముకొనే
పద్ధతులనూ సూచిస్తుంది.'' </b></span></div>
<table align="center" border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="280" id="Table_01" style="width: 745px;"><tbody>
<tr><td align="left" height="37" valign="top"><br /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="150" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" valign="top" width="221"><img alt="" height="150" src="http://www.greenbasics.org/images/vision.jpg" width="220" /></td>
<td align="left" colspan="10" height="114" valign="top" width="506"><div align="center">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img height="40" src="http://www.greenbasics.org/images/vis.jpg" width="215" /><br />
<span style="color: black;"><strong><br />
<br />
<br />
“To transform agriculture into an organized industry, where
every farmer is a stake holder and where targeted profits/growth
will be achieved through optimized usage of resources”</strong></span></span><strong><br />
</strong></div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
<tr>
<td align="left" height="2" valign="top"><img height="1" src="http://www.greenbasics.org/images/ln.jpg" width="743" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="119" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" height="113" valign="top"><div align="left">
<div align="left">
<span style="color: black; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong><br />
<img height="40" src="http://www.greenbasics.org/images/mis.jpg" width="215" /></strong></span></div>
<div align="center">
<span style="color: black; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong><br />
<br />
“To provide a comprehensive solution to farmer’s problems,
from seed to seed and to make agriculture sustainable”</strong></span>
</div>
</div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
<div class="RunningText">
<br /></div>
<table align="center" border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="280" id="Table_01" style="width: 745px;"><tbody>
<tr><td align="left" height="37" valign="top"><br />
<img alt="" height="40" src="http://www.greenbasics.org/images/abt.jpg" width="215" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="186" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" rowspan="2" valign="top" width="517"><div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><br />
Green Basics is focused on formulating and implementing
sustainable integrated agriculture farming systems. We at
Green Basics strongly believe partnering the farmer in the
postharvest processes and value addition immensely influences
and immediately transforms farmers both qualitatively and
economically, for which we suggest an alternative model
to make farmer as stake holder and bringing total supply
chain under one roof through our leadership. </span></div>
</td>
<td align="left" height="186" rowspan="2" valign="top" width="24"><div align="center">
<img height="180" src="http://www.greenbasics.org/images/line.jpg" width="1" /></div>
</td>
<td align="left" colspan="10" height="143" valign="top"><div align="right">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong><span style="color: black;"><img alt="" height="137" name="" src="http://www.greenbasics.org/images/abt%20img.jpg" width="199" /></span></strong></span></div>
</td>
</tr>
<tr>
<td align="left" colspan="10" height="41" valign="top" width="202"><div align="center">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><span style="color: black; font-size: xx-small;"><strong>GB
on the field, providing extension services to farmers</strong></span></span>
</div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
<tr>
<td align="left" height="2" valign="top"><img height="1" src="http://www.greenbasics.org/images/ln.jpg" width="743" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="119" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" height="113" valign="top"><div align="left">
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">The
business model includes convenient dissemination of extension
services, mechanization leading to high productivity and
quality of international standards, to meet and compete
with the global agriculture market. We also believe that
mechanization of agriculture system is inevitable in near
future as the present labor problem, inefficient farm
practices result in qualitative and quantitative decline
in farm output.</span><br />
</div>
</div>
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><span style="color: black;"><br />
</span></span><span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: xx-small;">
</span></div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
</tbody></table>
<table align="center" border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="758" id="Table_01" style="width: 745px;"><tbody>
<tr><td align="left" height="37" valign="top" width="745"><br />
<img alt="" height="40" src="http://www.greenbasics.org/images/emp.jpg" width="215" /></td>
</tr>
<tr>
<td align="left" height="314" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="224" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td align="left" valign="top" width="220"><div align="left">
<table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="63" id="Table_01" style="width: 220px;">
<tbody>
<tr>
<td width="288"><div align="left">
<img alt="" height="163" src="http://www.greenbasics.org/images/emp1.jpg" width="210" /></div>
</td>
</tr>
</tbody></table>
</div>
</td>
<td align="left" height="27" valign="top" width="511"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong>Ramana
Babu Killi</strong><br />
<br />
<span style="color: #0033ff;">Project Manager</span><br />
<br />
ramanakilli@yahoo.co.in<br />
<br />
08099152315 <br />
<br />
<span style="color: red;">Receiving ISB-idiya trophy from Deputy
P.M of Thailand in ISB,Hyderabad </span></span></div>
</td>
</tr>
<tr>
<td align="left" colspan="2" valign="top">
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><br />
Ramana is Masters in Social Entrepreneurship graduate from
Tata Institute of social Sciences, Mumbai and received “GOLD
MEDAL” for best student and highest grade point for batch
of 2007-09, having two years experience in the field of
Agriculture. He worked in Zameen organic Pvt. Ltd and AOFG,
India as a Regional Manager for Andhra Region. </span> </div>
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">His
expertise will help in maintain the small farmer’s organization
and networking with social enterprises and funding agencies</span></div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
<tr>
<td align="left" height="2" valign="top"><img height="1" src="http://www.greenbasics.org/images/ln.jpg" width="743" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="316" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" height="316" valign="top"><div align="left">
<br />
<table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="224" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td align="left" height="27" valign="top"><div align="left">
</div>
<div align="left">
<table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="63" id="Table_01" style="width: 667px;">
<tbody>
<tr>
<td width="190"><div align="left">
<img alt="" height="183" src="http://www.greenbasics.org/images/emp2.jpg" width="180" /></div>
</td>
<td align="left" valign="top" width="477"><span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong>Mr.
Madan Mohoan</strong> <br />
<br />
<span style="color: #0033ff;">Operations Manager</span><br />
<br />
genemadan@gamil.com<br />
<br />
094401159468<br />
<br />
<span style="color: red;">Mr.Madan Mohan
</span></span> </td>
</tr>
</tbody></table>
</div>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top">
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><br />
Madan Mohan completed his PG in Genetics from Bidhana
Chandra Krishi Viswava vidhyalaya (BCKV), west Bengal,
and worked as a senior research fellow in Directorate
of Oil Research (DOR) &International crop research
institute for semi arid tropics (ICRISAT) and also
trained in agriculture related activities. His technical
expertise helps in identifying high yielding verity
seeds and quality control.</span></div>
</td>
</tr>
</tbody></table>
</div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
<tr>
<td align="left" height="2" valign="top"><img height="1" src="http://www.greenbasics.org/images/ln.jpg" width="743" /></td>
</tr>
<tr>
<td align="left" height="19" valign="top"><br />
<table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="224" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td align="left" height="27" valign="top"><div align="left">
</div>
<div align="left">
<table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="63" id="Table_01" style="width: 667px;">
<tbody>
<tr>
<td width="190"><div align="left">
<img alt="" height="183" src="http://www.greenbasics.org/images/emp3.jpg" width="180" /></div>
</td>
<td align="left" valign="top" width="477"><span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong>Mr.
A. Prem Sagar Raju</strong><br />
<br />
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><span style="color: #0033ff; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Communication’s
manager</span></span><br />
<br />
<span style="color: red; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Mr.
A. Prem Sagar Raju </span></span>
</td>
</tr>
</tbody></table>
</div>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top">
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><br />
Prem has a master’s degree in Social Entrepreneurship from
TISS, and was awarded the Gold Medal for best field work
performance. He was an operations manager for FINO and has
worked on several rural Financial Inclusion project involving
both private and government clients. In his most recent
role, he was in charge of establishing offices and operations
in Kurnool district. The project entailed the disbursement
of NREGA and SSP monies to over 600,000 beneficiaries, in
one of the most challenging political and geographic environments
to work in".</span></div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
<div class="RunningText">
<br /></div>
<table align="center" border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="280" id="Table_01" style="width: 745px;"><tbody>
<tr><td align="left" height="37" valign="top" width="745"><br />
<img alt="" height="40" src="http://www.greenbasics.org/images/ser.jpg" width="215" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="118" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td colspan="2" height="27"><span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">A
collective effort to integrate all the agriculture activities
from <span style="color: #009933;">“farm gate to food plate” </span></span>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top" width="388"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img height="40" src="http://www.greenbasics.org/images/ext.jpg" width="200" /></span></div>
</td>
<td align="left" height="27" valign="top" width="343"><div align="left">
<img height="40" src="http://www.greenbasics.org/images/seed.jpg" width="200" /></div>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img alt="" height="250" src="http://www.greenbasics.org/images/ser%20img.jpg" width="340" /></span></div>
</td>
<td align="left" height="27" valign="top"><div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img alt="" height="250" src="http://www.greenbasics.org/images/ser%20img2.jpg" width="340" /></span></div>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Farming
best practices made available to all.</span></div>
</td>
<td align="left" height="27" valign="top"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">High
quality seeds produced and supplied at the village level.</span></div>
</td>
</tr>
</tbody></table>
<br />
</td>
</tr>
<tr>
<td align="left" height="2" valign="top"><img height="1" src="http://www.greenbasics.org/images/ln.jpg" width="743" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="119" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" height="113" valign="top"><div align="left">
<table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="118" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td align="left" valign="top" width="388"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img height="40" src="http://www.greenbasics.org/images/farm.jpg" width="218" /></span></div>
</td>
<td align="left" height="27" valign="top" width="343"><div align="left">
<img height="40" src="http://www.greenbasics.org/images/ver.jpg" width="140" /></div>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img alt="" height="250" src="http://www.greenbasics.org/images/ser%20img3.jpg" width="340" /></span></div>
</td>
<td align="left" height="27" valign="top"><div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><img alt="" height="250" src="http://www.greenbasics.org/images/ser%20img4.jpg" width="340" /></span></div>
</td>
</tr>
<tr>
<td align="left" valign="top"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Modern
farm equipment provided to farmers on a <br />
pay and use basis.</span></div>
</td>
<td align="left" height="27" valign="top"><div align="left">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">High
quality organic manure will be made available to
farmers at affordable prices.</span></div>
</td></tr>
</tbody></table>
</div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
<div class="RunningText">
<br /></div>
<table align="center" border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="280" id="Table_01" style="width: 745px;"><tbody>
<tr><td align="left" height="37" valign="top" width="745"><br />
<img alt="" height="40" src="http://www.greenbasics.org/images/cnt.jpg" width="215" /><br />
</td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="224" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td align="left" height="27" valign="top"><div align="left">
<table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="63" id="Table_01" style="width: 745px;">
<tbody>
<tr>
<td align="left" valign="top" width="510"><div align="left">
<strong><span style="color: #006600; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Heading
</span></strong>
<div align="justify">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">The
Green Basics field office is located on the outskirts
of Sompeta (Mandal Headquarters) in Srikakulam
district 10Km from the project location. It is
accessible, by both road, rail and air. <br />
<br />
<strong>Road</strong><br />
We are located of National Highway 5 two kilometers
from the Sompeta Bus station.<br />
<br />
<strong>Rail</strong><br />
We are 3 kilometers from Sompeta Railway station
(Kanchli). Bus’s and auto’s are available from
here to the project site on a frequent basis.<br />
<br />
<strong>AIR</strong><br />
The nearest air port is Vishakapatnam which is
situated 180KM from the project site. There are
frequent buses and trains from here to Somepata.</span><br />
</div>
</div>
</td>
<td align="left" valign="top" width="235"><table align="right" border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="63" id="Table_01" style="width: 220px;">
<tbody>
<tr>
<td height="19" width="288"><div align="center">
<br />
<br />
<img height="176" src="http://www.greenbasics.org/images/cnt%20img.jpg" width="180" /></div>
</td>
</tr>
<tr>
<td align="left" height="19" valign="top"><div align="center">
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Kanchali
Railway station is two kilometers from project
site</span><br />
</div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
</tbody></table>
</div>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
<tr>
<td align="left" height="2" valign="top"><img height="1" src="http://www.greenbasics.org/images/ln.jpg" width="743" /></td>
</tr>
<tr>
<td align="left" height="112" valign="top"><table border="0" cellpadding="0" cellspacing="0" class="frame" height="119" id="Table_01" style="width: 743px;">
<tbody>
<tr>
<td align="left" height="113" valign="top"><div align="left">
<table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="116" id="Table_01" style="width: 686px;">
<tbody>
<tr>
<td align="left" valign="top" width="220"><img alt="" height="245" src="http://www.greenbasics.org/images/cntus.jpg" width="210" /></td>
<td align="left" colspan="10" height="112" valign="top" width="452"><span style="color: #ff3300; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong>To
contact us: </strong></span><br />
<span style="color: #0033ff; font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;"><strong>Green
Basics Agri-clinc & Agri Business center</strong></span><br />
<span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Mr
Ramana Babu Killi <br />
C/o Bandala Apparao<br />
Near NH-5 road,<br />
Kanchili mandalam,<br />
Amaravathi village,<br />
Srikakulam,<br />
Andhra Pradesh,<br />
India.</span><br />
<table border="0" cellpadding="2" cellspacing="2" class="frame" height="67" id="Table_01" style="width: 452px;">
<tbody>
<tr>
<td align="left" colspan="10" height="63" valign="top" width="226"><span style="font-family: Verdana,Arial,Helvetica,sans-serif; font-size: x-small;">Phone:
08947-233031<br />
Fax: 08947-233031<br />
E-mail: greenbasics@gmail.com</span></td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
</div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
<div class="RunningText">
<br /></div>
</div>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-18573280510241098892012-04-15T02:23:00.001-07:002012-04-15T02:23:56.669-07:00కలిమి తెచ్చే కరివేపాకు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;">రైతులు
కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని
సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి.
ఈ పంట నమ్మకమైన దిగుబడుల్ని, ఆదాయాన్ని అందిస్తుంది. కరివేపాకు తోటలో
పప్పుధాన్యాలు, ఆకుకూరల్ని అంతరపంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా
పొందవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట
ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఇది బహు వార్షిక కూరగాయ పంట.
కరివేపాకు మొక్కలకు అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అతి తక్కువగా 16
డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ అనువైన వాతావరణంగా చెప్పొచ్చు. </b></span> <br />
<div align="center">
<span style="font-size: large;"><img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/13042012/AGRI-KARIVEPAKU12-4-12-41989.jpg" /></span></div>
<span style="font-size: large;"><br /><b style="color: red;">నేలలు-రకాలు</b></span> <span style="font-size: large;"><br />
కరివేపాకు పైరు అధిక నీటిని తట్టుకోలేదు. అందువల్ల పొలంలో మురుగు నీటి
పారుదల సౌకర్యం తప్పనిసరి. ఏ మాత్రం తేమ నిలవని తేలికపాటి గరప నేలలు, నీరు
నిలిచే నల్లరేగడి నేలలు ఈ పంటకు పనికిరావు. దీని సాగుకు ఎర్ర గరప నేలలు
బాగా అనుకూలంగా ఉంటాయి. కరివేపాకు సాగుకు డీడబ్ల్యూడీ-1, 2 రకాలు బాగా
ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాలూ మంచి సువాసన కలిగి ఉంటాయి.
డీడబ్ల్యూడీ-1లో నూనె శాతం 5.22%, డీడబ్ల్యూడీ-2లో 4.09%ఉంటుంది.
డీడబ్ల్యూడీ-1 రకం చలిని తట్టుకోలేదు. శీతాకాలంలో పైరు ఎదుగుదల తక్కువగా
ఉంటుంది. ఇక డీడబ్ల్యూడీ-2 రకం చలి తీవ్రతను కొంత వరకూ తట్టుకుంటుంది.
డీడబ్ల్యూడీ-1 రకం కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది. <br /><br /><b style="color: red;">ఎలా సాగు చేయాలి?</b></span> <span style="font-size: large;"><br />
కరివేపాకు సాగుకు జూన్ నుంచి ఆగస్ట్ వరకూ అనుకూలంగా ఉంటుంది. కరివేపాకు
పంటను ఎక్కువగా విత్తనం ద్వారా సాగు చేస్తారు. కొందరు రైతులు ముందుగా నారు
పోసి మొక్కలు పెరిగాక ప్రధాన పొలంలో నాటు తారు. ఈ పద్ధతిలో కరివేపాకును
సాగు చేయాలనుకుంటే ముందుగా చిన్న చిన్న పాలిథిన్ సంచుల్లో ఇసుక, మట్టి,
బాగా చివికిన పశువుల ఎరువును 1:1:1 నిష్పత్తిలో వేయాలి. వాటిలో విత్తనాలు
వేసి మొక్కల్ని పెంచాలి. సంచుల్లోని మట్టిపై రోజుకు రెండుసార్లు నీళ్లు
చల్లుతూ ఉండాలి. విత్తనాలు మొలకెత్తడానికి మూడు నాలుగు వారాల సమయం
పడుతుంది. మూడు నెలల వయసున్న మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి. <br /><br />
ఇక నేరుగా విత్తనాలు విత్తే వారు ముందుగా పొలాన్ని లోతుగా దున్నాలి. చివరి
దుక్కిలో ఎకరానికి 10-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 200 కిలోల సింగిల్
సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఆ తర్వాత గుంటక తోలి భూమిని చదును చేయాలి. తర్వాత
సాళ్లలో విత్తుకోవాలి లేదా విత్తనాలు పొలం అంతటా సమానంగా పడేలా వెదజల్లాలి.
విత్తనం కోసం చెట్ల నుంచి సేకరించిన పండ్లను మర్నాడే విత్తుకోవాలి.
ఆలస్యంగా విత్తితే మొలక శాతం తగ్గుతుంది. ఎకరానికి 200 కిలోల విత్తనాలు
అవసరమవుతాయి. విత్తనాలు విత్తిన తర్వాత గుంటక తోలి నీరు పెట్టాలి.</span> <span style="font-size: large;"><br /><br />
పెద్ద మొక్కల చుట్టూ వచ్చే పిలకల్ని తీసి కూడా నాటుకోవచ్చు. ఇందుకోసం
తల్లి మొక్క దగ్గర వేరు నుంచి వచ్చే పిలకల్ని వేరుతో సహా తీసి వెంటనే
నాటాలి. అయితే ఈ పద్ధతిలో కరివేపాకు సాగు చేయాలనుకుంటే వర్షాకాలంలో మాత్రమే
మొక్కలు నాటాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.</span> <span style="font-size: large;"><br /><br /> తోటలో మొక్కలు
ఒక మీటరు ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల
పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పంట కోసిన
తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులు
వేస్తూ ఉండాలి.</span> <span style="font-size: large;"><br /><br style="color: red;" /><b style="color: red;">కోత - ఆ తర్వాత</b></span> <span style="font-size: large;"><br /> విత్తనాలు విత్తిన 9-10 నెలలకు
పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా
తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం
ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో
సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది.
అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మూడో సంవత్సరంలో ఎకరానికి
8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.<br /><br /> కరివేపాకు కోసిన తర్వాత
ప్రతిసారీ పొలంలోని కలుపు మొక్కల్ని తొలగించాలి. పైన తెలిపిన విధంగా
నత్రజని, మ్యురేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి నీరు పెట్టాలి. డ్రిప్ ద్వారా
సాగు చేసినట్లయితే పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు, ఎరువులు
అందించవచ్చు. తద్వారా దిగుబడుల్ని 15-20 శాతం పెంచుకోవచ్చు.</span> <span style="font-size: large;"><br /> జయంత్ రెడ్డి, బీఎస్సీ అగ్రికల్చర్<br /> హైదరాబాద్<br /><br /><b style="color: red;">ఈ చీడపీడలతో జాగ్రత్త</b></span> <span style="font-size: large;"><br />
కరివేపాకు పంటను గొంగళి పురుగులు, పొలుసు పురుగులు, ఆకుమచ్చ తెగులు
ఎక్కువగా నష్టపరుస్తాయి. గొంగళి పురుగులు ఆకుల్ని తింటాయి. వీటి నివారణకు
లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి.
పొలుసు పురుగులు కాండం పైన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్క పెరుగుదల
తగ్గుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున
డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మందు పిచికారీ చేసిన 15 రోజుల
తర్వాత ఆకులు కోయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము
చొప్పున కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.</span></div>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-16698187528238275912012-04-15T02:13:00.000-07:002012-04-15T02:13:19.533-07:00బిందుసేద్యంతో చెరకు సాగు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"><tbody>
<tr></tr>
<tr><td height="10">
<span style="font-size: large;"><br /></span></td>
</tr>
<tr>
<td>
<table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text">
<tbody>
<tr>
<td style="width: 606px;">
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><img align="right" class="imgborder" height="265" src="http://www.sakshi.com/newsimages/contentimages/11042012/q210-4-12-17568.jpg" width="400" />
<b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;"> </b></span></div>
<div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><b style="color: red;">వేసవి ఉష్ణోగ్రతలు చెరకు పైరు ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయి. ఎందుకంటే
అత్యధిక-అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని, ఎండ తీవ్రతను, వడగాడ్పుల్ని చెరకు పైరు
తట్టుకోలేదు. ముఖ్యంగా లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని
తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు
ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. ఈ నెల నుంచి జూన్ వరకూ
ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ,
చెరకు పైరును రక్షించుకోవచ్చు.</b><br /><br /><b><span style="color: blue;">ప్రయోజనాలెన్నో...</span></b></span> <span style="font-size: large;"><br /> బిందుసేద్యం
ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని
చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ
పైరును సాగు చేయొచ్చు. వేసవిలో రైతులు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న
విష యం తెలిసిందే. రోజుకు ఆరేడు గంటలు మాత్ర మే కరెంట్ అందుబాటులో
ఉంటోంది. అయితే బిందుసేద్య పద్ధతిని అనుసరించే రైతులు విద్యుత్ కోతల
విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. <br /><br /> ఎందుకంటే ఆ ఆరేడు గంటల
సమయంలోనే కనీసం నాలుగైదు ఎకరాల తోటకు నీరు అందించవచ్చు. కరెంటు ఎప్పుడు
వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్న దిగులే అవసరం లేదు. ఎప్పుడు కరెంటు ఉంటే
అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు
అందించవచ్చు. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. మామూలు
పద్ధతిలో రాత్రి సమయంలో తోటకు నీరు పెట్టేటప్పుడు పాములు, ఇతర విష పురుగుల
వల్ల ప్రాణహాని ఉంటుంది. బిందుసేద్య పద్ధతిలో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.</span> <span style="font-size: large;"><br /><br />
బిందుసేద్య పద్ధతి వల్ల ఒనగూడే మరో ప్రయోజనమేమంటే కలుపు మొక్కల బెడద
తగ్గుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. తద్వారా
భూసారాన్ని కాపాడుకోవచ్చు. భూమికి ఎక్కువ నీరు అందుతోందన్న ఆందోళన అవసరం
లేదు. మొక్కలకు క్రమ పద్ధతిలో సరిపడినంత నీరు మాత్రమే అందుతుంది. పైగా తోట
అంతటికీ సమానంగా అందుతుంది. భూమి చౌడు బార దు. ధాతు లోపాలు తలెత్తవు.
మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా, క్రమ పద్ధతిలో పెరుగుతాయి. చీడపీడల తాకిడి
తగ్గుతుంది. దీనివల్ల నాణ్యమైన పంటను పొందవచ్చు. రస నాణ్యత కూడా బాగా
ఉంటుంది. కూలీలు, సస్యరక్షణపై పెట్టే ఖర్చు కలిసొస్తుంది. దిగుబడి 40-50
శాతం పెరుగుతుంది. బిందుసేద్య పద్ధతిలో చెరకు తోటలో అంతర పంటలు కూడా సాగు
చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. బిందుసేద్య పద్ధతి ద్వారా ఎరువులు, సూక్ష్మ
పోషకాల్ని మొక్కలకు సరైన మోతాదులో సమానంగా అందించవచ్చు. తద్వారా ఎరువులు,
సూక్ష్మ పోషకాలపై పెట్టే అనవసరపు ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఇసుక నేలలు,
గుట్టలు... అంటే ఎగుడు దిగుడుగా ఉండే భూముల్ని చదును చేయాల్సిన అవసరం
లేకుండానే తోట వేసుకోవచ్చు. చదును చేయడానికి వీలులేని భూముల్లో కూడా
బిందుసేద్యం ద్వారా చెరకు సాగు చేయవచ్చు. </span> <span style="font-size: large;"><br /><b><br style="color: blue;" /><span style="color: blue;"> ప్రోత్సాహం-దిగుబడులు</span></b></span> <span style="font-size: large;"><br />
చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహిం చేందుకు పలు చక్కెర కర్మాగారాలు
రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల బిందుసేద్యంపై చెరకు రైతుల్లో
ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు
సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు.<br /><br /> పశ్చిమ గోదావరి జిల్లా
నల్లజర్ల మం డలం పోతవరం గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం మొక్క తోటలో
ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దాసరి వెంకటాచలం
ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు. వీరిద్దరూ ఇటీవలే ఉగాది
పురస్కారాలు కూడా అందుకున్నారు.</span> <span style="font-size: large;"><br /><span style="color: magenta;">బి.హనుమంతరెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్</span></span> <span style="font-size: large;"><br style="color: magenta;" /><span style="color: magenta;"> అగ్రానమిస్ట్, రాజమండ్రి</span><br /><b style="color: blue;"><br /> ఈ జాగ్రత్తలు తీసుకోవాలి</b></span> <span style="font-size: large;"><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/11042012/AGRI-DRIP10-4-12-17755.jpg" />
జంట సాళ్ల పద్ధతిలో చెరకు ముచ్చెలు నాటినట్లయితే లేటరల్ పైపుల అవసరం
తక్కువగా ఉంటుంది. దీనివల్ల డ్రిప్పులపై పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సాళ్ల
మధ్య నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించిన వారు లేదా సాధారణ పద్ధతిలో
(సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం) ముచ్చెలు నాటిన వారు కూడా బిందుసేద్య
పద్ధతిని అనుసరించవచ్చు. బావులు, చెరువులు వంటి నీటి వనరుల ద్వారా చెరకు
సాగు చేసే వారు ప్రతి 15 రోజులకు ఒకసారి సిస్టమ్ ఫిల్టర్లను
శుభ్రపరచుకోవాలి. ఫర్టిగేషన్ (పైపుల ద్వారా పైరుకు ఎరువులు అందించడం)
తర్వాత 10 నిమిషాల పాటు లేటరల్ పైపుల ద్వారా మంచినీటిని పారించాలి. పంటను
కోసిన తర్వాత యాసిడ్ (33%) ట్రీట్మెంట్తో పైపుల్ని శుభ్రపరచాలి. మొక్కల
దగ్గర పీడనాన్ని పరీక్షించాలి.</span></div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-33324339319755518742012-04-02T21:51:00.000-07:002012-04-03T02:06:56.060-07:00‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ * ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div id="div_NewsHeading" style="color: red; text-align: center;">
<span style="font-size: large;"><b>ప్రకృతి వ్యవసాయమే మిన్న</b></span></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://3.bp.blogspot.com/-yDMx0_VDR7c/T3p_mqvt6_I/AAAAAAAAk-w/VhyBACgkyUM/s1600/rythu+palekar.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/-yDMx0_VDR7c/T3p_mqvt6_I/AAAAAAAAk-w/VhyBACgkyUM/s1600/rythu+palekar.jpg" /></a></span></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://3.bp.blogspot.com/-ns4JFAMvb8c/T3qArmDMaSI/AAAAAAAAk-8/bhunWwS6HAg/s1600/rythu+palekar+2.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"></a></span></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"> <a href="http://3.bp.blogspot.com/-kvgFGMaWzEk/T3qAsRitVBI/AAAAAAAAk_A/pJFYqkBPVbQ/s1600/rythu+palekar+3.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="183" src="http://3.bp.blogspot.com/-kvgFGMaWzEk/T3qAsRitVBI/AAAAAAAAk_A/pJFYqkBPVbQ/s400/rythu+palekar+3.JPG" width="400" /></a></span></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://4.bp.blogspot.com/-vxn412wFwYA/T3qAwfLwwnI/AAAAAAAAk_M/4CaCozeNVsg/s1600/rythu+palekar+4.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><br /></a></span></div>
<span style="font-size: large;">ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్యే కాదని <b style="color: blue;">ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్
పాలేకర్</b> స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల
ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. <b style="color: red;">‘పెట్టుబడి
లేని ప్రకృతి వ్యవసాయం’ </b>అనే అంశంపై రెడ్హిల్స్లో సోమవారం రైతులకు
నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. </span><br />
<span style="font-size: large;"><a href="http://2.bp.blogspot.com/-LhIQ7NIrHCY/T3p_l13vhYI/AAAAAAAAk-s/ZX5aMrcoiNw/s1600/rythu+palekar+1.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="205" src="http://2.bp.blogspot.com/-LhIQ7NIrHCY/T3p_l13vhYI/AAAAAAAAk-s/ZX5aMrcoiNw/s400/rythu+palekar+1.jpg" width="400" /></a></span> <br />
<span style="font-size: large;">సక్రమంగా ఆచ్ఛాదన
కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల
పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో
కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు
గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన
కల్పించవచ్చన్నారు. </span><br />
<a href="http://3.bp.blogspot.com/-f5ChjKY78tc/T3q9ZBdPxII/AAAAAAAAk_w/sAQ0821GJ5E/s1600/rythu+palekar+6.JPG" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="244" src="http://3.bp.blogspot.com/-f5ChjKY78tc/T3q9ZBdPxII/AAAAAAAAk_w/sAQ0821GJ5E/s640/rythu+palekar+6.JPG" width="640" /></a><span style="font-size: large;"> </span><br />
<span style="font-size: large;">ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ
లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు
లుంటాయని పాలేకర్ వివరించారు. <br /><a href="http://4.bp.blogspot.com/-vxn412wFwYA/T3qAwfLwwnI/AAAAAAAAk_M/4CaCozeNVsg/s1600/rythu+palekar+4.JPG" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="233" src="http://4.bp.blogspot.com/-vxn412wFwYA/T3qAwfLwwnI/AAAAAAAAk_M/4CaCozeNVsg/s400/rythu+palekar+4.JPG" width="400" /></a></span> <span style="font-size: large;"><br style="color: #6aa84f;" /><b style="color: #6aa84f;">శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్ </b><br />వ్యవసాయ
శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత
ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి
శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మం ది ఈ
పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని
ప్రోత్సహించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె
హామీ ఇచ్చారు.</span><span style="font-size: large;"><a href="http://3.bp.blogspot.com/-ns4JFAMvb8c/T3qArmDMaSI/AAAAAAAAk-8/bhunWwS6HAg/s1600/rythu+palekar+2.JPG" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="528" src="http://3.bp.blogspot.com/-ns4JFAMvb8c/T3qArmDMaSI/AAAAAAAAk-8/bhunWwS6HAg/s640/rythu+palekar+2.JPG" width="640" /></a></span><br />
<span style="font-size: large;"><b><span style="color: purple;">మామిడి, సపోట పండిస్తున్నాను...</span></b></span> <span style="font-size: large;"><br />పెట్టుబడి లేని
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ 150 ఎకరాల్లో మామిడి, సపోట వంటి అనేక
పంట లు పండిస్తున్నాను. రెండేళ్లుగా మా పొలంలో పురుగుల మందు చల్లలేదు.
ఎరువులు వేయలేదు. ‘జీవామృతం’ వాడుతున్నాను. రుచికరమైన దిగుబడి
వస్తోంది. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతరపంటల ద్వారా ఆదాయం వస్తోంది.
<br />- తిప్పేస్వామి, రాయదుర్గం, అనంతపురం జిల్లా </span><a href="http://4.bp.blogspot.com/-K-rgJXf-D8M/T3q9YelKUpI/AAAAAAAAk_s/GNyLhM8pepY/s1600/rythu+palekar+5.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="387" src="http://4.bp.blogspot.com/-K-rgJXf-D8M/T3q9YelKUpI/AAAAAAAAk_s/GNyLhM8pepY/s640/rythu+palekar+5.jpg" width="640" /></a><br /><span style="font-size: large;"><b style="color: red;"> ఇథియోపియాలోనూ....</b></span> <span style="font-size: large;"><br />
ఏడేళ్ల క్రితం పాలేకర్ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. అనేక
అవార్డులు పొందాను. ఇథి యోపియా దేశానికి వెళ్లి గులాబీలు, కూరగాయలు,
మొక్కజొన్న, చెరకు వంటి పంటలను పండిస్తున్నాను. కబేళాకు వెళుతున్న నాటు
ఆవులను కొని సాగు ప్రారంభిం చాను. ఇథి యోపియాలో ‘బురానా’ జాతి ఆవు పేడ,
మూత్రంతో కూడిన జీవామృతం అద్భుత ఫలితాలనిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలకు
బదులు రైతుకో ఆవు ఇస్తే మేలు జరుగుతుంది. <br />- జీవీ రాజు, ఎస్ఆర్ కండ్రిక, వైఎస్సార్ జిల్లా</span><br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-K-rgJXf-D8M/T3q9YelKUpI/AAAAAAAAk_s/GNyLhM8pepY/s1600/rythu+palekar+5.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><br /></a></div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-f5ChjKY78tc/T3q9ZBdPxII/AAAAAAAAk_w/sAQ0821GJ5E/s1600/rythu+palekar+6.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><br /></a></div>
<span style="font-size: large;"><a href="http://3.bp.blogspot.com/-ns4JFAMvb8c/T3qArmDMaSI/AAAAAAAAk-8/bhunWwS6HAg/s1600/rythu+palekar+2.JPG" style="margin-left: 1em; margin-right: 1em;"></a></span> </div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-76248924558088824712012-04-02T00:16:00.000-07:002012-04-15T02:35:23.216-07:00దేశవాళి ఆవులే మేలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<span style="font-size: large;"> <b style="color: red;">దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా
విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు
కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో
కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను
తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ.
ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు
మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్
విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్బాషా. పశ్చిమ గోదావరి జిల్లా
ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత,
వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...</b></span><br />
<br />
<span style="font-size: large;"><br /> దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని
సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం
కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ,
సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే
ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా
ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ
జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్ఎఫ్ జాతి
దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు
వెల్లడైంది.</span><br />
<span style="font-size: large;"><br /> జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్
రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల
ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి
చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ,
మల్నాడ్గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం,
ఉంబ్లాచెరీ, గుజరాత్లోని గిర్, రాజస్థాన్లోని రెడ్సింధీ, థార్పార్కర్,
కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్లోని మాల్వీ, పంజాబ్లోని సాహివాల్ జాతి
ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే
ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..<br /><b><br style="color: blue;" /><span style="color: blue;"> వేచూర్</span></b><br /><img align="Left" class="imgborder" height="255" src="http://www.sakshi.com/newsimages/contentimages/02042012/paadipanta1-4-12-18863.jpg" width="400" /><br />
కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా
పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే
విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90
సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు
60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు
లేదా నలుపు రంగులో ఉంటాయి. <br /><br /> శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ
వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు
శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా
తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల
దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో
వినియోగిస్తారు. </span> <span style="font-size: large;"><br /><br /><b style="color: blue;">కాసరగడ్ </b></span> <span style="font-size: large;"><br /></span><img class="image" height="357" src="http://www.vechur.org/img/content/cattle/clip_image004-1_kasaragod_1.jpg" width="458" /><br />
<span style="font-size: large;"> కేరళకు చెందిన కాసరగడ్ జాతి
పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి
మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ.
కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8
రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ
జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.</span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: blue;">మాల్వీ </span></b></span> <span style="font-size: large;"><br /></span><img alt="http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg" src="http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg" /><br />
<span style="font-size: large;">
మధ్యప్రదేశ్లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట
మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ
పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను
లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి. </span> <span style="font-size: large;"><br /><br /><b style="color: blue;">పుంగనూరు ఆవులు</b></span> <span style="font-size: large;"></span><br />
<img alt="http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg" src="http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg" /><br />
<span style="font-size: large;">
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి
చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి
ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో
ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర
నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ
జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి
ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల
సామర్థ్యం ఉంది. <br /><br /> వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200
కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో
1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి.
చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా
వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన
అవసరం ఎంతైనా ఉంది.</span><br />
<br />
<div style="color: red;">
<b><span style="font-size: large;"> </span>దేని ప్రత్యేకత దానిదే</b></div>
<table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"><tbody>
<tr></tr>
<tr><td height="10">
</td>
</tr>
<tr>
<td>
<table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text">
<tbody>
<tr>
<td style="width: 606px;">
<div class="redNote" id="div_Desc">
<img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/09042012/AGRI-HALLIKAR8-4-12-28802.jpg" />
<span style="font-size: large;"><b><span style="color: red;">గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని
బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ
పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని</span></b>.<br /><br /> కేవలం వ్యవసాయ పనులకు
మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా
మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ
కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ
నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు
అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...</span> <span style="font-size: large;"><br /><br /> మన
రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్లోని మాల్వీ, కేరళలోని వేచూర్,
కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని
కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని
కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.</span> <span style="font-size: large;"><br /><br /> <b style="color: red;">పాల దిగుబడి స్థిరంగా ఉండదు</b></span><b style="color: red;"> </b><span style="font-size: large;"><br />
కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు,
నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్,
ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు.
వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు
ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు
సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది
స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు
నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని
ప్రదర్శిస్తాయి.<br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/09042012/q38-4-12-28646.jpg" /></span> <span style="font-size: large;"> <b style="color: red;">పనిలో దిట్ట</b><br />
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ,
వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా
ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని
ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని
సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల
దిగుబడి ఇస్తాయి.<br /><br /> <b style="color: red;">మైసూర్ రాజుల కాలం నుంచి...</b></span><b style="color: red;"> </b><span style="font-size: large;"><br /> మైసూర్ రాజుల
కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని
నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్
సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత
అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు)
భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో
ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల
దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి. <br /><br /> <b style="color: red;">దక్షిణాది ఆవులకు మాతృ జాతి</b></span><b style="color: red;"> </b><span style="font-size: large;"><br />
దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్ను మాతృ జాతిగా
చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది.
దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం
మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి
కలిగి ఉంటుంది. <br /><br /> <b><span style="color: red;">రవాణాకూ ఉపయోగపడతాయి</span></b></span><b><span style="color: red;"> </span></b><span style="font-size: large;"><br /> ఖిలారీ జాతి ఆవులు
వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ,
తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల
మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు
వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా
ఉపయోగపడతాయి.<br /><br /> <b style="color: red;">ప్రతికూల వాతావరణంలోనూ...</b></span><b style="color: red;"> </b><span style="font-size: large;"><br /> పొలం పనులకు, రవాణాకు
కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ
పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ
పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా
నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు
పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు,
మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి
ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు. <br /><br /> <b style="color: red;">పాడికి పనికిరావు</b></span><b style="color: red;"> </b><span style="font-size: large;"><br />
తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి
జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది.
పొట్ట చిన్నదిగా ఉంటుంది.<br /><br /> ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు
రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి.
వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.</span> </div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
<span style="font-size: large;"> </span> <br />
<span style="font-size: large;"><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/02042012/khadeerbhasah1-4-12-19582.jpg" /><img align="Right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/02042012/vijaykumarsharma1-4-12-19800.jpg" /></span> </div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-76045560449690326802012-03-27T01:30:00.000-07:002012-03-27T01:30:22.047-07:00సేద్యం ఇక సాధ్యమా?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://2.bp.blogspot.com/-cmR80dwhoNo/T3F4nV2vccI/AAAAAAAAkmc/Fs_Sa-VRbEs/s1600/sedyam.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="http://2.bp.blogspot.com/-cmR80dwhoNo/T3F4nV2vccI/AAAAAAAAkmc/Fs_Sa-VRbEs/s400/sedyam.jpg" width="350" /></a></span></div>
<h1>
</h1>
</div>
<div class="heading">
<span style="font-size: large;"><b>
</b></span></div>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;">
భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష
పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే
పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ
చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు
తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా
పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును
చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది.
</span><img alt="http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg" height="265" src="http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం,
రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి
లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా
కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ
డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద
సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు
పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా
పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్
పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని
అన్యాపదేశంగానే చెప్పారు.
<br /><br />
ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం
పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి
వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార
సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి
తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ
ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ
చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది.
ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్
మహాశయుడే చెప్పాలి.
<br /><br />
ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ
ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం
బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే
ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ
ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద
ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా
ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు
పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి
వస్తే బడ్జెట్లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.
<br /><br />
పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు
క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు
చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి
తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా
వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే
కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.
<br /><br />
ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న
ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం
వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార,
చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు
పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.
<br /><br />
ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని
! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే
సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ
రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును
విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం.
అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం
తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు
ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
</span><img alt="http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg" height="367" src="http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని
ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198
కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న
ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ,
యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది.
అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు
93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే
అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి
ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.
<br /><br />
చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే
ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా
ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద
సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి
ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి,
మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు
ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
</span><img alt="http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg" height="283" src="http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం.
2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ
పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు.
ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ
ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా
మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్
స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని
అన్నారు.
</span><img alt="http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg" height="280" src="http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల
కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది
ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు
ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు.
వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక
మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే,
పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.
<br /><br />
స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు
బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి
చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ
బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్
అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ
టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ
ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు
పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ
ఇవ్వడంలో ఎందుకు?
</span><img alt="http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg" height="271" src="http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా
ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న
సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను
తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు?
</span><img alt="http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg" height="267" src="http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ
నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు
మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ
పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు
సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం
సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు,
విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.
<br /><br />
మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను
తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా
ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు
రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక
పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
</span><img alt="http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg" height="246" src="http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg" width="400" /><br />
<span style="font-size: large;">
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి
పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన
చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే)
వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల
సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో
తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.
<br /><br />
- శ్రీశైల్ రెడ్డి పంజుగుల<br />
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు<br />
- నీలయపాలెం విజయకుమార్<br />
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు
</span></div>
</div>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com2tag:blogger.com,1999:blog-1005574589812494394.post-31593424265628952302012-03-03T05:20:00.000-08:002012-03-03T05:20:19.125-08:00భూసార పరీక్షకు ఇదే సమయం<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div align="center"><span style="font-size: large;"><img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/02032012/AGRI-11-3-12-25312.jpg" /></span></div><span style="font-size: large;"> భూ భౌతిక, రసాయనిక లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్ని ఎరువులు వాడినా రైతులు ఆశించిన పంట దిగుబడులు పొందలేకపోతున్నారు. రైతులు భూ స్వభావానికి అనువైన పంటలు పండించాలి. అలాగే పంటకు అనుగుణంగా భూ స్వభావాన్ని, భూసార స్థితిని మార్చుకోవాలి. ఈ రెండు విషయాలపై అవగాహన ఏర్పడాలంటే రైతన్నలు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. అందుకు ఈ వేసవి కాలమే అనువైన సమయం. <br />
<br />
<b>భూసార పరీక్ష అంటే...</b><br />
రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు భౌతిక, రసాయనిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నమూనాలలోని సస్య పోషక పదార్థాల పరిమాణాన్ని లెక్కగడతారు. ఆ తర్వాత వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసుకోవాల్సిన ఎరువుల్ని, వాటి మోతాదుల్ని సిఫార్సు చేస్తారు.<br />
<br />
<b>మట్టి నమూనా ఎప్పుడు తీయాలి?</b><br />
పొలంలో పైరు లేకుండా ఉండే వేసవి కాలంలో మట్టి నమూనా తీయడం మంచిది. పంట వేసే ముందు లేదా పైరు కోసిన తర్వా త నమూనాలు తీయవచ్చు. మాగాణి భూముల్లో నీరు పెట్టకముందే నమూనాలు సేకరించాలి. ఎరువులు వేసిన నెల రోజుల తర్వాత మాత్రమే నమూనాలు తీసుకోవాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు మట్టి పరీక్షలు చేయించి, వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆ పరికరాలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.<br />
<br />
<b>ఎలా తీయాలి?</b><br />
పొలానికి ఒక నమూనా సరిపోతుంది. అయితే పొలం మరీ పెద్దదిగా ఉంటే ప్రతి అయిదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు నీటి పారుదల సౌకర్యం, నేల ఏటవాలు, స్వభావం, పంటల సరళి, యాజమాన్య పద్ధతులు వంటి విషయాల్లో తేడా ఉన్నట్లయితే పొలం చిన్నదైనప్పటికీ వేర్వేరు నమూనాలూ సేకరించాల్సిందే.<br />
నమూనాల సేకరణకు ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు వంటి వాటిని తీసేయాలి. పలుగు/పార ఉపయోగించి మట్టిని సేకరించవచ్చు. ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో 6-8 అంగుళాల లోతులో గొయ్యి తవ్వాలి. అందులో పక్కగా అంగుళం మందాన గొయ్యి అడుగు అంచు వరకూ మట్టిని తీయాలి. దీనిని ఉప నమూనా అంటారు. ఇదే విధంగా 8-10 చోట్ల ఉప నమూనాలు సేకరించాలి. వాటిని ఒక శుభ్రమైన బకెట్లో వేసి బాగా కలపాలి. తడిగా ఉన్నట్లయితే మట్టిని నీడలో కాగితం లేదా గుడ్డ పైన ఆరబెట్టాలి. ఆ తర్వాత మట్టిలో గడ్డలు ఉంటే వాటిని పగలగొట్టి బాగా కలపాలి. <br />
అనంతరం మెత్తని మట్టిని ఒక పొరగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని, మిగిలిన మట్టిని పారేయాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేసి అర కిలో మట్టి నమూనా వచ్చే వరకూ వేరు చేయాలి. ఆ తర్వాత నమూనాను శుభ్రమైన చిన్న గుడ్డ సంచి/ప్లాస్టిక్ కవరులో నింపాలి. రైతు పేరు, గ్రామం, భూమి సర్వే నెంబరు, గతంలో వేసిన పంట వివరాలు, నీరు-ఎరువుల యాజమాన్యం, రాబోయే సీజన్లో వేయదలచుకున్న పంట, నమూనా సేకరించిన తేదీ తదితర వివరాలన్నీ ఒక మందపాటి కాగితం పైన రాసి ఆ కవరు లోపల పెట్టాలి. అనంతరం స్వయంగా లేదా పోస్ట్ ద్వారా లేదా మండల వ్యవసాయాధికారి ద్వారా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.<br />
<br />
<b>ఎంత లోతు నుంచి తీయాలి?</b><br />
పొలంలోని మట్టినంతా పరీక్షించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని మట్టి నమూనాల్ని సేకరించాలి. ఎంత లోతు నుంచి నమూనాను సేకరించాలనేది మనం పండించే పంట, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పైరు పంటలకు ఆరు అంగుళాలు, పండ్ల తోటలకు అయిదు నుంచి ఆరు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి మట్టిని సేకరించాలి. కారు చౌడు, ఆమ్ల నేలలైతే మూడు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి నమూనాలు తీసుకోవాలి.<br />
<br />
<b>ఈ భూముల్లో సేకరించొద్దు</b><br />
మట్టి నమూనాల్ని అప్పుడే ఎరువులు వేసిన పొలం, పెంట కుప్పలు వేసిన స్థలం, నీటిలో వుునిగి ఉన్న ప్రదేశం నుంచి సేకరించకూడదు. గట్లు, చెట్లు, బావులు, రహదారులకు దగ్గరగా నమూనాల్ని తీసుకోకూడదు. <br />
<br />
<b>కేంద్రాలు ఎక్కడున్నాయి?</b><br />
ప్రతి జిల్లా కేంద్రంలోనూ వ్యవసాయశాఖ వారి భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్లోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా నమూనాల్ని పరీక్షించి, సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తారు.<br />
<br />
<b>ప్రయోజనాలివే</b><br />
భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. మీ పొలంలో ఏ పంట వేయవచ్చో, దాని నుంచి ఎంత దిగుబడి సాధించవచ్చో తెలుసుకోవచ్చు. సాగుకు అనువుగా లేని కారు చౌడు, ఆమ్ల భూముల స్థాయిని, ఆ భూముల్ని సాగు యోగ్యంగా వూర్చడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షలో వెల్లడైన అంశాలను బట్టి భూమికి ఏయే ఎరువులు ఎంత మోతాదులో, ఏ రూపంలో వేయాలో తెలుసుకోవచ్చు. ఎరువుల్ని అవసరమైన మోతాదులోనే వాడతాము కనుక వృథా ఖర్చు తగ్గుతుంది. ఈ పరీక్షల వల్ల నేల రంగు, స్వభావం, ఆమ్ల -క్షారాలు, సేంద్రియ కర్బన పరిమాణాల గురించి తెలుసుకోవచ్చు. రైతు కోరితే సూక్ష్మపోషకాల లభ్యత గురించి కూడా తెలియజేస్తారు.</span><br />
<b>-బెరైడ్డి సింగారెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్,<br />
అగ్రానమిస్ట్, ఖమ్మం, ఫోన్: 9440797854<span style="font-size: large;"> </span></b> </div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-55950668669517810082012-03-03T05:15:00.000-08:002012-03-03T05:15:28.182-08:00చెరకు చెత్తే కదా అని కాల్చేయొద్దు<div dir="ltr" style="text-align: left;" trbidi="on"> <br />
<div class="redNote" id="div_Desc"><span style="font-size: large;"> <img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01032012/AGRI-SUGARCANE29-2-12-9671.jpg" /><b>చెరకు తోటలు నరికిన తర్వాత చాలా మంది రైతులు చెత్తను కాల్చేస్తుంటారు. అయితే దీనివల్ల వారికి ఎంతో నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఈ చెత్త చెరకు పైరు సాగులో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. చెరకు చెత్తను కాల్చేయడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలనే కాకుండా భూసారాన్ని, భూ భౌతిక స్వభావాన్ని పెంచే సేంద్రియ పదార్థాన్ని కూడా నష్టపోతున్నాము.కాబట్టి చెరకు చెత్తను పైరులో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై రైతులు అవగాహన కలిగి ఉండడం అవసరం.చెరకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుళ్లబెడితే చివికిన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది పైరుకు పోషక పదార్థాల్ని అందిస్తుంది. చెరకు చెత్తను మొక్క, పిలక తోటల్లో వేసుకోవచ్చు. </b><b><br />
<span style="color: red;">ఎలా కుళ్లబెట్టాలి?</span></b><br />
చెరకు చెత్తను కుళ్లబెట్టే శిలీంద్రాలు ఉంటాయి. రెండున్నర ఎకరాల తోటకు మూడు కిలోల శిలీంద్రాలు అవసరమవుతాయి. బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఫిల్టరు మడ్డికి ఈ శిలీంద్ర సముదాయాన్ని కలపాలి. దానిపై పలచగా నీరు చల్లి నీడలో ఉంచాలి. దానిపై గోనె సంచి లేదా వరి గడ్డి కప్పాలి. ఆ తర్వాత శిలీంద్రం వృద్ధి చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. అనంతరం దానిని సాళ్ల మధ్య పరచిన చెరకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఆ సమయంలో కొద్దిపాటి తేమ ఉండాలి.<br />
<b><br />
<span style="color: red;">ఎలా వాడాలి?</span></b><br />
పైన తెలిపిన విధంగా అభివృద్ధి చేసిన శిలీంద్ర సముదాయాన్ని మొక్క తోటల్లోనూ, కార్శి తోటల్లోనూ వాడుకోవచ్చు. మొక్క తోటల్లో అయితే ముచ్చెలు నాటిన మూడో రోజున చెరకు చెత్తను పొలంలో పలచగా పరవాలి. ఇందుకోసం ఎకరానికి సువూరు 1.25 టన్నుల చెత్త అవసరమవుతుంది. వర్షాకాలంలో కాలువలు ఎగదోసే సమయంలో 1.25 కిలోల శిలీంద్రం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను కలిపి ఆ మిశ్రవూన్ని ఎకరం విస్తీర్ణంలో పరచిన చెరకు చెత్తపై చల్లి మట్టితో కప్పాలి. అప్పుడు ఆ చెత్త మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.<br />
<br />
ఇక కార్శి (పిలక) పంట తీసుకునే వారు మొక్క తోటలు నరికిన తర్వాత చెరకు చెత్తను (ఎకరానికి 1.25 టన్నులు) సాళ్లలో వేసి, దానిపై ఎకరానికి 10 కిలోల చొప్పున సూపర్ ఫాస్ఫేట్, ఎనిమిది కిలోల యూరియా, 1.25 కిలోల శిలీంద్రం కలిపి చేనంతా కలిసేలా చల్లాలి.కార్శి మోళ్లకు ఆనుకొని లోతుగా నాగలితో దున్నినట్లయితే మొదళ్ల వద్ద ఉన్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడు కొత్తగా వచ్చే పిలకలు బాగా మొలుస్తాయి. నేలలో వేసిన చెరకు చెత్త కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన చెరకు చెత్తను సాళ్ల మధ్య పలచగా పరచుకోవచ్చు.</span> <span style="font-size: large;"><br />
<b><br />
<span style="color: red;">ఉపయోగాలివే</span></b><br />
చెరకు చెత్తను సాళ్లలో పరిచి, కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకుంటే పలు ప్రయోజనాలు చేకూరుతాయి. సాళ్ల మధ్యలో చెరకు చెత్తను కప్పితే తేమ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. వర్షాధారపు చెరకు సాగుకు ఇది ఎంతో ఉపయోగకరం.<br />
<br />
సాళ్లలో చెత్తను పరిస్తే నాటిన/కార్శి చేసిన తొలి దశలో కలుపు మొక్కలు మొలవకుండా నివారించవచ్చు. అంతేకాదు... పీక పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.చెరకు చెత్తను కప్పడం వల్ల భూమిలో తేమ చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. వేసవిలో తోటకు సరిగా నీరు పెట్టలేకపోయినప్పటికీ భూమిలో నిల్వ ఉన్న తేమ వల్ల పైరు వడలిపోదు. నీటి తడులు తక్కువగా ఇచ్చినా సరిపోతుంది. చెరకు చెత్తను కాలిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని సాళ్ల మధ్య పరవడం ద్వారా ఆ కాలుష్యాన్ని నివారించవచ్చు. పాల చౌడు, చౌడు భూముల్లో చెరకు చెత్తను సాళ్లలో పరిచి తేమను కాపాడి, భూమిలోని లవణాల్ని వేర్ల దగ్గరికి రాకుండా చేయడం వల్ల పైరు బలంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తుంది.</span> <span style="font-size: large;"><br />
<br />
<b><span style="color: red;">చెత్తను నేరుగా...</span></b><br />
<img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01032012/AGRI-COMPOST29-2-12-10671.jpg" /> చెరకు చెత్తను నేరుగా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. టన్ను చెరకు చెత్తను కంపోస్ట్గా మార్చాలంటే మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల పొడవుతో గొయ్యి తీయాలి. అందులో 15 సెంటీమీటర్ల మందాన చెరకు చెత్త పరిచి, తేమగా ఉండేందుకు నీరు చిలకరించాలి. <br />
<br />
దాని పైన పేడ నీటిని చల్లాలి. మళ్లీ దాని పైన కిలో శిలీంద్ర సముదాయం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి. ఆ తర్వాత ఒకటి రెండు సెంటీమీటర్ల మందాన మట్టి కప్పాలి. నాలుగు నెలల్లో చెరకు చెత్త కుళ్లి కంపోస్ట్గా మారుతుంది. దానిని నేరుగా పొలంలో వేసుకోవచ్చు. ఇలా పొరలు పొరలుగా చెరకు చెత్తను గోతిలో వేస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు.</span> <span style="font-size: large;"><br />
<br />
<b><span style="color: red;">ఈ పోషకాలు లభిస్తాయి</span></b></span> <span style="font-size: large;"><br />
చెరకు చెత్తలో 0.41 శాతం నత్రజని, 0.16 శాతం భాస్వరం, 0.72 శాతం పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 0.2 నుండి 0.9 శాతం వరకూ ఉంటాయి.</span><span style="color: red; font-size: large;">- వలేటి గోపీచంద్</span><span style="font-size: large;"><br />
ఎమ్మెస్సీ అగ్రికల్చర్<br />
ఆకాశవాణి, హైదరాబాద్</span></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-31111759260291398032012-03-03T04:56:00.001-08:002012-03-03T04:59:45.453-08:00వేసవి పంటలతో మంచి ఆదాయం!<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/27022012/AGRI-SORA26-2-12-4265.jpg" /><br />
<span style="font-size: large;"><b>వేసవి వచ్చేసింది. ఇప్పటికే కూరగాయ ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో వీచే పొడి గాలులు, పెరిగే ఉష్ణోగ్రతలు, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీ టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు ఈ సీజ న్లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చునని నల్లగొండ ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి సూచిస్తున్నారు. ఆ వివరాలు...</b><br />
<br />
<b style="color: red;">ఈ పంటలు వేసుకోవచ్చు</b></span> <span style="font-size: large;"><br />
వేసవిలో తీగ జాతి కూరగాయలైన కాకర, బీర, బెండ, ఆనప, దోస, దొండ, పొట్ల, దుం ప జాతి కూరగాయలైన చేమ, కంద, ముల్లంగితో పాటు టమాటా, ఆకుకూర పంటల్ని వేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో పండించే వంగ, గోరుచిక్కుడు, బెండ, మిరప వంటి పంటల్ని కూడా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారుల సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల్ని ఎంపిక చేసుకోవాలి.<br />
<br />
<b>ఇలా వేసుకోవాలి</b></span> <span style="font-size: large;"><br />
వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉం టాయి. ఎండ వేడికి నారు వడలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొక్కల్ని సాధ్యమైనంత వరకూ సాయంకాలం వేళ నాటుకోవాలి. విత్తనాలు నేరుగా విత్తేటట్లయితే విత్తిన వెంటనే నీరు కట్టి, ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకూ మూడు నాలుగు రోజులకు ఒకసారి తడి అందించాలి. వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక విత్తనాల్ని దగ్గర దగ్గరగా వేసుకోవాలి.<br />
<br />
టమాటా వేసే వారు వరుసలు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటించాలి. ఎకరానికి 250 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. వంగ వేసే వారు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం (ఎకరానికి 350 గ్రాముల విత్తనాలు) ఉండేలా నాటాలి. బెండ వేయాలనుకుంటే 45-20 సెంటీమీటర్లు (ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు), పచ్చి మిరపకు 45-45 సెంటీమీటర్లు (600 గ్రాములు), గోరుచిక్కుడుకు 50-20 సెంటీమీటర్లు (నాలుగు కిలోలు), బీర, దోసకు 100-50 సెంటీమీటర్లు (బీర అయితే రెండు కిలోలు, దోస అయితే 1.5 కిలోలు), కాకరకు 150-50 సెంటీమీటర్ల (రెండు కిలోల విత్తనాలు) దూరాన్ని పాటించాలి. ఆనప వేసే వారు వరుసల మధ్య 300 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 100 సెంటీమీటర్ల దూరం ఉండేలా (ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనాలు) మొక్కలు నాటుకోవాలి.</span> <span style="font-size: large;"><br />
<br />
<b>బిందుసేద్యం-మల్చింగ్ మేలు</b></span> <span style="font-size: large;"><br />
వేసవి కూరగాయ పంటలకు బిందుసేద్యం ద్వారా నీరందిస్తే మంచిది. దీనివల్ల ప్రతి రోజూ అవసరమైన మేరకు నీటిని అందించవచ్చు. మామూలు పద్ధతిలో అయితే అయిదు నుండి ఏడు రోజుల వ్యవధి ఇస్తూ నీటి తడులు ఇవ్వాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కూరగాయ పంటల సాళ్లలో ప్లాస్టిక్ షీట్లు కప్పాలి. దీనివల్ల భూమి వేడెక్కదు. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉండదు. డ్రిప్ లాటరల్ పైపుల్ని షీట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. టమాటా పంటను షేడ్నెట్ కింద పండించడం మంచిది.<br />
<br />
<b>ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు: </b></span> <span style="font-size: large;">ఫర్టిగేషన్ (నీటిని అందించే పైపుల ద్వారా) పద్ధతిలో ఎరువుల్ని అందిస్తే మొక్కలు క్రమ పద్ధతిలో, ఏపుగా పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో అయితే మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేసినప్పుడు తగినంత నీటిని అందించాల్సి ఉంటుంది. లేకుంటే మొక్కలు మాడిపోతాయి. స్థానిక వ్యవసాయాధికారుల సలహా మేరకు ఎరువులు వేసుకోవాలి.<br />
<br />
<b>పూత-పిందె రాలకుండా</b></span> <span style="font-size: large;">...<br />
వేసవి కూరగాయ పంటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే వ్యవసాయాధికారుల సూచనల మేరకు హార్మోన్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి (ఎకరానికి 200-250 లీటర్ల ద్రావణం) పిచికారీ చేస్తే కాయలు పగలకుండా ఉంటాయి. ఆకులు పల్లాకు రంగులోకి మారితే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.<br />
<br />
<b>ఉద్యానవన శాఖ సబ్సిడీ</b></span> <span style="font-size: large;"><br />
ఉద్యానవన శాఖ వేసవిలో 50 శాతం సబ్సిడీపై రైతు కోరుకున్న బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని పంపిణీ చేస్తోంది. అలాగే మల్చింగ్కు వాడే ప్లాస్టిక్ షీట్ల కొనుగోలుకు కూడా యాభై శాతం సబ్సిడీతో ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తోంది. తీగ జాతి కూరగాయల సాగుకు ఎకరం భూమిలో పందిళ్లు వేసుకొంటే 50 శాతం సబ్సిడీ కింద 60 వేల రూపాయలు అందిస్తోంది.<br />
<br />
<b>చీడపీడల నివారణ కోసం...</b></span> <span style="font-size: large;"><br />
వేసవిలో కూరగాయ పంటల్ని వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత దశలో ఉన్నప్పుడు పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడకూడ దు. సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి. బెండలో ఎర్రనల్లి నివారణకు లీట రు నీటికి అయిదు మిల్లీలీటర్ల చొప్పున డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. వంగ, బెండ పంటల్లో పచ్చదోమ, తెల్లదోమ నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మెటాసిస్టాక్/డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొర, బీర, దొండ, దోస జాతి కూరగాయల్లో కాయ తొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బరిల్ + రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. </span></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-58989085521057594222012-02-19T00:34:00.000-08:002012-02-19T00:34:44.841-08:00టూనా..A MILLION DOLLAR FISH<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: large;"><a href="http://2.bp.blogspot.com/-AzbJFzi-ALw/T0CzxuP-6fI/AAAAAAAAjDw/go7bGdyn3Mk/s1600/cover.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="640" src="http://2.bp.blogspot.com/-AzbJFzi-ALw/T0CzxuP-6fI/AAAAAAAAjDw/go7bGdyn3Mk/s640/cover.jpg" width="635" /></a></span></div><h1 class="headline"><span style="font-size: large;"><br />
</span></h1><div id="page1"><div class="RunningText"> <span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/19/images/19-2sun25.jpg" /><b><br />
<br />
ప్రపంచంలోనే ఖరీదైన చేప 'టూనా'. మన దగ్గర దాన్ని 'తూర' అని పిలుస్తారు. టూనాలను చూస్తే జపనీయులు లొట్టలేస్తారు. అచ్చం వంజరంలా వుంటుంది. కొందరికి అదేమిటో కూడా తెలియదు కాబట్టి సింపుల్గా అద్భుతమైన చేప అని చెప్పాల్సి ఉంటుంది. దాని మాంసం మహాద్భుతం. అయితే విదేశాల్లోనే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. మన టూనాలు జపాన్, అమెరికాలకే ఎగుమతి అవుతాయి. దీనివల్ల భారతదేశానికి ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ఇంత విలువైన టూనా ఎక్కడంటే అక్కడ దొరకదు. విశాఖపట్నం సముద్రతీరంలోనే ఎక్కువగా దొరుకుతోంది. <br />
<br />
ఒక్కొక్కసారి అండమాన్, కేరళ, తమిళనాడుల్లోని కొన్నిచోట్ల మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే అంటే- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలోనే జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని సొమ్ము చేసుకుంటారు. టూనా నీటిలో ఈదే తీరు, వాటి సంచారం, వేటాడే పద్ధతి, మార్కెట్కు చేరవేసే ప్రక్రియ, విక్రయించే పద్ధతి అన్నీ ఆసక్తి కలిగిస్తాయి. జపాన్లో గత నెల ఐదవ తేదీన సుజుకీ అనే చేపల సంతలో టూనాలను వేలం వేస్తే- బ్లూఫిన్ అనే ఒక చేప 7.36 లక్షల డాలర్లు పలికింది. మన కరెన్సీలో చెప్పాలంటే...రూ.3.58 కోట్లు. ఖరీదులో టూనాతో సరితూగే చేప మరొకటి లేదు.</b><br />
<br />
ఇది కొత్త జీవరాశి ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇదివరకు ఈ చేపను ప్రత్యేకంగా ఎవరూ వేటాడలేదు. అందుకే వెలుగులోకి రాలేదు. మన సముద్ర జలాల్లో దొరికే టూనాను విదేశీయులే ముందు పసిగట్టారు. వేటాడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొన్నారు. సముద్రంలో చేపను పట్టి, అటు నుంచి అటే వాళ్ల దేశాలకు తీసుకెళ్లేవారు. దాదాపుగా ఇరవై ఏళ్లపాటు ఇలాగే జరిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. విదేశీ ట్రాలర్లు వచ్చి మన చేపలను పట్టుకెళుతున్నారని కనిపెట్టిన తర్వాత భారత జాలర్లు దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అవి 'తూరలు' అని తేలింది. ఆ చేపల్ని విదేశీయులు 'టూనా' అని పిలుస్తారని, వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందని మనవాళ్లకు అర్థమైంది. కాని టూనా చేపల్ని ఎలా పట్టుకోవాలో తెలియలేదు. ఎందుకంటే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం.<br />
<br />
<b>అన్వేషణలో తగిలిన టూనా..</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/19/images/19-2sun26.jpg" /></span> <span style="font-size: large;"> ఇదివరకు పాత పద్ధతులతోనే చేపల్ని పట్టేవారు. కొన్నేళ్ల కిందటి నుంచి సాంకేతిక పద్ధతుల్ని జోడించారు. అందులో 'ట్రాలింగ్' ఒకటి. ట్రాలర్కు ముందు రెండు ఆర్టర్ బోట్లు వుంటాయి. అవి సముద్రంలోపలికి వలలను వేసుకుంటూ ముందుకు వెళతాయి. ఆ వలలకు పిల్లలతో సహా రొయ్యలు, చేపలు చిక్కుతాయి. అయితే దీని వల్ల చేపలు బాగానే దొరుకుతున్నా మత్స్య సంపద మొత్తం నాశనమైపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆ విషయాన్నే మత్స్యకారులకు చెప్పారు. మరోవైపు నేలపై రొయ్యలసాగు విస్తరించింది. ఈ రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో.. మత్స్యకార సంఘం నాయకుడు వైజీకే మూర్తి సముద్రపు చేపలపై ప్రత్యేక అధ్యయనం చేశారు. విశాఖ సముద్ర తీరంలో టూనాలు పుష్కలంగా వున్నాయని, వాటికి ఎక్కడలేని డిమాండ్ ఉందని తెలుసుకున్నారు.<br />
<br />
అప్పటికే తైవాన్ జాలర్లు టూనాలను పట్టి సొమ్ము చేసుకుంటున్నారు. టూనాల జాడ కనిపెట్టడం, పట్టుకోవడం, అమ్ముకోవడంలో మెళకువలను అధ్యయనం చేసేందుకు పన్నెండు దేశాలను చుట్టొచ్చారు మూర్తి. సాధారణ ట్రాలర్లతో వేటాడితే భారీ సంఖ్యలో టూనాలను పట్టుకోవడం కష్టమని తెలుసుకున్నారు. టూనాల వేటకు ప్రత్యేక 'లాంగ్లైనర్లు' తప్పనిసరని గుర్తించారు. విశాఖపట్నం జాలర్లతో ఆ విషయాన్నే చెప్పారు. జాలర్లకు శిక్షణ ఇప్పించేందుకు శ్రీలంక నుంచి 40 మంది నిపుణులను తీసుకొచ్చారు. అప్పట్లో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రిగా వున్న జైరామ్ రమేష్ విషయం అర్థం చేసుకొని సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అలా మొదలైంది విశాఖలో టూనాల వేట.<br />
<br />
<b>ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది?</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/19/images/19-2sun27.jpg" /></span> <span style="font-size: large;"> టూనా చేపలది చాలా చిత్రమైన జీవనశైలి. సాధారణ చేపల్లో వుండే 'ఫ్లోటింగ్ బ్లాడర్' దీనికి వుండదు. బ్లాడర్ లేకపోవడం వల్ల నీటిలో తేలేందుకు నిత్యం ఈదుతూ ఉండాల్సొస్తుంది. పొరపాటున ఈత ఆపిందనుకో ఆక్సిజన్ అందక చనిపోతుంది. అందుకే ఈ చేపకు విశ్రాంతి అనేదే ఉండదు. టూనా గంటకు 70కి.మీ. వేగంతో కదులుతుంది. ఒక మాటలో చెప్పాలంటే టూనా వలస జీవి. నిత్యం ఈదడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా వుంటుంది. వేడిని తగ్గించుకోవడానికి చల్లని ప్రాంతాల్లో సంచరిస్తుంది. సుమారు 26 డిగ్రీలు, అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత వున్న నీటిలోనే ఎక్కువగా సంచరిస్తుంది. సముద్రంలో గ్రీన్ ఆల్గేలు అధికంగా వుంటాయి. వాటిలో ఉన్న క్లోరోఫిల్ తినడానికి చిన్నిచిన్న చేపలు వాటి చుట్టూ చేరుతాయి. ఆ చిన్ని చేపలను భోంచేయడానికి టూనా ఆ ప్రదేశానికి వెళుతుంది. అంటే- గ్రీన్ ఆల్గేలు, చిన్నచేపలు, చల్లటి ప్రాంతం.. ఇవన్నీ ఎక్కడుంటే టూనా అక్కడ ఉంటుందని జాలర్లు తెలుసుకున్నారు. డాల్ఫిన్ చేపల్లా టూనా కూడా తెలివైన చేప. అది డాల్ఫిన్లతో సన్నిహితంగా మెలుగుతుంది. అందుకే టూనాలను పట్టుకునేందుకు డాల్ఫిన్లు కూడా ఒక ఆధారమయ్యాయి.<br />
<br />
<b>వేట కూడా సపరేటు...</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/19/images/19-2sun28.jpg" /></span> <span style="font-size: large;"> ఏ చేపల్ని వేటాడాలన్నా.. వలలు తప్పనిసరి. అయితే టూనాలకు మామూలు వలలు పనికిరావు. రెండు నుంచి 80కిలోల దాకా బరువుండి, గంటకు 70కి.మీ. వేగంతో కదిలే టూనాల ధాటికి మామూలు వలలు తట్టుకోలేవు. ఒకవేళ వలకు చిక్కినా దాన్ని చించుకుని వెళ్లిపోతాయవి. అందుకని టూనాలను 'హుక్'లతో గేలం వేసి పట్టుకుంటారు. తైవాన్లో అయితే టూనాల వేటకు మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'లాంగ్ లైనర్' అనే ట్రాలర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రాలర్ ఖరీదు కోటి రూపాయలు. <br />
<br />
టూనాలపై అధ్యయనం చేసిన వైజీకే మూర్తి ఈ లాంగ్లైనర్ల గురించి తెలుసుకున్నాక, వాటిని కొనేందుకు ప్రభుత్వ సాయం కోరారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) దానికి స్పందించి ముందుకొచ్చింది. అయితే కొత్తవి కొనడం కష్టం కాబట్టి అప్పటికే చేపలవేటకు వినియోగిస్తున్న ట్రాలర్లను లాంగ్లైనర్లుగా మార్చుకుంటే సాయం చేస్తామంది ఆ సంస్థ. ఆ మేరకు 20 మీటర్ల కంటే తక్కువ పొడవున్న ట్రాలర్ల కన్వర్షన్కు రూ.7.5 లక్షలు, అంతకంటే ఎక్కువ పొడవున్న ట్రాలర్లకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఇలా మొత్తం 20 ట్రాలర్లు జాలర్లకు అందాయి. వాటిని ఎంపెడా అధ్యక్షుడు మోహన్కుమార్ నేతృత్వంలో విశాఖపట్నంలో ప్రారంభించారు. దీంతో టూనాల వేట సులువైంది.<br />
<br />
<b>లాంగ్లైనర్ అంటే..?</b></span> <span style="font-size: large;"><br />
టూనాల వేటకు ఉపయోగించే.. లాంగ్లైనర్కు అర్థం ఆ పేరులోనే వుంది. పొడవుగా, లైనుగా ఒక తాడును సముద్రంలోకి వేసి, వేలాడదీసిన ప్రత్యేకమైన హుక్కులను వాటికి అమరుస్తారు. పొడవాటి నైలాన్ తాడుకు పది మీటర్లకు ఒకటి చొప్పున ఈ హుక్కులుంటాయి. సముద్రంలో ఈ తాడును 200కి.మీ. పొడవు వరకు విడిచిపెడతారు. హుక్లు వంకీలు తిరిగి వుండడం వల్ల అది కూడా ఒక రకమైన సముద్రజీవి అనుకొని.. వాటిని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి టూనాలు. అలా నోటితో కొరకగానే హుక్కుకు చిక్కుకుపోతాయి. దాన్నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. కానీ తప్పించుకోలేవు. ఈ నైలాన్తాడును కొందరు జాలర్లు చేతితో ఉపయోగిస్తే, మరికొందరు హైడ్రాలిక్ సిస్టమ్తో వాడతారు. ఒక లాంగ్లైనర్కు పది అంతకంటే ఎక్కువ టూనాలు దొరికినప్పుడు ఆ నైలాన్ తాడును పట్టుకొని లాగడం చాలా కష్టం. ఒక్కో టూనా 20 కిలోలు తూగినా.. ఇరవై టూనాలు కలిస్తే 400కిలోల బరువుంటుంది. అంత బరువును లాగడం ఒకరిద్దరి వల్ల అయ్యే పనికాదు. అందుకని హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగిస్తారు.<br />
<br />
<b>రవాణా ప్రత్యేకం...</b></span> <span style="font-size: large;"><br />
టూనాను పట్టుకోవడం ఎంత కష్టమో.. మార్కెట్కు చేరవేయడం అంతే కష్టం. చేప చర్మం గీసుకుపోకుండా, తాజాదనం తగ్గకుండా వుండే టూనాలకే అధిక ధర పలుకుతుంది. మొదటి రకం టూనాలను 'సష్మీ' గ్రేడ్ అంటారు. ఆ తరువాత రకాన్ని బి-గ్రేడ్గా వ్యహరిస్తారు. విదేశీ జాలర్లు టూనాలను పట్టుకున్న వెంటనే ఆ సమాచారాన్ని తమ కొనుగోలుదార్లకు తెలియజేసి, సముద్రం పైకే హెలికాప్టర్లను రప్పించుకుంటారు. నడిసముద్రంలోనే వాటిని జాగ్రత్తగా హెలికాప్టర్లోకి ఎక్కించి మార్కెట్కు తరలిస్తారు. మన దగ్గర ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు కాబట్టి మనకు దొరికిన వాటిని మిగిలిన చేపలతో పాటు కలిపేసి హార్బర్కు తరలించి.. బి- గ్రేడు సరకుగా అమ్ముతారు. ఇలా అమ్మితే జాలర్లకు పెద్దగా గిట్టుబాటు అవ్వదు. తాజా చేపకున్న రేటు ఆలస్యమయ్యేకొద్దీ తగ్గుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే టూనాలను జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు మన జాలర్లు.<br />
<br />
<b>ఎలాగంటే...?</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/19/images/19-2sun29.jpg" /></span> <span style="font-size: large;"> సముద్రంలో టూనాను పట్టుకుంటూనే- 'స్టన్నర్' అనే పరికరంతో ఎల్రక్టిక్ షాక్ ఇస్తారు. దాంతో అది అచేతనంగా మారిపోతుంది. అప్పుడు బోటులోకి చేర్చి వెంట వెంటనే భద్రపరిచే చర్యలు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్తో ఆపరేషన్లానే ఐసింగ్ చేస్తారు. ముందుగా తలపైన వుండే సాఫ్ట్స్పాట్లో రబ్బరు సుత్తితో ఒక దెబ్బ వేస్తారు. అక్కడ రంధ్రం వేసి లోపల వున్న మెదడు మొత్తం తీసేస్తారు. ఆ తరువాత మోనోఫిలమెంట్ లైన్ గాని, స్టీల్వైరు గాని స్పైన్లోకి పంపిస్తారు. అప్పుడు ఆ చేప న్యూరల్ డెత్కు గురవుతుంది. మొప్పల దగ్గరుండే యానస్ నుంచి పేగులు తీసేస్తారు. రక్తాన్ని కూడా లాగేస్తారు. ఎక్కడా చిన్న రక్తపుమరక లేకుండా చేపను శుభ్రపరుస్తారు. <br />
<br />
ఇలా చేయడాన్ని గ్రిల్లింగ్ అండ్ గట్టింగ్ అంటారు. చేప శరీరంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు వున్నాయో వాటన్నిట్నీ ఐస్పౌడర్తో నింపేస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన 'స్లర్' అనే పెద్దతొట్టెలో ఐదు నుంచి ఏడు గంటలపాటు వుంచుతారు. కొద్దిసేపయ్యాక వేరే బాక్సుల్లో ఐసు లేయర్ల మధ్య భద్రపరుస్తారు. ఆ బాక్సుల్ని తీరానికి చేర్చి కొనుగోలుదార్లకు విక్రయిస్తారు. టూనా ఎంత భద్రంగా, తాజాగా వుంటే అంత మంచి ధర లభిస్తుంది. ఏమాత్రం డామేజీ వున్నా రేటు తగ్గిపోతుంది. ఈ పనులన్నీ లాంగ్ లైనర్లతో మాత్రమే చేయడానికి వీలవుతుంది. సాధారణ ట్రాలర్లు, బోట్లలో వెళ్లి టూనాలను వేటాడే జాలర్లకు ఇవన్నీ సాధ్యం కావు.<br />
<br />
<b>ఇద్దరే వ్యాపారులు..</b></span> <span style="font-size: large;"><br />
విశాఖపట్నం కేంద్రంగా ఇద్దరంటే ఇద్దరే వ్యాపారులు వున్నారు. వారు చెప్పిందే వేదం. టూనాలు హార్బర్కు చేరగానే వారి వద్దకు చేరుస్తారు జాలర్లు. వ్యాపారుల దగ్గర ప్రత్యేక నైపుణ్యం కలిగిన గ్రేడర్లు వచ్చి టూనాలను వేరు చేస్తారు. ఇరవై కిలోల కంటే తక్కువ బరువున్నవన్నీ ఒక దగ్గర, అంతకంటే ఎక్కువ బరువున్నవి మరొక చోట చేరుస్తారు. ఆ తరువాత ఒక్కో చేపను పరిశీలిస్తారు. బియ్యం నాణ్యతను పరిశీలించడానికి చిన్నపాటి పరికరాన్ని బస్తాలోకి గుచ్చి ఎలా శాంపిల్ తీస్తారో... ఇక్కడ గ్రేడర్లు కూడా అలాగే చిన్న పరికరాన్ని టూనా శరీరంలోకి గుచ్చి చిన్న మాంసపుముక్కను బయటకు తీస్తారు. దాని రుచి, రంగు, నూనె పరిమాణం, చేప తాజాదనం నిర్ధారించి.. ధరను ఫిక్స్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చేపకు ఎందుకింత డిమాండ్ ఉందంటే వేటిలోనూ లేనంత స్థాయిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి కనుక.<br />
<br />
<b>ధరలో దగా</b></span> <span style="font-size: large;"><br />
ప్రస్తుతం విశాఖలో కిలో టూనా ధర రూ.130. అదే చేపను అమెరికా లేదా జపాన్ మార్కెట్లకు తీసుకెళితే రూ.400 వరకు వస్తుంది. కానీ జాలర్లకు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంత వేగంగా అమ్ముకుంటే అంత ధర వస్తుందని తెలుసు కాబట్టి, త్వరగా విక్రయించాలనే చూస్తారు. మంచిరేటు వచ్చేవరకు ఎదురు చూడడానికి కుదరదు. కాలం గడిచే కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది. ఇక్కడే దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ వేట వచ్చిందని, రేటు పడిపోయిందని అబద్దాలు చెప్పి స్థానిక మత్స్యకారుల నుంచి తక్కువ ధరకు కొని లాభపడుతున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే.. టూనాలను ఎగుమతి చేసేవరకు నిల్వ చేసుకోవడానికి చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. <br />
<br />
దీని కోసం భారతీయ మత్స్యపరిశ్రమల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. విశాఖపట్నంలో వున్న హార్బర్లోనే కొంత స్థలం కేటాయిస్తే.. అక్కడ చిల్లింగ్ సెంటర్ పెట్టుకుంటామని జాలర్లు కోరుతున్నారు. అయితే ఏకంగా హార్బర్నే ఇంకో చోటుకు(భీమిలి సమీపాన మూలకుద్దు) తరలించే యోచన వుండడంతో విశాఖపట్నం పోర్టు వీరి అభ్యర్థనను పట్టించుకోవడం లేదు. స్థలం సమకూర్చుకుంటే... చిల్లింగ్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ఎంపెడా వంటి సంస్థలు అంగీకరించాయి. కానీ స్థలమే దొరకడం లేదు. చిల్లింగ్ సెంటర్ వుంటే.. టూనాలను వచ్చినవి వచ్చినట్టు నిల్వ చేసి, మంచి ధర వున్నప్పుడు మార్కెట్కు ఎగుమతి చేసుకునే సౌలభ్యం దొరుకుతుంది. ఇలా చేస్తే.. టూనా జాలర్లకే కాదు, దేశానికే సంపదవుతుంది.<br />
<br />
<b>అక్కరకు రాని 'ట్యాగింగ్'</b></span> <span style="font-size: large;"><br />
టూనాలను పట్టుకునేందుకు విదేశాల్లో చురుకైన పరిశోధనలు సాగుతున్నాయి. టూనాల సంచారం, గమ్యం, ఏయే మార్గాల్లో వెళుతున్నాయో తెలుసుకోవడానికి 'ట్యాగింగ్ ప్రోగ్రాం' అమలు చేస్తున్నాయి. సముద్రంలో దొరికే పిల్ల టూనాలకు ఒక చిప్ను ట్యాగ్ సాయంతో కట్టి, దాని కదలికలను పసిగడతారు. ఎలాంటి వాతావరణంలోకి వెళుతున్నది, ఎంత లోతున సంచరిస్తున్నది తదితర వివరాలు సేకరిస్తారు. ఇటీవల జపాన్లో ఒక టూనాకు ట్యాగ్ కడితే... అది మూడు నెలల్లో పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నార్త్మెక్సికోలో జాలర్ల వలకు చిక్కింది. మనకూ అలాంటి ప్రోగ్రాం చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.<br />
<br />
<b>టూనాలను ఎగరేసుకుపోతున్నారు</b></span> <span style="font-size: large;"><br />
* కేంద్రంలో మత్స్యపరిశ్రమకు ప్రత్యేక శాఖ లేదు. దేశంలో అరవై లక్షలకు పైగా జాలర్లు వున్నా.. విదేశీ మారకద్రవ్యం భారీగా ఆర్జించే వీరి సంక్షేమానికి విధానాల రూపకల్పన అంతా వ్యవసాయ శాఖ కిందే జరుగుతోంది. దీన్ని మత్స్యకార సంఘాల నాయకులు నిరసిస్తున్నారు.<br />
* కొందరు స్వార్థపరుల కారణంగా భారత సముద్రజలాల్లో చేపలను వేటాడేందుకు విదేశీ నౌకలకు అనుమతులు (లెటర్ ఆఫ్ పర్మిషన్- ఎల్ఓపీ) ఇస్తున్నారనేది జాలర్ల ప్రధాన వాదన. వారి అధునాతన ట్రాలర్లు సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకుపోతున్నాయని, వారి ముందు తాము నిలువలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో మురారీ కమిటీ సిఫార్సు మేరకు 1996-2001 మధ్యన విదేశీ ట్రాలర్లను నిషేధించారు. అయినా వారు దొంగతనంగా వచ్చి టూనాలను వేటాడి తీసుకుపోయేవారు. ఇప్పుడు మళ్లీ వంద విదేశీ ట్రాలర్లకు అనుమతి ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని ఐదువందలకు పైగా ట్రాలర్లను తెచ్చి.. విలువైన టూనాలను ఎగరేసుకుపోతున్నారు.<br />
* టూనాలు ఎలాంటి వాతావరణంలో వుంటాయనేది తెలిసినా, కరెక్టుగా ఎక్కడ సంచరిస్తున్నాయో తెలిస్తే.. వాటిని వేటాడడం చాలా సులువు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఉపగ్రహ సాయంతో సేకరించిన సమాచారాన్ని విదేశీ నౌకలకు అమ్ముకుంటోంది. దాంతో వారు టూనాలను సులువుగా పట్టుకుంటున్నారు.<br />
ప్రస్తుతం హైదరాబాద్లోని ఇన్కాయిస్ (ఇండియా నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్) చేపలవేటకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తోంది. టూనాలకు సంబంధించిన సమాచారం ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంది.<br />
<br />
<b>ప్రత్యేక రాయితీ ఇవ్వాలి</b></span> <span style="font-size: large;"> <b>- వైజేకే మూర్తి, అధ్యక్షుడు, మత్స్యపరిశ్రమల సమాఖ్య</b><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/19/images/19-2sun30.jpg" /></span> <span style="font-size: large;"> త్వరలో విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమానాలు నడపడానికి ముందుకు వస్తున్నందున, వాటి ద్వారా టూనాలను ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. అలాగే సముద్రంలో దొరికిన టూనాలను వెంటనే చిల్లింగ్ సెంటర్కు లేదంటే తీరానికి చేర్చడానికి మదర్బోట్లు రెండు మూడు మంజూరు చేయాలి. ఇవి సముద్రంలో తిరుగుతూ, ట్రాలర్లకు చిక్కిన టూనాలను వెంటవెంటనే ఒడ్డుకు చేర్చి మార్కెట్లో విక్రయించి, ఎక్కువ ధరను రాబట్టగలుగుతాయి.<br />
<br />
మన సముద్రజలాల్లో ఎల్లోఫిన్ (మొప్పలు పసుపురంగులో వుంటాయి), బిగ్ ఐ (కళ్లు పెద్దవి వుంటాయి), స్కిప్జాక్ (చారలు వుంటాయి) అనే మూడు రకాలు దొరుకుతాయి. బ్లూఫిన్ అనే రకం అత్యంత విలువైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంతరించే పోయే దశలో వుంది. అందుకని వీటిని జపాన్, అమెరికా దేశాల్లో పెంచుతున్నారు. ఈ టూనా చేపలు మూడు మీటర్ల పొడవుండి 700కిలోల బరువుదాకా పెరుగుతాయి.<br />
</span></div><div class="RunningText"><span style="font-size: large;"><b>- </b><b>య</b><b>ర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం</b><b> </b></span> </div></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-51810308538853865342012-02-12T00:19:00.000-08:002012-02-12T00:19:40.861-08:00'' సర్టిఫైడ్ '' సేద్యం<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><h1 class="headline"></h1><div id="page1"><div class="RunningText"> <span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun25.jpg" /><b>మీరు తరచూ సూపర్మార్కెట్లకు వెళుతుంటారా..? ఈసారి వెళితే.. ఆర్గానిక్ ఫుడ్రాక్లను చూడండి. అందులో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు ఆకర్షణీయమైన ప్యాక్లలో ఆకట్టుకునేలా ఉంటాయి. వాటిని కొనాలని చేతుల్లోకి తీసుకోగానే బహుశా మీకు వచ్చే సందేహం 'ఇది ఆర్గానిక్ ఫుడ్' అని ఎలా నమ్మొచ్చు? అన్న అనుమానం కలుగుతుంది. ఫుడ్ప్యాక్లను తేరిపార చూస్తే 'ఇండియా ఆర్గానిక్' అన్న లోగో కనిపిస్తుంది. అప్పుడే అది నిజమైన ఆర్గానిక్. ఈ లోగోతో దొరికే ఉత్పత్తుల వెనుక పెద్ద కథే ఉంది. రసాయనాలు లేకుండా పండించే రైతు దగ్గర నుంచి.. ఢిల్లీలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సంస్థ అందించే సర్టిఫికెట్ల వరకు.. మధ్యలో బోలెడు ప్రక్రియలు నడుస్తాయి..</b></span><img alt="http://www.agricultureinformation.com/mag/wp-content/uploads/2009/01/organic-farming.jpg" src="http://www.agricultureinformation.com/mag/wp-content/uploads/2009/01/organic-farming.jpg" /><img alt="http://www.goorganica-z.com/wp-content/uploads/28_18_orig.jpg" src="http://www.goorganica-z.com/wp-content/uploads/28_18_orig.jpg" /><br />
<span style="font-size: large;"> ఇవ్వాళ దేశవ్యాప్తంగా యాభై లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోంది. ఏటా రూ.2,500 కోట్ల విలువైన సేంద్రీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం. సేంద్రీయ సాగును మరింత పెంచేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతుల సంఖ్య పెంచేందుకు కృషి జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా- సేంద్రీయ సాగుకు ఒప్పుకున్న రైతులు మొదట సంఘాలుగా ఏర్పడతారు. ఒక్కో సంఘం కింద 50 హెక్టార్ల సాగు భూమి ఉంటుంది. వీరికి ప్రభుత్వమే సేంద్రీయ ఎరువుల్ని సరఫరా చేస్తుంది. వరుసగా మూడేళ్లు మట్టి నమూనాలు, సాగు నీరు, పంట దిగుబడిని పరీక్షిస్తారు. ఈ పరీక్షలన్నీ సాధారణ లాబొరేటరీలలో చేయించకూడదు. </span><img alt="http://www.indiatalkies.com/images/organic-farming770g.jpg" height="398" src="http://www.indiatalkies.com/images/organic-farming770g.jpg" width="400" /><br />
<span style="font-size: large;">కేంద్ర శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ (ఎన్ఎమిఎల్) అనుమతించిన కేంద్రాలలోనే చేయించాలి. ఈ పనులన్నీ రైతులు చేసుకోలేరు కనుక.. ప్రభుత్వానికి-రైతుకు మధ్య పనిచేసేందుకు రెండు సంస్థల్ని నియమించారు. మొదటి ఏడాది పరీక్షల తర్వాత కన్వర్షన్ పీరియడ్ అంటారు. మూడో ఏడాది వరకు రైతులు ఎలాంటి రసాయనాలు వాడలేదని నిర్ధారణ కావాలి. ఇలా సేకరించిన వివరాలను 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్' (ఎన్పిఒపి)కు పంపించాలి. అప్పుడు సేంద్రీయ రైతుకు 'ఆర్గానిక్ ఫార్మర్'గా సర్టిఫికెట్ వస్తుంది. ఇలా సర్టిఫికెట్లు పొందిన రైతుల వద్దే ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్పత్తులను కొంటాయి. ఏది ఆర్గానిక్ ఉత్పత్తో, ఏది సాధారణ ఉత్పత్తో కొనుగోలుదారులు సులువుగా గుర్తుపట్టేందుకు ఎన్పిఒపి ఒక లోగోను తయారుచేసింది. ఆర్గానిక్ మార్కెటింగ్ సంస్థలు ఆ లోగోతోనే ఆహార ఉత్పత్తులను విక్రయించాలి.<br />
<br />
<b>మందుల సేద్యం..</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun26.jpg" /></span> <span style="font-size: large;"> కృత్రిమ ఎరువులతో, క్రిమిసంహారక మందులతో ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి మనందరికీ తెలుసు. ఒక రైతు పొలానికి మూడుసార్లు మందు కొడితే ఎకరాకు ముప్పై బస్తాల ధాన్యం పండిందని.. పక్క పొలం రైతు అదే మందు డోసు పెంచి, నాలుగుసార్లు కొడతాడు. ఈయనకు నలభై బస్తాలు పండొచ్చు. కాని నేలతల్లి ఏం కావాలి? తిండి పెట్టే తల్లికి మనం తిరిగి ఏమిస్తున్నాం..? జీర్ణం కాని ఎరువుల్ని తినిపిస్తున్నాం. శరీరాన్ని గుల్ల చేసే పురుగుమందులను తాగిస్తున్నాం. ప్రకృతి నేర్పిన సహజ సేద్యాన్ని వదులుకుని, పాడి పశువులతో కళకళలాడే పల్లెల్ని మరిచిపోయాం.</span><img alt="http://makanaka.files.wordpress.com/2010/07/infochange_agenda_issue19_2010jul_cover.jpg" height="400" src="http://makanaka.files.wordpress.com/2010/07/infochange_agenda_issue19_2010jul_cover.jpg" width="308" /><br />
<span style="font-size: large;"> కారణాలు ఏమైనప్పటికీ, రైతులు ఇప్పుడు భూములను నమ్ముకోవడం లేదు. పురుగుమందుల్ని నమ్ముకుంటున్నారు. దానితో భూమి స్వభావం మారిపోయింది. విషాన్ని దిగమింగుతున్న పొలాలు విషతుల్యమైన ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకున్నాయి. ఫలితంగా నయంకాని జబ్బులొస్తున్నాయి. రోగనిరోధక శక్తి పడిపోతోంది. పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. జన్యుపరమైన సమస్యలొస్తున్నాయి. వాతావరణం కలుషితమైపోతోంది. విశ్వం ఉనికికే చేటు తెస్తున్న గ్లోబల్ వార్మింగ్ పెద్ద భూతమై కూర్చుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ పట్టిపీడిస్తున్న సమస్య- యుగాంతం కాదు, యుద్ధభయం కాదు. భూకంపాలో, తుపాన్లో కాదు.. స్లో పాయిజన్లా మనిషిని సర్వనాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయం..!<br />
<br />
పూర్వం తొలకరి పడగానే రైతులు పొలాలకు పరిగెత్తేవారు. పేడ ఎరువును పొలాల్లో వేసేవారు. నాగలితో దుక్కి చేసినప్పుడు ఆ ఎరువు అటూ ఇటూ పొర్లుతుంది. భూమి లోపలి కొత్త మట్టి పైకొచ్చి పంటకు బలాన్నిచ్చేది. ఇప్పుడు తొలకరి పడగానే రైతులు పొలాలకు వెళ్లడం లేదు. రసాయన ఎరువుల కోసం పరిగెత్తుతున్నారు. దొరుకుతాయో దొరకవో అన్న ఆత్రంతో పురుగుమందుల్ని ముందే కొని బంగారంలా దాచుకుంటున్నారు. ట్రాక్టర్లతో అటొక్కసారి ఇటొక్కసారి గీతలుపెట్టి విత్తనాలు చల్లేస్తున్నారు. ఒకసారి కలుపుతీస్తే రెండుసార్లు మందు కొడుతున్నారు. పంట ఇంటికొచ్చేలోపు ఎన్నిసార్లు మందులు కొడుతున్నారో లెక్కేలేదు. రసాయనాలతో సేద్యం చేస్తే భూమి పాడైపోతుందని, ఆ తిండి తినే మనుషులకు జబ్బులు చేస్తాయని రైతులకు తెలియని విషయాలు కావు. ప్రభుత్వానికి తెలియని విషయాలూ కావు. అయినా మందులు వేస్తే తప్ప పంటలు పండించడం సాధ్యం కాదన్న ప్రమాదకర స్థాయికి చేరింది మన వ్యవసాయం.<br />
<br />
<b>సేంద్రీయ మార్గదర్శకులు..</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun27.jpg" /></span> <span style="font-size: large;"> దీన్ని మార్చడానికి కొద్దిమందే అయినా గట్టి ప్రయత్నం చేసినవాళ్లు కొందరు ఉన్నారు<br />
. వారిలో ప్రముఖుడు జపాన్కు చెందిన మసనోబు పుకువోకా. ప్రపంచమంతా రసాయన వ్యవసాయంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని మరిచిపోయినప్పుడు, ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీల సంఖ్యను రెట్టింపు చేసే పనిలో పడినప్పుడు, వాటిమీద ఆధారపడితేనే సిరులు పండుతాయని రైతులను మభ్యపెడుతున్నప్పుడు.. ఇదెంత ప్రమాదకరమో ఆలోచించినవాడు మసనోబు పుకువోకా. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి, పల్లెకు తిరిగొచ్చినప్పుడు "పెద్ద చదువులు చదివినోడివి, రాళ్లురప్పలున్న ఈ పల్లెల్లో ఏం చేస్తావ్?''అన్నారు గ్రామస్థులు. అవేమీ పట్టించుకోకుండా మౌనంగా పొలానికెళ్లిపోయారు. 65 ఏళ్లు కిందా మీదా పడ్డాడు. బోలెడన్ని ప్రయోగాలు చేశాడు. సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు పండించాడు. <br />
<br />
ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోయారంతా..! అదెలా సాధ్యమో చెప్పేందుకుకే ఆఫ్రికా, ఇండియా, యూరప్, అమెరికా దేశాలన్నీ తిరిగాడు. మందులతో పంటలు పండిస్తే.. రేపటితరాలు అనుభవించాల్సిన బాధలు అన్నీఇన్నీ కావన్నాడాయన. పుకువోకా లేవనెత్తిన సందేహాలు ఆధునిక వ్యవసాయ పద్ధ్దతుల్ని పునరాలోచనలో పడేశాయి. ఆయన రాసిన 'వన్ స్ట్రా రెవల్యూషన్' సంచలనం రేపింది. 'గడ్డిపరకతో విప్లవం' పేరుతో తెలుగులోనూ వచ్చిందది. రసాయన సేద్యం పరుగు పందేన్ని నిలదీసిన తొలి పుస్తకం అది.</span><img alt="http://www.savesanghavi.com/images/save.jpg" height="400" src="http://www.savesanghavi.com/images/save.jpg" width="375" /><br />
<span style="font-size: large;"> గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులో 'దెహ్రి' గ్రామానికి చెందిన రైతు భాస్కర్సావే. ఇప్పుడాయనకు తొంభై ఏళ్లు. తనకున్న 14 ఎకరాలకు 'కల్పవృక్ష' అనే పేరు పెట్టాడు. "నా పొలమే నా విశ్వవిద్యాలయం''అంటాడు ఈ పెద్దమనిషి. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను లాక్కురావాలని పూనుకున్నాడీయన. </span></div><div class="RunningText"><img alt="http://www.otherindiabookstore.com/coverpics/The%20great%20agricultural%20challenge.jpg" height="400" src="http://www.otherindiabookstore.com/coverpics/The%20great%20agricultural%20challenge.jpg" width="257" /><span style="font-size: large;"> </span></div><div class="RunningText"><span style="font-size: large;">హరితవిప్లవ సృష్టికర్త ఎం.ఎస్.స్వామినాథన్తో కూడా ఆ విషయాలను చర్చించేవాడు. ఆ ఉత్తరాలన్నీ కలిపి 'ద గ్రేట్ అగ్రికల్చర్ ఛాలెంజ్' అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చాడు. విదేశీయుడైన భరత్మిత్రా ఓసారి ఢిల్లీకి వచ్చాడు. అక్కడున్న స్టార్హోటళ్లు, ఫ్లైఓవర్లు, హై రైజ్ బిల్డింగులు ఆయన్ని ఆకర్షించలేదు. క్యాన్సర్ ఆస్పత్రులు ఆకర్షించాయి. "అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించిన పురుగుమందులన్నీ ఇండియాకు వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోంది'' అని బాధపడ్డాడు భరత్. భారత్లో ఉండిపోయి లక్నోలో 'తులసి'తోటను పెంచాడు. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగే. </span></div><div class="RunningText"><img alt="http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010043050130401_330733e.jpg" height="298" src="http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010043050130401_330733e.jpg" width="400" /><span style="font-size: large;"> </span></div><div class="RunningText"><span style="font-size: large;">తులసి ఆకులను ప్రాసెస్ చేసి.. తేనీరు, ఆయుర్వేద ఔషధాలను తయారుచేశాడాయన. దేశవ్యాప్తంగా ఆర్గానిక్ తులసికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇలా మొదలైన ఆర్గానిక్ ఉద్యమం ఒక వైపు వ్యాపారం, మరో వైపు చైతన్యం దిశగా విస్తరించింది. ఇంతలో కార్పొరేట్ చూపూ దాని మీద పడింది. </span></div><div class="RunningText"><img alt="http://www.imagesfood.com/Images/newsimage/24_letter_mantra.jpg" height="346" src="http://www.imagesfood.com/Images/newsimage/24_letter_mantra.jpg" width="400" /><span style="font-size: large;"> </span></div><div class="RunningText"><span style="font-size: large;">పదివేల మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్తో మార్కెట్లోకి వచ్చింది '24 లెటర్ మంత్ర'. ఇప్పుడది పదకొండు రాష్ట్రాల్లో సేంద్రీయ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. </span></div><div class="RunningText"><img alt="http://www.sresta.com/inside/images/image002.jpg" height="297" src="http://www.sresta.com/inside/images/image002.jpg" width="400" /><span style="font-size: large;"> </span></div><div class="RunningText"><span style="font-size: large;">మన రాష్ట్రంలో 'శ్రేష్ట' కూడా ఆర్గానిక్ వ్యాపారం చేస్తున్నది.</span><img alt="http://www.rarindia.org/images/1farming.jpg" height="400" src="http://www.rarindia.org/images/1farming.jpg" width="363" /><br />
<span style="font-size: large;"><b>సేద్యానికి 'గుర్తింపు'..</b></span> <span style="font-size: large;"><br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun28.jpg" /></span> <span style="font-size: large;"> ప్రస్తుతం మన రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతులున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు సేద్యంలో కొత్త అనుభవం పొందుతున్నారు. "ఒక ఆవు రెండు లీటర్లే పాలిస్తుందనుకోండి. అత్యాశకు పోయి నాలుగు లీటర్లు కావాలనుకుంటే పాలకు బదులు రక్తమొస్తుంది. భూమి కూడా అంతే. ఎంత పంటనివ్వాలో అంతే ఇస్తుంది. బలవంతంగా పిండుకోవాలని చూస్తే ఏదో ఒక రోజు అసలు పండే స్వభావాన్నే కోల్పోతుంది..'' అంటాడు ప.గోదావరి జిల్లా నాచుగుంటకు చెందిన 'సర్టిఫైడ్' రైతు భూపతిరాజు రామకృష్ణరాజు. <br />
<br />
అయిదేళ్ల నుంచి సేంద్రీయ సాగు చేస్తున్న రాజు.. 'స్వర్ణ', 'పిఎల్1100', 'సాంబమసూరి' రకం ధాన్యాలను పండిస్తున్నాడు. మామూలు సాగులో ఎకరానికి 30 నుంచి 35 బస్తాలొస్తాయి.సేంద్రీయసాగులో 29 బస్తాలొస్తున్నాయి. ఆ లోటు పూడ్చుకునేందుకు.. మార్కెట్రేటు కంటే కాస్త ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు చెప్పారు. "ఒక్కసారి నా బియ్యాన్ని వండుకు తిన్నవారు జీవితంలో మానెయ్యలేరు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నాకిప్పుడు 40 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. నూర్పిళ్లు అవుతూనే ఫోన్లు చేస్తారు...'' అంటూ గర్వంగా చెబుతారు రాజు.<br />
<br />
ఆర్గానిక్ బియ్యానికే కాదు. సేంద్రీయ అల్లానికి కూడా చాలా గిరాకీ ఉంది. మెదక్ జిల్లా పీచార్యగుడికి చెందిన శ్యామ్సన్కు నాలుగెకరాల ఎర్రమాగాణి ఉంది. చేనులోనే ముప్పై గజాల లోతు బావి తవ్వాడు. అరకొర నీళ్లతోనే సేంద్రీయ సేద్యం మొదలుపెట్టాడు. "నేనిప్పుడు కేరళ మారన్ వెరైటీ అల్లం వేశాను. ఎకరాకు 40 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వసాయంతో పొలంలోనే వర్మీ కంపోస్టు షెడ్డు కట్టాను. సేంద్రీయ ఎరువుల్ని మేమే తయారు చేసుకుంటాం. మందులు పోసి పంట పండిస్తే మంచిగ పైసలొస్తయి కాని, తినే వాళ్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా''అంటాడు శ్యామ్సన్. ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఈయనొక్కడే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్. అనంతపురం జిల్లాలో రైతు ల ఆత్మహత్యలకు కరువొక్కటే కారణం కాదు. <br />
<br />
అందరి ఇళ్లలో పురుగుమందుల డబ్బాలుండం కూడా ఒక కారణమే..! నీళ్లు లేకపోయినా ఒట్టి మందులు చల్లి వేరుసెనగను పండిస్తారు ఈ జిల్లా రైతులు. ఎలక్ట్రానిక్స్లో డిప్లమో చేసిన ప్రహ్లాదరెడ్డికి ఈ బాధలన్నీ తెలుసు. అయినా సరే, మందు కొట్టకుండా వేరుసెనగ పండించి తీరాలనుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి దగ్గర్లోని బొందలదిన్నె అతని సొంతూరు. ఉద్యోగం వద్దనుకుని సేద్యంలోకి దిగాడు. తన అయిదు ఎకరాల పొలం పక్కనే ఉన్న పెన్నానదిలో బోరు వేశాడు. నాలుగించులు నీళ్లు పడ్డాయి. "మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి పనిచేస్తాం. సేంద్రీయ ఎరువుల కోసం పది గేదెలు, ఎద్దుల్ని మేపుతున్నాం. ఆర్గానిక్ అగ్రికల్చర్ కోసం 'సహజకృష్ణ రైతు సంఘం' ఏర్పాటు చేశాం. రసాయనాల జోలికే వెళ్లం. వరి, వేరుసెనగ, కంది పంటలు వేస్తాం. ఈ మధ్యనే మా పంటల్ని కొనేందుకు ఓ ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ సంప్రదించింది. ఇది సేంద్రీయ సేద్యం వల్లనే సాధ్యమైంది..''అంటున్నాడు ప్రహ్లాదరెడ్డి.<br />
<br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun29.jpg" /></span> <span style="font-size: large;"> వేపాకు ఉడకబెట్టి రసం తీసి.. పంటకు చల్లే తిమ్మయ్యను చూస్తే తోటి రైతులకు నవ్వొస్తుంది. "ఇంత పవరున్న మందులు చల్లుతుంటేనే పురుగు చావటం లేదు. నీ వేపాకు రసానికి చచ్చిపోతుందా?'' అని వెక్కిరిస్తారు. చిత్తూరు జిల్లా పచ్చారోళ్లపల్లికి చెందిన తిమ్మయ్య ఇప్పుడు సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతు. మూడేళ్లు కష్టపడితే కాని ఈ సర్టిఫికెట్టు రాలేదు. మూడెకరాల్లో వేరుసెనగ, ఎకరంలో చెరకు వేశాడు. సేంద్రీయంతోనే రుచికరమైన కందిపప్పు పండించి.. కిలో రూ.75కు అమ్ముతున్నాడు. ఇదే కందిపప్పు బయట మార్కెట్లో రూ.200 పెడితే కాని దొరకదు. కొండప్రాంతాల్లో వ్యవసాయం చేయడమంటే చాలా కష్టం. వచ్చే దిగుబడీ తక్కువ. అయినా సరే అత్యాశకు పోలేదు సుక్రు గైరమ్మ. విజయనగరం జిల్లా అడ్డతీగ గిరిజన గూడేనికి చెందిన ఈ మహిళా రైతు సేంద్రీయ సేద్యాన్ని ఇష్టపడింది. వరి, రాగులు, జొన్న, సామలు, కొర్రలు పండిస్తోంది. <br />
<br />
<img align="left" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun30.jpg" /></span> <span style="font-size: large;"> పంట ఉత్పత్తులను విజయనగరం తీసుకురావాలంటే పడవలో గోస్తనీ నదిని దాటాలి. "సేంద్రీయ సేద్యంలో రైతు కు ఖర్చు తక్కువ. సమాజానికి లాభం ఎక్కువ. నేను చేస్తున్నది మంచి పనేగా'' అంటుందామె. చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రంలోనూ సేంద్రీయ పంటల్ని పండిస్తున్నారు. పాతిక ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయాల్ని పండిస్తున్నారు. సేంద్రీయ రైతుల్ని ప్రభుత్వమే కాదు, స్వచ్ఛందసంస్థలూ ప్రోత్సాహిస్తున్నాయి. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, టింబక్టూ ఆర్గానిక్, ఆర్డీటీ, వికాస, చేతన, ఉర్వి.. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్న సంస్థలు. సాధారణ సేద్యంతో పోల్చితే, సేంద్రీయ సేద్యం పరిధి చాలా తక్కువే కాని భవిష్యత్తు మీద ఆశ కలిగించే సేద్యం ఇదే. <br />
<br />
<b>మధ్యవర్తిగా ప్రభుత్వం</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothi-sunday.com/2012/feb/12/images/12-2sun31.jpg" /></span> <span style="font-size: large;"> రాష్ట్రంలో ఆర్గానిక్ సేద్యం కింద వరి, రాజ్మా, కంది, తృణధాన్యాలు, కూరగాయలు సాగవుతున్నాయి. వీటిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే బయ్యర్స్-సెల్లర్స్ మీట్ పెట్టాం. ఇక్కడికి 20 కంపెనీలొచ్చాయి. సేంద్రీయ రైతుల వివరాలను తీసుకున్నాయవి. మొన్న హైదరాబాద్లో జరిగిన హార్టీకల్చర్ ఎక్స్పోలో కూడా స్టాల్స్ పెట్టుకునేందుకు రైతులకు అవకాశం ఇచ్చాం. వాళ్లు ఇక్కడికి రావడానికి రవాణా, ఫుడ్ప్యాకింగ్ సదుపాయాలను కల్పించాం. సాధారణంగా ఆర్గానిక్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలంటే ఒక్కో రైతుకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికి అయిదు లక్షలు చెల్లించాం.</span></div><div class="RunningText"><img alt="http://www.aggarwaloverseas.com/BookImages/DetailPageImages/66484.jpg" height="400" src="http://www.aggarwaloverseas.com/BookImages/DetailPageImages/66484.jpg" width="261" /><br />
<span style="font-size: large;"><br />
<b>- మద్దిలేటి, అసిస్టెంట్ డైరెక్టర్,<br />
సేంద్రీయ విభాగం, వ్యవసాయశాఖ </b></span> </div></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-22638164773497712442012-01-15T05:54:00.000-08:002012-01-15T05:54:00.427-08:00ప్రకృతి వ్యవసాయం * పొలం ఆయన మాట వింటుంది!<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"><tbody>
<tr><td style="width: 606px;"><div class="redNote" id="div_Desc"><span style="font-size: large;"> </span><img alt="http://www.thehindu.com/multimedia/dynamic/00176/05tvtnk02_ZeroBudge_176270e.jpg" src="http://www.thehindu.com/multimedia/dynamic/00176/05tvtnk02_ZeroBudge_176270e.jpg" /></div><div class="redNote" id="div_Desc"><span style="font-size: large;">భారతదేశం సుసంపన్న వ్యవసాయ దేశం. ఇది మనమందరం గర్వపడే విషయం! రసాయనిక ఎరువుల వాడకంలోనూ అగ్రగామి మనదేశం. ఇది మనమందరం బాధపడాల్సిన విషయం! ఇంతకు ముందుతరాలలో వేల సంవత్సరాలపాటు అవసరం లేని మందుల వాడకం ఇప్పుడు ఎందుకు ఇంతగా పెరిగింది? పురుగుమందులు వాడకుండా వ్యవసాయం చేయలేమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటిని రుజువు చేసిన ఓ రైతు గాథ ఇది.<br />
<br />
సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలోని కరవు ప్రాంతం విదర్భకు చెందినవాడు. దాంతో సహజంగానే వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గరగా చూశాడు. అందుకే తన విద్యను, అధ్యయనాన్ని వ్యవసాయం మీదనే కొనసాగించాడు. ఫలితంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. కొంతకాలానికి సొంతపొలంలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు. అలా సుమారు పదేళ్లపాటు అంటే 1972 నుంచి 82 వరకు మంచి దిగుబడితో పంటలు పండించాడు. ఎందుకో ఆ తర్వాత అంతకుముందు వచ్చినన్ని దిగుబడులు రాలేదు. దీంతో స్వయంగా పరిశోధనలలోకి దిగాడు. నిపుణులను అడిగాడు. సర్వేనివేదికలు తెప్పించుకుని చూశాడు. </span> <span style="font-size: large;"><br />
<br />
దిగుబడి పెంచుకోవడానికి అప్పటికి ఆయనకు కనిపించిన ఒకటే మార్గం మరిన్ని రసాయనిక మందులు వాడటం. ‘సరే, ఇప్పుడంటే మందులు ఎక్కువ వాడతాను, మరలా కొన్నేళ్లకు దిగుబడులు పడిపోతే ఏంటి పరిస్థితి? అపుడింకా ఎక్కువ వాడాలా? మందులవాడకాన్ని ఎంతకాలమని ఇలా పెంచుకుంటూ పోతాం...’ అన్న అంతర్మథనం ఆయనలో మొదలైంది. దీనికేదో ఒక మార్గం కనిపెట్టాల్సిందే అనుకున్నాడు. రసాయనిక ఎరువుల లాభ-నష్టాలపై మూడేళ్లపాటు పరిశోధిస్తే, దానికన్నా ఆర్గానిక్ వ్యవసాయమే మెరుగ్గా అనిపించింది. ముందుగా భూసారంపై పరిశోధనలు చేశారు. </span> <span style="font-size: large;"><br />
<br />
సేంద్రియ ఎరువుల వల్ల నేల కలుషితం కాదు, పంటల్లో రసాయనాలు ఉండవు, అంతవరకు బాగానే ఉంది కానీ అది చాలా క్లిష్టమైన పద్ధతి. ఒక రకంగా ఖరీదైనదే. ఎక్కువ శ్రమతో కూడినదీ. అందుకే ఆదివాసీ వ్యవసాయ ప్రాంతాలకు వెళ్లాడు. వారి పద్ధతులు గమనించాడు. ప్రకృతి సృష్టించిన జీవ వైవిధ్యమే పాత్ర పంట దిగుబడుల్లో ప్రధాన పోషిస్తోంది గాని మందులు కాదు అని తెలుసుకున్నాడు.</span> <span style="font-size: large;"><br />
<br />
మొక్క కేవలం రెండు శాతం మాత్రమే భూమిలో పోషకాలను ఉపయోగిస్తుంది. మిగతా అంతా గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే గ్రహిస్తుందని గ్రహించాడు. ఆ రెండింటినీ సరైన మోతాదులో సరిగ్గా అందించగలిగితే చాలనుకున్నాడు. తన పరిశోధనల్లో భాగంగా మన ప్రాచీన గ్రంథాలను కూడా పరిశీలించాడు. </span> <span style="font-size: large;"><br />
<br />
ఆవుపేడ, గోమూత్రం ... ఈ రెండింటికీ మించిన ఎరువు లేదని ఆయనకు అర్థమైంది. దానిపై పరిశోధనలు చేశారు. చివరకు విజయం సాధించారు. కేవలం ఒక ఆవు ఎరువు 30 ఎకరాలు పండించడానికి సరిపోతుందట. పదికిలోల ఆవుపేడ, పదిలీటర్ల గోమూత్రం, రెండుకేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాడు. ఈ మందుకు ఆయన పెట్టిన పేరు ‘జీవ మూత్ర’. దాన్నే పొలంలో వాడారు. దాంతో అత్యధిక దిగుబడులు సాధించారు.</span> <span style="font-size: large;"><br />
</span><img alt="http://palekarzerobudgetnaturalfarming.com/example/Naral.jpg" height="225" src="http://palekarzerobudgetnaturalfarming.com/example/Naral.jpg" width="400" /><br />
<span style="font-size: large;"> ఒక్క బెల్లం తప్ప బయటనుంచి కొనేదేమీ లేది ఇందులో. పురుగు మందులు అతిగా వాడి పాడైన పొలాలను జీవ మూత్ర మందు మళ్లీ యథాతథ స్థితికి తేగలదు. ఎందుకంటే ప్రతి గ్రాము ఆవు పేడలో 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులుంటాయిట. ఇవి మట్టిని సారవంతం చేస్తాయి. అయితే, విదేశాల నుంది దిగుమతి చేసుకున్న జెర్సీ, ముర్రా జాతి ఆవుల పేడ ఇందుకు పనికిరాదట!</span> <span style="font-size: large;"><br />
</span><img alt="http://www.hindu.com/2006/07/30/images/2006073003830201.jpg" height="228" src="http://www.hindu.com/2006/07/30/images/2006073003830201.jpg" width="400" /><br />
<span style="font-size: large;"> తన పరిశోధన ఫలాలు అందరికీ అందించడం కోసం రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాడు పాలేకర్. సుమారు ఇప్పటివరకు 2000 శిబిరాల కంటే ఎక్కువే నిర్వహించాడు. అరవైలలోనూ అలసి పోకుండా తన పయనం కొనసాగిస్తున్నారు. పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం (జీరో బడ్జెట్ ఫర్ నేచురల్ ఫామింగ్) ప్రధానాంశంగా పలు పుస్తకాలు రాశారు. </span> <span style="font-size: large;"><br />
</span><img alt="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh81KPVCfP-cnJz0bVjBMrVo3lm2F5kcel1e-6fOhrHOW-ibP2XZzvzZzOk3dU95GuTaKPcKYD6zT2tgwWSIm1yMVHG0h9xT31UI7iXCjR9kGEMy7C-h2Ap4NBs0FDchFL0PdhwbqWm7S-2/s400/subhash+palekar.jpg" height="335" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh81KPVCfP-cnJz0bVjBMrVo3lm2F5kcel1e-6fOhrHOW-ibP2XZzvzZzOk3dU95GuTaKPcKYD6zT2tgwWSIm1yMVHG0h9xT31UI7iXCjR9kGEMy7C-h2Ap4NBs0FDchFL0PdhwbqWm7S-2/s400/subhash+palekar.jpg" width="400" /><br />
<span style="font-size: large;"> తన పరిశోధన ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వాటిపై రూపాయి కూడా లాభం వేసుకోకుండా ఉత్పాదక వ్యయానికే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, వ్యవసాయంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలిచ్చేందుకు ఇంటర్నెట్ ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. </span> <span style="font-size: large;"><br />
<br />
<b style="color: #38761d;">కుటుంబమంతా భూమిపుత్రులే!</b></span> <span style="font-size: large;"><br />
</span><img alt="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj370yRBEUXKwzcX-Rvq7_y-UExVgdX0C2TX7FMKYKKww6hXqRlWFvBkH5GN00EZKVwOlJyrG7zyYcpCYcotEm2lYVWpST3Uv8uxwIsrhXtJdgBtJWVG267xsLZZ1ILuMxVnsp4d0ltOX0/s1600/324860_10150370703974792_570449791_7727977_263460087_o.jpg" height="300" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj370yRBEUXKwzcX-Rvq7_y-UExVgdX0C2TX7FMKYKKww6hXqRlWFvBkH5GN00EZKVwOlJyrG7zyYcpCYcotEm2lYVWpST3Uv8uxwIsrhXtJdgBtJWVG267xsLZZ1ILuMxVnsp4d0ltOX0/s400/324860_10150370703974792_570449791_7727977_263460087_o.jpg" width="400" /><br />
<span style="font-size: large;"> సుభాష్ పాలేకర్ మాత్రమే ఆ కుటుంబంలో అందరూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. సుభాష్ వారసుడు అమోల్ కూడా తండ్రి మార్గంలో నడిచారు. ఇందుకోసం ఆయన తన ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తండ్రి, అన్నల బాటలో అమిత్ తన అడుగులు వేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ కటుంబం మొత్తంతో భూమిపుత్రులుగా మారి, రసాయనిక వ్యవసాయంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. సుభాష్ కోడళ్లు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు చేసే ఫోన్ కాల్స్కు సమాధానాలిస్తూ వీరితో పాటు ప్రకృతి వ్యవసాయంలో తమ పాత్ర పోషిస్తున్నారు. </span> <span style="font-size: large;"><br />
</span><img alt="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicVuIN1rjWhVeHoR1ZUpmlUD5gPLMkfI-agULnpSFHRkzJTv390JKMKPNlxSH4zSPGy2fyFMxkI8O_iAOajxQSZ5q4ONICRFp-0Fkt1FMbh33KwzknrykyjCwJvsmEMpfLM7JUyG-HIh0/s1600/321938_10150370734129792_570449791_7728088_671835323_o.jpg" height="480" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicVuIN1rjWhVeHoR1ZUpmlUD5gPLMkfI-agULnpSFHRkzJTv390JKMKPNlxSH4zSPGy2fyFMxkI8O_iAOajxQSZ5q4ONICRFp-0Fkt1FMbh33KwzknrykyjCwJvsmEMpfLM7JUyG-HIh0/s640/321938_10150370734129792_570449791_7728088_671835323_o.jpg" width="640" /><br />
<span style="font-size: large;"> మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే సుభాష్ పాలేకర్ అనుసరించే వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే </span></div><div class="redNote" id="div_Desc"><span style="font-size: large;">www.palekarzerobudgetnaturalfarming.com ను సంప్రదించవచ్చు. అందులో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పంటల పండగ సంక్రాంతి రోజున సుభాష్కు సలాం!</span> <span style="font-size: large;"><br />
</span><img alt="http://palekarzerobudgetnaturalfarming.com/scan_image/Dung_collection.jpg" height="298" src="http://palekarzerobudgetnaturalfarming.com/scan_image/Dung_collection.jpg" width="400" /><img alt="http://palekarzerobudgetnaturalfarming.com/scan_image/spray.jpg" src="http://palekarzerobudgetnaturalfarming.com/scan_image/spray.jpg" /><br />
<span style="font-size: large;"> ‘‘కేవలం ఒక ఆవు పేడ 30 ఎకరాలు పండించడానికి సరిపోతుంది. పది కిలోల ఆవు పేడ, పది లీటర్ల గోమూత్రం, రెండు కేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాను. దాన్నే పొలంలో వాడాను. దాంతో అత్యధిక దిగుబడులు సాధించాను. మందులు అతిగా వాడి పాడైన పొలాలను ఈ జీవ మూత్ర మందు మళ్లీ యథాస్థితికి తేగలదు.’’</span> <span style="font-size: large;"><br />
<span style="color: blue; font-size: small;">- ప్రకాష్ చిమ్మల</span></span></div></td> </tr>
<tr> <td height="10"> <span style="font-size: large;"><br />
</span></td> </tr>
<tr> <td style="width: 606px;"> <table border="0" cellpadding="0" cellspacing="0"><tbody>
<tr> <td style="width: 300px;"> <div id="google_ads_div_300x250_ad_container"> <span style="font-size: large;"><ins style="border: 0pt none; display: inline-table; height: 250px; position: relative; width: 300px;"><ins style="border: 0pt none; display: block; height: 250px; position: relative; width: 300px;"></ins></ins></span></div><span style="font-size: large;"><br />
</span></td> <td style="width: 6px;"><span style="font-size: large;"> </span></td> </tr>
</tbody></table></td></tr>
</tbody></table></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-25757410695642903282011-12-05T23:53:00.000-08:002011-12-05T23:53:37.069-08:00గ్రీన్ వండర్ రెడ్డి<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div class="headline"><h1></h1></div><div id="page1"><div class="RunningText"> <img align="left" height="400" src="http://www.andhrajyothy.com/i/2011/dec/6nav1.jpg" width="338" /> <b> </b></div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><br />
</div><div class="RunningText"><span style="font-size: large;"><b>ఎడారిని తలపించే ఇసుక దిబ్బల్లో 76 ఏళ్ల వరదారెడ్డి తీర్చిదిద్దిన పచ్చని అద్భుతాన్ని మీకు చూపించా లంటే కెమెరాలు పనికిరావు. గూగుల్ ఎర్త్లోనే చూడాలి. నెల్లూరు జిల్లాలో బకింగ్హామ్ కాలువకీ సముద్రానికీ మధ్యలో ఉండే సిద్ధవరం కుగ్రామంలో 1934లో పుట్టిన దువ్వూరి వరదారెడ్డి ఒక వనసృష్టికర్త. ఐదు కిలోమీటర్ల దారి పొడవునా పరచుకున్నఆ గ్రీన్హెవెన్కు ఇప్పుడు కోస్టర్ కారిడార్ సెజ్ సునామీ పొంచి ఉంది.</b><br />
<br />
వరదారెడ్డి పుట్టిన సిద్ధవరం గ్రామమంతా ఇసుక తిన్నెలమయం. మహా అంటే మూడొందల గడపలుంటాయి ఆ ఊళ్లో. ఊరికి మూడు పక్కలా 15 కిలోమీటర్ల వరకు ఇసుక మేటలుండి ఎడారిలా కనిపిస్తుంది. పదకొండోతరగతి వరకూ చదివిన వరదారెడ్డి నలభయ్యో యేట తన తల్లికి జబ్బు చేసినపుడు మద్రాస్లోని రాయపేట ఆస్పత్రిలో ఆమెను చేర్పించాడు.ఆ సమయంలో రోజూ సమీపంలోని ఎగ్మూర్ లైబ్రరీకి వెళుతూ యాదృచ్ఛికంగా వృక్షశాస్త్ర పుస్తకాలు చదివాడు.<br />
<br />
వాటిని చదువుతున్నంత సేపూ తన ఊరే వరదారెడ్డి కళ్లలో మెదిలేది. మద్రాసు నుంచి ఊరికి తిరిగొచ్చిన తర్వాత చుట్ట పక్కల ఊళ్లలో తెలిసిన వాళ్లను అడిగి జీడిమామిడి, వేప, కానుగ, సుబాబుల్, మర్రి వంటి మొక్కల్ని తెప్పించి వర్షాకాలం మొదలయ్యే ముందు ఇసుక నేలలో గుంటలు తవ్వి ప్రత్యేకంగా తాను తయారు చేసిన పేడ ఎరువుపోసి వాటిని నాటేవాడు. అలా నిర్విరామంగా వేలాది మొక్కలు నాటాడు. ఇప్పటికీ నాటుతూనే ఉంటాడు. మరణించే దాకా నాటుతూనే ఉంటానంటాడు. ప్రతీదాన్ని లెక్కించి చేసే వలసవాద బుర్రతో ఇప్పటిదాకా ఎన్ని మొక్కలు నాటి ఉంటారనే ప్రశ్న వేస్తే నవ్వి ఊరుకుంటాడు.<br />
<br />
****<br />
<br />
అలా... బ్రహ్మజెముళ్ల ఎడారిని పచ్చని చెట్ల బృందావనంలా మార్చిన 76 ఏళ్ల వరదారెడ్డిని కదిలిస్తే చిన్నపిల్లాడిలా చెట్ల గురించి కథలు కథలుగా చెబుతాడు. ఇసుక నేలల్లో తక్కువ నీటితో అతి తక్కువ ఎరువుతో చెట్లనెలా సాకాలో విపులంగా చెబుతాడు. ఏ రకం మొక్క పక్కన ఏ రకం మొక్కనాటాలో, నారు పోయడమెలానో రకరకాల మెలకువల్ని నిర్విరామంగా చెబుతూ 'చెట్టూ పసిబిడ్డా వొకటే గదబ్బయ్యా!!' అంటూ వున్నట్టుండి మౌనం వహిస్తాడు.<br />
<br />
****<br />
<br />
సిద్ధవరం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో 'కనుపూరు' అనే ఊరుంది. ఇసుక దిబ్బల మధ్య ఈ రెండు ఊర్లకు దారి ఉంది. యానాదులు, రైతులు, అందరూ ఈ దారిలో రోజూ నడుస్తుంటారు. ఎండాకాలం అయితే కాళ్లు బొబ్బలెక్కాల్సిందే. ఏటా జరిగే కనుపూరు ముత్యాలమ్మ జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలమంది వస్తారు. నాలుగు కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దారికి రెండు వైపులా చెట్లు నాటాడు వరదారెడ్డి.<br />
<br />
ఆరేళ్ల క్రితం వేకువజామున మూడు గంటలకే నిద్రలేచి ఎనిమిది గంటల వరకూ గుంటలు తవ్వి ఎరువుపోసి రెండు సంవత్సరాల పాటు రెక్కల కష్టం చేసి ఇసుక పర్రల్లో ఆకుపచ్చని వనాన్ని సాధ్యం చేసి చూపాడు. మొదట్లో వరదారెడ్డి చేసే ఈ పని చూసి కొందరు 'రెడ్డి భూమంతా ఆక్రమించేదానికి ప్లానేశాడ్రా' అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్లు మిగతా వాళ్లు కూడా ఆ చెట్ల చల్లటి నీడ అంచున అలవోగ్గా నాలుగు కిలో మీటర్లు నడిచివెళ్తున్నారు. వరదారెడ్డి బహు పుణ్యాత్ముడయ్యా అని మెచ్చుకుంటూ...<br />
<br />
****<br />
<br />
సిద్ధవరం సమీపంలో ఏడువందల నేరేడు చెట్లను కూడా వరదారెడ్డి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. ఈ నేరేడు వనంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక దశలో అంతరించిపోతున్నందుకు ఈ పురాతన పూర్వకాల వనాన్ని తన శ్రమతో ఇప్పటికీ అస్తిత్వంలో ఉంచాడు వరదారెడ్డి.<br />
<br />
****<br />
<br />
వరదారెడ్డిని చూసి జనాలు కూడా చెట్లు నాటడం ప్రారంభించారు. వీరి కోసం జీడిమామిడి, నేరేడు, వేప మొక్కలను నారుపోసి ఆ మొక్కల్ని ఉచితంగా పంచుతున్నాడు. ఇంకా చుట్టుపక్కల నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి తను నాటడమే కాకుండా, అడిగిన వారికీ, అడగని వారికీ, ఇంటింటికీ ఉచితంగా పంచుతాడు. తను నాటిన చెట్లను ఎవరైనా పేదలు వంట చెరకు కోసం నరికినా నొచ్చుకోకుండా అక్కడ మరో చెట్టును నాటుతాడు. వ్యక్తి శ్రమ సమిష్టి శ్రమగా సందపదగా మార్చడమెలాగో వరదారెడ్డి చేసి చూపించాడు . గత 36 సంవత్సరాలుగా ఇసుకలో నాటిన చెట్లను సరంక్షించడానికి వరదారెడ్డి కనీసం 70 టన్నుల పేడను వినియోగించి ఉంటాడు. ఎడారిలాలాంటి ఇసుక తిన్నెల మధ్య సహజంగా పెరిగే బ్రహ్మజెముడు, బొలిజ, తంగేడు వంటి చెట్లకు ఇబ్బంది లేకుండా ఈ మొక్కలు నాటుతాడు.<br />
<br />
****<br />
<br />
<b>ఇప్పటివరకు ఇంగ్లీషు మందులు వాడలేదనే వరదారెడ్డి తన చిన్న ఫిలిప్స్ రేడియో ద్వారా బయటి ప్రపంచ విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు పిల్లనగ్రోవి ఊదుతాడు. అది తనకెంతో తృప్తినిస్తుందంటాడు. మొలకో తువ్వాలు చుట్టుకొని ఆరుబయట నిలబడితే వొంటికి తగిలే దక్షిణపు గాలి మార్మిక స్పర్శే తన జీవన చోదక శక్తి అంటాడు.</b></span> <span style="font-size: large;"><br />
<br />
****<br />
<br />
<b>గ్రామదేవత అంకమ్మతల్లి వీరభక్తుడైన ఇంతటి నిర్భయుడు కూడా ఈ మధ్య కొంచెం జంకాడు -తను నాలుగు కిలోమీటర్ల మేర నాటిన చెట్లబాటను కోస్టల్ కారిడార్లో భాగంగా ప్రభుత్వం సెజ్లకిచ్చేస్తుందని తెలిసి. దాన్ని సెజ్ నుంచి మినహాయించమని జిల్లాకలెక్టర్కు ఒక అర్జీకూడా రాశాడు.</b></span> <span style="font-size: large;"><br />
<br />
****<br />
<br />
<b>యింత పని నేనొక్కడినే ఎలా చేస్తాను? ఇదంతా నా భార్య అనసూయమ్మ,అన్నదమ్ముల బిడ్డలూ, రైతులూ, స్నేహితులూ, సేవాజనులు అందరి ద్వారా ఆ సర్వేశ్వరుడే జరిపిస్తున్నాడని సర్వకర్మలనూ ఆయనకర్పిస్తాడు వరదారెడ్డి.</b></span> <span style="font-size: large;"><br />
<br />
*****<br />
<br />
<b>తన యవ్వన ప్రాయంలో అందరిలాగే వరదారెడ్డి కూడా ఉద్యోగానికో, వ్యాపారానికో, విదేశాలకో వెళ్లిపోయి ఉంటే సిద్ధవరం గతి ఏమయ్యి ఉండేదో</b></span> <span style="font-size: large;"><br />
<br />
<b>* శ్రమయేవ జయతే</b></span> <span style="font-size: large;"><br />
<br />
<b>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరు వారి దివ్యసముఖమునకు,</b></span> </div><div class="RunningText"><b> అయ్యా! </b></div><div class="RunningText">మాగ్రామ నడిబొడ్డున వెలసియున్న దివ్యమంగళమూర్తిగా ప్రసిద్ధిగొన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయము నుంచి కళల కల్పవల్లి అంకాళమ్మ దేవాలయము మీదుగా జనజాగరణ తల్లి చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామము నందు వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ దేవాలయము వరకు ఉన్న బాటలకు ఇరువైపులా ఐదు కిలోమీటర్లు మా కుటుంబము చెట్లను పెంచినాము. కాగా ఇప్పుడు ప్రభుత్వం వారు సెజ్కు కేటాయించు క్రమంలో ఆ బాటను మినహాయించి సదరు గ్రామములకు సౌకర్యము గావించగలరని కోరుచున్నాము. గమనిక: ఈ మార్గము పర్యాటక, పరిక్రమ, పర్యావరణ వరముగా ప్రసిద్ధి పొంది ఉన్నది.<br />
<b>ఇట్లు,</b></div><div class="RunningText"><b> దువ్వూరు వరదారెడ్డి.</b></div><div class="RunningText"><b> సిద్ధవరం గ్రామం, </b></div><div class="RunningText"><b>కోటమండల,</b></div><div class="RunningText"><b>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.</b></div></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-35725361997764085332011-11-22T06:30:00.000-08:002011-11-22T06:33:21.359-08:00Banana Tree<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><br />
<div><img src="http://epaper.sakshi.com/epaperimages/5112011/5112011-sh-hyd-14/D28065256.JPG" /></div><h3 class="details" id="yui_3_2_0_1_1321971422544356"><a class="" data-action="search" href="http://36ohk6dgmcd1n.yom.mail.yahoo.net/om/api/1.0/openmail.app.invoke/36ohk6dgmcd1n/8/1.0.35/in/en-IN/view.html#bn=1.0.35&.lang=en-IN&.intl=in&rtl=0&proxyhost=in.mg50.mail.yahoo.com&sig=f82ccfaeb072877a2e6fa988799550a6&vid=om_default_view_id_36ohk6dgmcd1n-message_render_1321971573295&app=36ohk6dgmcd1n&mailver=neo&crumb=7hA7wL5UXXu&cb=1321971573297" id="yui_3_2_0_1_1321971422544353" title="Click to search for messages with same subject">Banana Tree - Lalikal Village - Hosuru</a></h3><h2><a href="http://theproduceguy.wordpress.com/2010/03/09/bananas-the-super-fruit/" rel="nofollow" target="_blank">Bananas….The Super Fruit!!!</a></h2><div><br />
</div><div id="yui_3_2_0_1_1321971422544316"><div><a href="http://theproduceguy.files.wordpress.com/2010/03/banana_display4.jpg" rel="nofollow" target="_blank"><img alt="" height="225" src="http://theproduceguy.files.wordpress.com/2010/03/banana_display4.jpg?w=300&h=225" width="300" /></a><br />
<span style="font-size: large;">When storing bananas, whether you have them on the counter or hanging up, it is best to keep them bunched together than breaking them all apart. The bananas still continue to feed off the little nutrients left, where the bunch was once connected to the tree. Hopefully some of the info I give you will teach you how to get more bang for your banana buck.</span></div><div><span style="font-size: large;">Bananas are herbs. Although referred to as banana trees, they are not trees at all but a perennial herb. That’s right. Banana plants are actually giant herbaceous perennials that grow 10 to 25 feet tall or more. Because they are herbs, they do not have woody stems like trees do. Its trunk is not a true one, but many leaves tightly wrapped around a single stem which emerges at the top as the fruit-bearing flower stalk.</span></div><div><span style="font-size: large;">The fruit fingers grow in clumps known as hands, since they resemble a hand with fingers. The entire stalk, known as a bunch, takes up to a year for the fruit to ripen enough to be harvested. The original stem dies after producing fruit, but side shoots rise from the same underground corm to produce a new plant to be harvested the following year. The fruit itself is sterile, unable to produce a plant from the miniscule dark seeds within. Some banana trees continue producing up to one hundred years, although most banana plantations renew their stock every ten to twenty-five years.</span><br />
<span style="font-size: large;"><a href="http://theproduceguy.files.wordpress.com/2010/03/banana-tree-in-bloom.jpg" rel="nofollow" target="_blank"><img alt="" height="300" src="http://theproduceguy.files.wordpress.com/2010/03/banana-tree-in-bloom.jpg?w=170&h=300" width="170" /></a></span><br />
<span style="font-size: large;">Native to Southeast Asia, bananas, and their relatives the plantains, grow in the tropical regions of the world and are a staple food in parts of Africa and most of the Caribbean. The tree itself also has uses. The leaves are used as wrappers to steam foods in Latin, Caribbean, and Asian cultures. The banana flower is also edible, but if you eat the flower, you obviously won’t get any fruit. In addition, the banana is a distant cousin to ginger, turmeric and cardamom, and is botanically classified as a berry.</span></div><div><span style="font-size: large;">Some bananas such as plantains, are considered vegetables, but most are what we call fruits. Plantains are not eaten raw the way bananas are. The majority of plantains are inedible until cooked, typically boiled, and then fried or pickled. Green bananas and plantains are high in starch. As they ripen to a yellow color, the starch turns to sugar. Some bananas actually turn red in color instead of yellow when ripe.</span></div><div><span style="font-size: large;">Both bananas and plantains are low in fat and a good source of fiber, potassium, magnesium, iron, and folic acid. The pulp and peel of the ripe banana have anti-microbial properties against certain types of bacteria and some say that the inside of the peel is also good for treating mild cases of sunburn. The sugars in ripe bananas are easily assimilated by the body and provide a quick source of energy–the perfect snack for people on the go. There are over four hundred varieties of bananas with the yellow Cavendish being the most favored in America. Americans consume an <a href="http://theproduceguy.files.wordpress.com/2010/03/fruit-bananas2.jpg" rel="nofollow" target="_blank"><img alt="" height="153" src="http://theproduceguy.files.wordpress.com/2010/03/fruit-bananas2.jpg?w=300&h=153" width="300" /></a>annual average of twenty-five pounds of bananas per person. Bananas are the world’s best-selling fruit, outranking the apple and orange.</span></div><div><span style="font-size: large;">So you may be wondering, Why are there so many varieties of bananas?</span></div><div><span style="font-size: large;">The original banana has been cultivated and used since ancient times, even pre-dating the cultivation of rice. While the banana thrived in Africa, its origins are said to be of East Asia and Oceania. Antonius Musa was the personal physician to Roman Emperor Octavius Augustus, and it was he who was credited for promoting cultivation of the exotic African fruit from 63 to 14 B.C.</span></div><div><span style="font-size: large;">Portuguese sailors brought bananas to Europe from West Africa in the early fifteenth century. Its Guinean name banema, which became banana in English, was first found in print in the seventeenth century. The banana was carried by sailors to the Canary Islands and the West Indies, finally making it to North America with Spanish missionary Friar Tomas de Berlanga.</span></div><div><span style="font-size: large;">One odd fact about today’s commonly known banana is that sweet bananas are mutants. The historically famous bananas mentioned previously were not the sweet yellow banana we know today, but the red and green cooking variety, now usually referred to as plantains to distinguish them from the sweet type.</span></div><div><span style="font-size: large;">The yellow sweet banana is a mutant strain of the cooking banana, discovered in 1836 by Jamaican Jean Francois Poujot, who found one of the <a href="http://theproduceguy.files.wordpress.com/2010/03/picture-bananas.jpg" rel="nofollow" target="_blank"><img alt="" height="300" src="http://theproduceguy.files.wordpress.com/2010/03/picture-bananas.jpg?w=199&h=300" width="199" /></a>banana trees on his plantation was bearing yellow fruit rather than green or red. Upon tasting the new discovery, he found it to be sweet in its raw state, without the need for cooking. He quickly began cultivating this sweet variety.</span></div><div><span style="font-size: large;">Soon they were being imported from the Caribbean to New Orleans, Boston, and New York, and were considered such an exotic treat, they were eaten on a plate using a knife and fork. Sweet bananas were all the rage at the 1876 Philadelphia Centennial Exposition, selling for a hefty ten cents each.</span></div><div><span style="font-size: large;">One little known fact is what I refer to as the ultimate super-power of the produce world. What is that power you ask?</span></div><div><span style="font-size: large;">Bananas can help cure or prevent hangovers. The main causes of hangovers are dehydration and depletion of potassium, both direct results of alcohol consumption. Bananas are an excellent source of potassium, second only to the avocado, with over 450 mg. per one banana serving, as well as being high in magnesium, which can help relax those pounding blood vessels causing that nasty hangover headache.</span><br />
</div><div id="yui_3_2_0_1_1321971422544313"><span style="font-size: large;">Bananas also contain tryptophan, the same amino acid found in turkey that makes you sleepy, as well as high amounts of vitamin C.</span></div><div><span style="font-size: large;">So, if you’re out partying and want to avoid a hangover, drink sixteen ounces of water and eat a banana before heading for bed for a good night’s sleep.</span><br />
</div><div><span style="font-size: large;">Before I stop extolling the health benefits of bananas…one more tip: bananas are a natural antacid and will get rid of a nasty case of heartburn in most cases.</span><br />
</div><div><span style="font-size: large;">I hope you’ve learned some valuable info about the banana and enjoy this hilarious video I found as well. </span> </div></div><div></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-342619648164471572011-11-20T00:38:00.000-08:002011-11-20T00:41:15.716-08:00కృషి * ఎడారి పండ్ల తోట<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/nov/20-11sun11.jpg" /> <span style="font-size: large;"><b>'కృషితో నాస్తి దుర్భిక్షం' అని ఊరికే అనలేదు పెద్దలు. కృషి ఉంటే ఎడారి కూడా సస్యశ్యామలం అవుతుంది. ఎందుకూ పనికి రాని భూముల్లో కూడా బంగారం పండించవచ్చు. 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మండిపోయే ఎడారిలో సైతం పండ్లతోటను పెంచారు చోగలాల్ సోని. తను పడిన కష్టాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..</b></span><br />
<span style="font-size: large;"><br />
</span><br />
<span style="font-size: large;">"నా పేరు 'చోగలాల్ సోని'. రాజస్థాన్లోని థార్ ఎడారి పక్కనే ఉంటుంది మా ఊరు. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ప్రాణం. బార్మర్ అనే పట్టణంలో 1971 నుంచి 81 వరకు చిన్న క్లర్కుగా పనిచేశాను. పెద్ద జీతం వచ్చేది కాదు. అందులోనూ ముందు నుంచీ ఆర్థికంగా ఏమంత ఉన్నోళ్లం కాదు. ఉద్యోగం వదిలాక కంసాలి అవతారం ఎత్తాను. ఆడవాళ్ల ఆభరణాల్ని కళాత్మకంగా చేయడం నేర్చుకున్నాను. కొన్నేళ్లకు చుట్టుపక్కల ఊర్లలో నాకు మంచి పేరే వచ్చింది. చేతినిండా పని ఉండటంతో కొద్దోగొప్పో దాచుకోవడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే నాకు సేద్యం మీద ఆసక్తి ఏర్పడింది. అయితే, మేమున్న ప్రాంతంలో అన్నీ ఎడారి భూములే ఉంటాయి. ఇక్కడ ఇంచుమించు 54 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి ఎక్కువైనప్పుడు చెట్లు కూడా మాడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మా పల్లెల్లో వ్యవసాయం లాభసాటి కాదు. అయినాసరే, ఏదో ఒక రోజు ఇవే భూముల్లో పంటలు పండించాలనుకున్నాను.</span><br />
<span style="font-size: large;"><br />
</span><br />
<span style="font-size: large;"><b>దారి పొడవునా ఇసుకే..</b></span><br />
<span style="font-size: large;">జైసల్మీర్కు దగ్గర్లోనే రోడ్డుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో భూమి కొన్నాను. ఆ భూమి నిజానికి సారవంతమైనది కాదు. ఎటు చూసినా ఇసుకమేటలు. పొలం దగ్గరికి వెళ్లాలంటేనే ఆపసోపాలు పడాలి. దారిపొడవునా మోకాలులోతు ఇసుక ఉంటుంది. మోటర్బైక్ను తోసుకుంటూ వెళ్లాల్సిందే. 'అలాంటి భూమిని ఏం చేస్తావ్?' అన్నారంతా. అయినా నేను వాళ్ల మాటలు వినలేదు. నేను దాచుకున్న సొమ్ముకుతోడు మరికొంత అప్పులు చేసి 112 బిగాల (సుమారు 70 ఎకరాలు) భూమిని కొనుగోలు చేశాను. మాది ఎడారి ప్రాంతం కాబట్టి ఒయాసిస్సులు దగ్గరగా ఉంటేనే పంటలు పండుతాయి. మా భూమికి కొంత దూరంలో ఒయాసిస్సు ఉంది కాని మా పొలాల దాకా రావు ఆ నీళ్లు.</span><br />
<span style="font-size: large;"><br />
</span><br />
<span style="font-size: large;">ఎప్పటికైనా వర్షాలు వస్తే బోర్లు వెయ్యొచ్చన్న ధైర్యంతో పండ్ల తోట పెంచాలనుకున్నాను. నాకు ఇదివరకు వ్యవసాయం మీద అవగాహన లేదు. తోటి రైతులను చూసే నేర్చుకున్నాను. నిమ్మ, ఇండియన్ బెర్రీ, బాదం, ఉసిరి, మామిడి, సీతాఫలం, రుద్రాక్ష మొక్కలను తీసుకొచ్చి పొలంలో నాటాను. ట్యాంకుల్లో నీళ్లు తీసుకెళ్లి ఒక్కో మొక్క కు పోసి వాటిని పెంచి పెద్ద చేశాను. రోజూ మెయిన్ రోడ్డు వరకు మోటారు బైక్లో వెళ్లి.. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు బండిని తోసుకుంటూ తోటలోకి వెళ్లేవాణ్ణి. వ్యవసాయం మీద ఇష్టంతోనే ఆ కష్టాన్ని భరించాను.</span><br />
<span style="font-size: large;"><br />
</span><br />
<span style="font-size: large;"><b>రాలిన ఆకులతో..</b></span><br />
<span style="font-size: large;"><img align="left" src="http://www.andhrajyothy.com/i/2011/nov/20-11sun12.jpg" /> ట్యాంకులతో నీటిని తోలడం అంత సులువు కాదని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. అప్పుడే మా ప్రాంతానికి భయంకరమైన కరువు కూడా వచ్చింది. ఇక, చేసేది లేక బోర్లు వేయించి, బావులు తవ్వించాను. అరకొర నీళ్లతోనే తోటను సాగుచేశాను. రసాయన ఎరువులు ఎక్కువగా వాడలేదు. మేకల ఎరువునే వేశాను. రాలిన చెట్ల ఆకులతో పాదుల్ని కప్పేశాను. చెట్టు మొదళ్లు ఎండకు మాడిపోకుండా అవే కాపాడాయి. నాకు తెలిసిన చిన్న చిన్న టెక్నిక్లతోనే చెట్లను కాపాడుకుంటూ వచ్చాను. పండ్ల తోటలు బాగానే కాశాయి. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది కాని పక్షులతోనే పెద్ద సమస్య. అందుకే చెట్టు కు కాసిన ఒక్కోకాయనీ కాపాడుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయినా తినేటపుడు వాటి తియ్యదనానికి పడిన కష్టాలన్నీ మర్చిపోయాను.</span><br />
<span style="font-size: large;"><br />
</span><br />
<span style="font-size: large;"><b>ఆత్మీయతా మధురం..</b></span><br />
<span style="font-size: large;">ఎడారి పండ్ల మాధుర్యాన్ని నేనొక్కణ్ణే కాదు, తోటి దోస్తులు కూడా రుచి చూడాలి కదా..! అందుకే, సీజన్లో కాసే పండ్లను దగ్గర్లోని స్నేహితులకు, జిల్లా కలెక్టర్కు, ఎస్పీలకు బహుమతిగా పంపిస్తుంటాను. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదన్న ఎడారి భూమిని ఇప్పుడు చాలామంది కొనేందుకు ముందుకొస్తున్నారు. ఎంతలేదన్నా 20 కోట్ల వరకు విలువ పలుకుతోంది నా పొలం. కాని నేను డబ్బుకు ఆశపడి భూమిని అమ్ముకోలేను. ఈ వయసులో నాకు డబ్బు ఎందుకు..? పొద్దున, సాయంత్రం తోటకు వెళ్లి హాయిగా గడుపుతుంటే.. ఈ జీవితానికి ఇక చాలనిపిస్తుంది. </span></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-78098803658052040162011-07-20T00:39:00.000-07:002011-07-20T00:49:59.685-07:00గోల్డెన్రైస్ గోప్పేమీటీ..?<div id="page1"><div class="RunningText"> <span style="font-size: large;"><b></b></span><img alt="http://learner.org/courses/envsci/visual/img_med/rice.jpg" src="http://learner.org/courses/envsci/visual/img_med/rice.jpg" /><br />
<img alt="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" src="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" /><div class="headline" style="color: red;"><h1>గోల్డెన్రైస్ గోప్పేమీటీ..?</h1></div><div id="page1"><div class="RunningText"> <span style="font-size: large;">గోల్డెన్ రైస్ అంటే బంగారపు బియ్యం అని కాదు కానీ బంగారు వర్ణంలో ఉన్న బియ్యం. ప్రస్తుతం మనం తింటున్న బియ్యం వల్ల తలెత్తుతున్న పోషకాహార లోపాలు, కంటి సమస్యలను అధిగమించే లక్ష్యంతో ఈ గోల్డెన్ రైస్కు అంకురార్పణ జరిగింది. జన్యుమార్పిడి విధానం ద్వారా తయారయ్యే గోల్డెన్రైస్ వర్ధమాన దేశాలకు వరం అని కొందరు చెబుతుంటే, ఆ బియ్యం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని వందన శివ వంటి ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరి దృష్టిని ఆకర్షిస్తున్న గోల్డెన్రైస్ విశేషాలు. పంచవ్యాప్తంగా వరి పంటపై జరుగుతున్న పరిశోధనల్లో గోల్డెన్ రైస్ ఒక కీలకమైన మలుపు.<br />
<br />
వరి మొక్కలోకి విటమిన్ 'ఎ' మూల కారకం 'బీటాకెరోటిన్'ను సొంతంగా తయారు చేసుకోవటానికి అవసరమయ్యే జన్యువును ప్రవేశ పెట్టి, తయారు చేసిన వరి వంగడమే గోల్డెన్ రైస్. వరి సాధారణంగా 'బీటాకెరోటిన్'ను సొంతంగా తయారు చేసుకోలేదు. దీని వల్ల వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ 'ఎ' లోపం కనిపిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ 'ఎ' లోపం వల్ల ప్రజలు పలు రుగ్మతలకు లోనవుతున్నారు. విటమిన్ 'ఎ' లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది పిల్లలు అంధత్వానికి గురవుతున్నారని సర్వేలో తేలింది. అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారు.</span><img alt="http://globalization303.files.wordpress.com/2011/03/goldenrice.jpg" src="http://globalization303.files.wordpress.com/2011/03/goldenrice.jpg" /><br />
<span style="font-size: large;"><b style="color: red;">లోపాన్ని అధిగమించడమే లక్ష్యం</b></span> <span style="font-size: large;"><br />
వరి ప్రధాన ఆహారంగా ఉన్న ప్రజల్లో కొన్ని ఆరోగ్య సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్ 'ఎ' లోపం పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నది. ఈ సమస్యను అధిగమించడం ఎలా అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. మనం తీసుకొనే ఆహారాన్నే ఈ లోపాన్ని అధిగమించే రీతిలో తయారు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు.<br />
<br />
ఆ ఆలోచన ఫలితమే గోల్డెన్రైస్. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జ్యూరిచ్, స్విట్జర్లాండుకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఇంగో పోట్రికస్, సెంటర్ ఫర్ అప్లైడ్ బయోసైన్సెస్, ఫ్రీబర్గ్ యూనివర్శిటీ, జర్మనీకి చెందిన డాక్టర్ పీటర్బేయర్లు 1982వ సంవత్సరంలో రాక్ఫిల్లర్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గోల్డెన్రైస్పై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. శాస్త్రవేత్తలు ప్రాథమికంగా జపానికా వర్గానికి చెందిన తైసీర300 వరి మొక్కలోకి డఫోడిల్ మొక్క, నేలలో జీవించే 'ఎరివీనియా' బ్యాక్టీరియాల నుంచి సేకరించిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా 1999 వ సంవత్సరం ఆగస్టు నెలలో గోల్డెన్ రైస్ తయారీ ప్రక్రియలో మొట్టమొదటి సారి విజయం సాధించారు.</span><img alt="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" src="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" /><img alt="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" src="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" /></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"></div><div class="RunningText"><br />
<span style="font-size: large;"> మనం తీసుకునే రైస్లోని నాలుగు యూనిట్ల బీటాకెరోటిన్ శరీరంలో ఒక యూనిట్ విటమిన్ 'ఎ' గా మార్పు చెందుతుందని కనుగొన్నారు. ఒక గ్రాము గోల్డెన్రైస్లో దాదాపు35 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అప్పటి నుంచి దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఈ రైస్ ఆవిష్కరణ కొత్త ఆలోచనలకు ఆజ్యం పోయటంతోపాటు బయోటెక్నాలజీ ఆధారిత పరిశోధనలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.</span><img alt="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" src="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" /></div><div class="RunningText"><br />
<span style="font-size: large;"> వివిధ దేశాలకు చెందిన నిపుణుల బృందం 2001వ సంవత్సరంలో ఫిలిఫ్పైన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారంతో గోల్డెన్ రైస్ సామర్థ్యం, ఆహార పౌష్టికత, పర్యవసానాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. నిరుపేద దేశాల్లో పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్న శిశువుల పాలిట గోల్డెన్ రైస్ ఒక వరంగా ఉపయోగపడుతుందని నిర్ధారించారు. విటమిన్ 'ఎ' లోపాన్ని సవరించటంతోపాటు ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ ఆధారిత పరిశోధనలపై ఉన్న అపోహలను తొలిగించేందుకు కూడా గోల్డెన్రైస్ దోహదం చేసింది.<br />
<br />
<img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/jul/20na-2.jpg" /></span> <span style="font-size: large;"><b style="color: red;">మానవీయ కోణం</b><br />
గోల్డెన్ రైస్ను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఇంగోపోట్రికస్, డాక్టర్ పీటర్బేయర్లు దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేథోసంపత్తి హక్కులను పేద దేశాలతో ఉచితంగా పంచుకునేందుకు ముందుకు వచ్చారు. తద్వారా శాస్త్ర పరిశోధనలకు మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. ఫలితంగా భారతదేశంతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో గోల్డెన్ రైస్పై పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. దీంతో అమెరికాలోని సింజెంటా అనే మల్టీ నేషనల్ కంపెనీ గోల్డెన్ రైస్-2 ను విడుదల చేసింది.<br />
<br />
అమెరికాలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గోల్డెన్ రైస్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కీబోనెట్ వరి రకంలో మొక్కజొన్నలో ఉన్న జన్యువులను అదనంగా ప్రవేశ పెట్టడం ద్వారా గోల్డెన్రైస్-2కు రూపకల్పన చేశారు. ఈ బియ్యం బంగారువర్ణంలో ఉంటుంది. గోల్డెన్ రైస్-1 కంటే 2లో అ«ధికంగా బీటాకెరోటిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక గ్రాము గోల్డెన్ రైస్లో 36.7 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.<br />
<br />
<b style="color: red;">పరిశోధనలు మునుముందుకు</b></span> <span style="font-size: large;"><br />
గోల్డెన్రైస్1, 2 రకాలను ప్రపంచ శాస్త్రవేత్తలు వెలువరించిన నేపథ్యంలో భారతదేశంలోనూ దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అంధత్వాన్ని నివారించేందుకు వీలుగా భారతదేశంలో అందుబాటులో ఉన్న వరి వంగడాల్లో గోల్డెన్ రైస్ ను తయారుచేసే జన్యువును చొప్పించేందుకు పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో 40లక్షల హెక్టార్లలో ఈ గోల్డెన్ రైస్ను 1212 సంవత్సరాంతానికల్లా పండించాలనేలక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.<br />
<br />
దేశంలో లభ్యమవుతున్న స్వర్ణ, ఎంటియూ1010. ఏడీటీ 43 వరి వంగడాల్లో బీటాకెరోటిన్ను ఉత్పత్తి చేసే జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా గోల్డెన్ రైస్ను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ రైస్రీసెర్చ్ సహకారంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రైస్ రీసెర్చ్ డైరెక్టరేట్ల ఆధ్వర్యంలో గోల్డెన్రైస్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.<br />
<br />
దీంతోపాటు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోనూ దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రధానంగా ఫిలిఫ్పైన్స్, బంగ్లాదేశ్, భారతదేశాలు గోల్డెన్రైస్పై పరిశోధనలపై దృష్టి సారించాయి. శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ముందడుగు వేస్తున్న నేపథ్యంలో గోల్డెన్ రైస్ మనకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయంటున్నారు.<br />
<br />
<b style="color: red;">గోల్డెన్లో నిజమెంత?</b></span> <span style="font-size: large;"><br />
గోల్డెన్ రైస్ రాకతో భవిష్యత్తులో విటమిన్'ఎ' లోపం నివారణతోపాటు అంధత్వం సమస్యలు తొలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే సామాజిక ఉద్యమకారులు మాత్రం గోల్డెన్ రైస్లో పరిశోధకులు చెబుతున్నంత విటమిన్-ఎ లేనే లేదని వాదిస్తున్నారు. గోల్డెన్ రైస్ను వండిన తరువాత అందులో విటమిన్-ఎ ఎంతవరకు ఉంటుందనే అంశంపై ఖచ్చితమైన లెక్కలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తున్నది. వరిలో జన్యుమార్పిడి పంటను అనుమతిస్తే ఈరకమైన పంటల వెల్లువ ప్రపంచాన్ని ముంచెత్తుతుందని, ఇది పర్యావరణానికి ఏ మాత్రం మంచిది కాదని గ్రీన్పీస్ సంస్థ హెచ్చరిస్తున్నది.<br />
<br />
ప్రస్తుతం ఉన్న వరిపంటలో ఉన్న లోపాల్ని వేరే మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సింది బదులు జన్యుమార్పిడి పంటలు నెత్తికెత్తుకోవడం సమర్థనీయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఫ్రాన్సిస్కో బ్రాంకా అభిప్రాయపడ్డారు. గోల్డెన్రైస్పై మనదేశంలో జోరుగా సాగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వస్తాయా? ఆ బియ్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అవి ఎంత వరకు ప్రస్తుత బియ్యానికి ప్రత్యామ్నాయం అవుతాయనేవి శేషప్రశ్నలే! </span></div></div><img alt="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" src="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg" /></div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-61939326175353666672011-07-17T23:51:00.000-07:002011-07-17T23:51:46.110-07:00ఉత్తమ రైతు ఊరీకే అవలేదు<div id="page1"><div class="RunningText"> <img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/jul/18nav-8.jpg" /> <span style="font-size: large;">"మా నాన్నగారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ ఉద్యోగి. నా బాల్యమంతా షిప్యార్డ్ కాలనీలోనే గడిచింది. మా చుట్టాలుపక్కాలంతా ఉద్యోగస్తులే. ఎవరూ వ్యాపారంలో లేరు. దాని వల్ల ఒకటి - నాకు పల్లెటూళ్ల గురించి ఏమీ తెలియదు. పల్లెటూరే తెలియకపోతే పశువుల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? రెండు - వ్యాపారానికి సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. ఇలాంటి నేపథ్యంలో నేను పత్రికలో ఒక ప్రకటన చూశాను.<br />
<br />
పాయకరావుపేటలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడైన నరసింహారావుగారు డెయిరీ పెట్టాలనుకునే ఔత్సాహికులకు ఒక సెమినార్ నిర్వహిస్తున్నారని. దానికి హాజరయ్యాక ఆయన ఆర్నెల్ల పాటు ఇచ్చే శిక్షణను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్కామ్ చదువుతున్నప్పుడే నలుగురూ నడిచిన బాటలో నడవకూడదని, సొంతంగా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాను.<br />
<br />
ఏం చెయ్యాలి అన్నది మాత్రం స్పష్టంగా తెలిసేది కాదు. 2007 ఆగస్టులో ఈ సెమినార్కు హాజరయిన తర్వాత 'నేను డెయిరీ పెట్టాలి, అందులోనే రాణించాలి' అన్నది ధ్యేయంగా పెట్టుకున్నాను. ఆర్నెల్లపాటు నరసింహారావుగారి దగ్గర శిక్షణకు చేరాను. నాతోపాటూ మొత్తం ముప్ఫైమంది చేరారు. కాని చివరకు మిగిలింది న లుగురమే. అందులో ఇద్దరు 'గోపాలమిత్ర' ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు మాత్రం డెయిరీలు ప్రారంచాలని నిర్ణయించుకున్నాం.<br />
<br />
<b>నేర్చుకుంటూ...</b></span> <span style="font-size: large;"><br />
అప్పటికి నాకున్నదల్లా విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలోని ఏటికొప్పాక గ్రామం దగ్గర 9 ఎకరాల భూమి, రెండు ఆవులు, రెండు గేదెలు. అంతే. నగరాన్ని వదిలేశాను. అక్కడే నివసించడం మొదలుపెట్టాను. లక్షల పెట్టుబడి ఏమీ పెట్టలేదు నేను. నా దగ్గర అంత డబ్బు ఉండేదే కాదు. నెలకో రెండు చొప్పున జెర్సీ ఆవులను కొనడం ప్రారంభించాను. పాల డబ్బులు కూడినప్పుడల్లా ఆవులను కొనేవాణ్ని. దానివల్ల ఒకేసారి బరువు పడినట్టు అనిపించలేదు.<br />
<br />
ఇంకొక జాగ్రత్త ఏం తీసుకున్నానంటే శిక్షణలో కొంత, వైద్యుల నుంచి కొంత, పుస్తకాలు చదివి కొంతా - వెరసి పశువైద్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాను. అనారోగ్య లక్షణాలను గుర్తించడం, సరైన మందులివ్వడం, ఇంజెక్షన్లు చేయడం వంటివన్నీ నాకు వచ్చు. వైద్యులు వచ్చే వరకూ ఆగి, అప్పుడు చికిత్స ప్రారంభిస్తే ఒకోసారి చేయిదాటిపోతుంది.<br />
<br />
అలాకాకుండా అన్ని రకాల మందులూ నా దగ్గర నిల్వ ఉంచుకుంటాను. ఇక్కడ ఒక నిజం మాత్రం చెప్పి తీరాలి. ఒకటి మాత్రం నిజం - మీరు మనసు పెట్టి డెయిరీ నిర్వహణకు ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం వందశాతం సహకారాన్ని అందిస్తుంది. నాకు పశుసంవర్థక శాఖ అధికారులు, వైద్యులు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను డెయిరీ పెట్ట్టిన రెండు మూడేళ్లలోనే పాలు లీటరు తొమ్మిది రూపాయల నుంచి ఇరవైకి చేరుకున్నాయి. డిమాండు చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. ప్రభుత్వ డెయిరీలే కాకుండా ప్రైవేటు డెయిరీలు సైతంగా బాగా విజయవంతంగా నడుస్తున్నాయి. వాటన్నిటికీ పాల అవసరం ఉంది. అందువల్ల ఉత్సాహమున్న యువ త ఎవరైనా డెయిరీ వ్యాపారంలోకి రావొచ్చు. అయితే డెయిరీ నిర్వహణకు పెట్టుబడి డబ్బు ఒక్కటే కాదు. బోలెడంత ఓపిక, సహనం ఉంటేనే ఇందులోకి రావాలి.<br />
<br />
<b>ఎక్కడ ఫెయిలవుతున్నారంటే...</b></span> <span style="font-size: large;"><br />
నిజానికి చాలామందే ఉత్సాహంగా వచ్చి డెయిరీలు పెడుతుంటారు. కానీ విజయం సాధించలేక చతికిలబడుతున్నారు. నేను విశ్లేషించినదాన్ని బట్టి దీనికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి. 'నేను డబ్బు పెట్టి అజమాయిషీ చేస్తాను, నువ్వు పనిచెయ్యి' అనే ధోరణి ఈ వ్యాపారంలో అస్సలు పనికిరాదు. రోజూ ఉదయం మూడు నాలుగు గంటలు, సాయంత్రం నాలుగ్గంటలు - మొత్తం ఎనిమిది పది గంటలు కొట్టంలో గడపాల్సిందే.<br />
<br />
రెండోది పశువుల మేత. ఏది చవగ్గా వస్తే అది పెడుతుంటారు యజమానులు. పసిపిల్లలకూ, మనుషులకూ లాగానే పశువులకూ సమీకృత ఆహారాన్ని అందించాలి. పాలు ఎక్కువ కావాలి, దాణా ఏదోటి పెడతామనే ఆలోచన వదులుకోవాలి. నేను ఎనిమిది రకాల ఆహారాన్ని అందిస్తాను. గోధుమ పొట్టు, పత్తిగింజల చెక్క, కొమ్ముశెనగలు, మినప్పొట్టు, వరినూకలను పచ్చిగడ్డిలో కలిపి పెడతాం.<br />
<br />
ఉదయం మధ్యాహ్నం సాయంత్రాల్లో వేర్వేరు రకాలు - అదికూడా పశువుకో బేసిన్లో చొప్పున వేసి పెడతాం. దీనివల్ల ఏ ఆవు ఏం తిన్నది, ఎంత తిన్నది, ఆహారం తీసుకోవడంలో ఎక్కడైనా సమస్యలున్నాయా అన్నది తెలుస్తుంది. నాకున్న తొమ్మిది ఎకరాలుగాక మరికొంత భూమిని రైతుల నుంచి కౌలుకు తీసుకొని ఐదు రకాల గడ్డిని పెంచుతున్నాను. పూణె, కోయంబత్తూరుల నుంచి విత్తనాలు తీసుకొచ్చి పంట వేశాం. వీటికి తోడు వరిగడ్డిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతాం. మూడోది - పశువుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ప్రతిరోజూ పర్యవేక్షించి తెలుసుకోవాలి.<br />
<br />
మా దగ్గరున్న ప్రతీ ఆవూ ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఈనిందో, ఎప్పుడే అనారోగ్యానికి గురయిందో, ఏ మందులు వాడామో, ఏ రోజు ఎన్ని పాలు ఇచ్చిందో... ఇలా అన్ని వివరాలనూ ల్యాప్టాప్లో భద్రపరిచాను. దీంతో ప్రతి ఆవు గురించిన మొత్తం సమాచారం నాకు క్షుణ్ణంగా తెలుసు. నాలుగో అంశం పరిశుభ్రత. <br />
<br />
అధిక దిగుబడినిస్తాయని అందరూ జెర్సీ ఆవులనే కొంటారు. కానీ అవి వేడి వాతావరణంలో మనలేవు. అందుకే రేకుల షెడ్లలో ఉండలేక రోగాల పాలయి నీరసించి మరణిస్తాయి. దీనికి విరుగుడుగా నేనేం చేశానంటే - డబ్బు సమకూరేదాకా తాటాకులతోనే పైకప్పు వేయించా. కాస్త నిలదొక్కుకున్నాక బంగాళా పెంకులు రెండు వరుసలుగా వేయించటంతో మా షెడ్లు చల్లగా ఉంటాయి. గాలీవెలుతురూ ధారాళంగా వస్తాయి.<br />
<br />
రోజుకు మూడు నాలుగుసార్లు పేడ ఎత్తేస్తాం, మూత్రమంతా పంట పొలాల్లోకి వెళ్లేలా కాలువలు తీశాం. దీనివల్ల ఎప్పుడు చూసినా ఇదంతా శుభ్రంగా ఉంటుంది. అలాగే అన్ని పశువులనూ ఒకేచోట ఉంచను. చిన్న పెయ్యలన్నీ ఒక షెడ్లో, చూడి ఆవులన్నీ ఒకచోట... ఇలా విభజించుకుంటాను. దీనివల్ల వాటికి మేత వెయ్యడం, బాగోగులు చూడటం సులువు. ఇన్సూరెన్స్ కూడా సరిగా చేసుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే లాభాల బాట పట్టడం ఎవ్వరికైనా సాధ్యమే.<br />
<br />
<b>సాంకేతికానుభవం...</b></span> <span style="font-size: large;"><br />
<img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/jul/18nav-7.jpg" /></span> <span style="font-size: large;"> ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత శ్రమించినా మానవ వనరులను జాగ్రత్తగా చూసుకోవడం వీటన్నిటి కన్నా ముఖ్యం. ప్రస్తుతానికి నాతో సహా పద్నాలుగు మందిమి పనిచేస్తున్నాం. వాళ్లందరికీ మంచి వేతనాలు, భోజనం అందేలా చూసుకుంటాను. అలాగే ఊళ్లో ఎవరి పశువులకు ఏ అవసరం వచ్చినా వెళ్లి చూస్తాను. కొత్త తరం తమ సాంకేతికతను పెద్దల అనుభవంతో మేళవించి ముందడుగు వెయ్యాలన్నదే నేను నేర్చుకున్న సూత్రం.<br />
<br />
ఇప్పుడు నా దగ్గర మొత్తం నా దగ్గర 135 (హెచ్.ఎఫ్ - హోలిస్టీన్ ఫ్రెష్యన్ అనే జాతి) ఆవులున్నాయి. అందులో ఎనభై ఇక్కడ పుట్టినవే. అలాగే రోజుకు 500 లీటర్ల పాల దిగుబడి ఉంది. రెండేళ్లలో నా దగ్గర పుట్టినవే వంద ఆవులుండాలని, రోజుకు వెయ్యి లీటర్ల పాల దిగుబడి ఉండాలన్నది నా లక్ష్యం. "మనం వేసే ప్రతి అడుగుకూ అంగుళం దూరంలో ధ్యేయాన్ని పెడతాడు దేవుడు. అందుకే స్వర్గాన్ని అంత ఎత్తులో కట్టాడు.<br />
<br />
కొందరే అక్కడికి చేరుకోగలరు అంగలేసి అలసిపోనివాళ్లు....'' ఈ కొటేషన్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. అందుకే నేను ధ్యేయాన్ని అందుకోవడం కోసం ఎన్ని అంగలైనా వెయ్యదలచుకున్నాను...</span></div><div class="RunningText"><span style="font-size: large;">తక్కువ మొత్తాల్లో డబ్బుకు ఆశపడి పెయ్యలను అమ్మేస్తుంటారు యజమానులు. అవే ఎదిగి ఆవులైనప్పుడు కొనాలంటే చాలా సొమ్ము వెచ్చించాలి. నేను పెయ్యలనూ, ఆవులనూ ఎంత దగ్గరివారికైనా ఇవ్వను. ఒకసారి మాత్రం ఒకాయన చాలా బలవంతపెట్టి ఒకావును తీసుకెళ్లాడు. దాన్ని చెట్టు నీడన కట్టేసి ఇంత గడ్డి పడేసేవాడు. అది అనారోగ్యంతో చనిపోయింది. ఆరోజు మాత్రం చాలా బాధ పడ్డాను. సరైన శ్రద్ధ పెడితే అది బతికి ఉండేది కదా అనిపిస్తుంది. <br />
<br />
<b>-పిన్నమనేని సుబ్బరాజు సెల్ నంబర్ : 9295404698 </b></span></div><div class="RunningText">* అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ </div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com2tag:blogger.com,1999:blog-1005574589812494394.post-91978049645912049502011-07-16T22:02:00.000-07:002011-07-16T22:02:20.104-07:00సెలబ్రిటీ ఆవు<div class="separator" style="clear: both; text-align: center;"></div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://3.bp.blogspot.com/-ud-ghqJmUQI/TiJsAyFsFYI/AAAAAAAAd4s/qmNM6L1KISI/s1600/Celabraty+COW.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="278" src="http://3.bp.blogspot.com/-ud-ghqJmUQI/TiJsAyFsFYI/AAAAAAAAd4s/qmNM6L1KISI/s400/Celabraty+COW.JPG" width="400" /></a></div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://4.bp.blogspot.com/-qgzbj-V75wU/TiJsdMfxx2I/AAAAAAAAd44/-n3acCPDto4/s1600/Celabraty+COW+c.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><br />
</a></div><span style="font-size: large;"><b>ఒకప్పుడు విస్తృత సంఖ్యలో ఉన్న పుంగనూరు పశుజాతి సంఖ్య ప్రస్తుతం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్రం మొత్తంమీద వీటి సంఖ్య 70. హైదరాబాద్లో ఇరవై వరకు ఉన్నాయి. ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు బంజారాహిల్స్కు చెందిన పొనుగోటి శ్రీనివాసరావు, ఎల్బీనగర్కు చెందిన నాగేశ్వరరావు, ఉప్పల్లో రామదాస్లతో పాటు నగర శివారులోని నర్సాపూర్ సువిజ్ఞాన ఆశ్రమంలో పుంగనూరు ఆవులను సంరక్షిస్తున్నారు. వీరితో పాటు నగరంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు, సినీనటులతో పాటు ఓ ఎమ్మెల్యే వద్ద కూడా ఈ ఆవులున్నాయి. ప్రస్తుతం పుంగనూరు ఆవు కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు.</b><br />
<br />
<b>లీటరు పాల ధర.. వందల్లో... </b></span> <span style="font-size: large;"><br />
<img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17072011/hyd17-7-11-33921.jpg" />పుంగనూరు ఆవులు అరుదైన పోషక విలువలతో కూడిన పాలను ఇస్తాయి. ఇందులో 10 నుంచి 12 శాతం వెన్న లభిస్తుంది. సాధారణంగా ఆవుపాలలో అత్యధిక వెన్నశాతం 4 మాత్రమే. ఏడాదిలో తొమ్మిది నెలల పాటు పాలిస్తాయి. ఈ పాలను ఆయుర్వేద ఔషధ తయారీలోనూ వాడుతుండటంతో లీటరు పాల ధర రూ.వందల్లో పలుకుతోంది. <br />
<br />
<b>ఇంటింటా.. సెంటిమెంట్...</b></span> <span style="font-size: large;"><br />
పుంగనూరు ఆవు ఉండటం ఓ సెంటిమెంట్గా చాలామంది భావిస్తున్నారు. ఉదయం లేవగానే ఈ ఆవు మొహం చూసే ఇతర పనులు చేసే వీఐపీలున్నారు. </span><a href="http://4.bp.blogspot.com/-qgzbj-V75wU/TiJsdMfxx2I/AAAAAAAAd44/-n3acCPDto4/s1600/Celabraty+COW+c.JPG" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="http://4.bp.blogspot.com/-qgzbj-V75wU/TiJsdMfxx2I/AAAAAAAAd44/-n3acCPDto4/s400/Celabraty+COW+c.JPG" width="366" /></a><br />
<span style="font-size: large;"><b>కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా...</b></span> <span style="font-size: large;"><br />
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక సమీక్ష సమావేశాలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లేవాడ్ని. ఒక సారి వైఎస్సార్కు పుంగనూరు జాతి గురించి వివరించా. ఆయన సహకారంతో రెండు ఆవుల్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఉచితంగా పొందా. ప్రస్తుతం మా ఇంట్లో మూడు ఆవులున్నాయి. కుటుంబసభ్యులకంటే మిన్నగా పెంచుకుంటా. పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. ప్రత్యేక షెడ్డు, రెండు ఫ్యాన్లు, దోమతెరలు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశా. పట్టణాల్లో పెంచుకోవడం చాలా సులువు.<br />
-రాందాస్, బోడుప్పల్<br />
<br />
<b>ఎన్నో ఔషధగుణాలు...</b></span> <span style="font-size: large;"><br />
పుంగనూరు జాతి ఈ ప్రాంతానికి, వాతావరణానికి ఎంతో అనువైంది. ఈ ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వివిధ సమస్యలపై మా ఆశ్రమానికి వ చ్చేవారికి పుంగనూరు ఆవుపాలతో కూడిన ఔషధాన్ని ఇస్తాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. <br />
- గురు సత్యవీర్,<br />
సువిజ్ఞాన ఆశ్రమం, నర్సాపూర్ <br />
<br />
<b>ఇష్టమనే పెంచుతున్నా...</b></span> <span style="font-size: large;"><br />
పుంగనూరు పశువులంటే ఎంతో ప్రేమ. ఈ ఆవుల్ని పెంచితే అంతా మంచే జరుగుతుందన్న సెంటిమెంట్ ఉంది. ఈ జాతి ఆవులు మార్కెట్లో లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఇష్టపడే వారు రూ.లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. <br />
- ఉలిపెద్ది నాగేశ్వరరావు<br />
<br />
<b>ఎన్టీఆర్ హయాంలో...</b></span> <span style="font-size: large;"><br />
ఆంధ్రప్రదేశ్లో పుంగనూ రు జాతి ఆవులు అంతరించిపోతున్నాయని 1983లో అప్పటి సీఎం నందమూరి తారకరామారావు ఈ జాతిని కాపాడాలని గుజ రాత్ నుంచి ఆవులను కొనుగోలు చేసి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులకు సబ్సిడీ ద్వారా అందజేశారు.<br />
<br />
<b>కృషి చేస్తా...</b></span> <span style="font-size: large;"><br />
పుంగనూరు జాతి అంటే ఎంతో మక్కువ. వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వీటి పరిరక్షణకు కృషి చేస్తా.<br />
- పొనుగోటి శ్రీనివాసరావు</span>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1005574589812494394.post-85668088674966875042011-07-06T02:51:00.000-07:002011-07-06T02:51:35.800-07:00నేల మంచిదైతేనే పంట ‘ పండుతుంది. ’<div dir="ltr" style="text-align: left;" trbidi="on"> <br />
<table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"><tbody>
<tr> <td style="width: 606px;"> <div class="redNote" id="div_Desc"><span style="font-size: large;"><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/05072011/AGR-COTTON4-7-11-38593.jpg" /> రాష్ట్రంలో అనేక రకాల నేలలు ఉన్నాయి. అయితే వీటిలో పంటలు పండించడానికి అనువైన సారవంతమైన భూములు కొన్ని మాత్రమే. చాలా మంది రైతులకు ఏ పంటకు ఏ భూమి అనువైనదన్న విషయంపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో తమ భూమికి అనువుగా లేని పంటల్ని సాగు చేస్తూ నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ భూమిలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు పొందవచ్చో కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.హరీష్ కుమార్ శర్మ సూచిస్తున్నారు. ఆ వివరాలు...<br />
<br />
<b style="color: red;">సారవంతమై ఉండాలి</b></span> <span style="font-size: large;"><br />
పంట బాగా పండాలంటే భూమి సారవంతమై ఉండాలి. రసాయన ఎరువులు వేస్తే ఏ భూమిలో అయినా పంట పండుతుందని రైతులు అపోహ పడుతుంటారు. రసాయన ఎరువులు వేసుకుంటూ పోతే కొన్నేళ్ల పాటు పంట పండే మాట నిజమే అయినా తర్వాతి కాలంలో ఆ భూములు నిస్సారంగా మారతాయి. మనం వేసే ఎరువులు పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వాలంటే భూమి సారవంతమై ఉండాల్సిందే. అంతేకాదు... దాని భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే భూమిలో వేసిన ఏ ఎరువునైనా మొక్క సమర్థవంతంగా గ్రహిస్తుంది. నాణ్యమైన, అధిక దిగుబడులు అందిస్తుంది.<br />
<br />
<b style="color: red;">ఏం చేయాలి?</b></span> <span style="font-size: large;"><br />
సాగు భూముల్లో సారం పెరగాలంటే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, చెరకు మడ్డి, వర్మి కంపోస్ట్ను విరివిగా వాడాలి. దీనివల్ల నేల గుల్ల బారుతుంది. దానికి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. మొక్కల ఎదుగుదలకు దోహదపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. అలాగే మొక్కలకు అవసరమైన కొన్ని పోషక పదార్థాలు కూడా అందుతాయి. <br />
<br />
పొలం నుండి మురుగు నీరు బయటికి పోయే సౌకర్యం లేకపోతే భూమి భౌతిక, రసాయునిక పరిస్థితి (ఆరోగ్యం) దెబ్బ తింటుంది. వ్యవసాయ భూముల్లో నీరు బాగా నిలిచిపోతే వరి మినహా మిగిలిన పంటలు తట్టుకోలేవు. పంట చేలో నీరు నిలిస్తే మొక్కల ఆకులు పసుపుపచ్చగా, ఎర్రగా మారి గిడసబారతాయి. నీరు నిలిచిన కొద్దీ వ్యవసాయ భూములు చౌడు భూములుగా మారతాయి. అందువల్ల పంట చేలో మురుగు నీటి పారుదల సదుపాయం తప్పనిసరిగా ఉండాలి.</span> <span style="font-size: large;"><br />
<br />
<b style="color: red;">సమస్యాత్మక భూములను దారికి తేవాలంటే...</b></span> <span style="font-size: large;"><br />
రాష్ట్రంలో 8.6 లక్షల ఎకరాలు ఉప్పు, చౌడు భూములే. ఉప్పు నేలల్ని తెల్ల చౌడు నేలలని, చౌడు నేలల్ని నల్ల చౌడు లేదా క్షార భూములని పిలుస్తారు. ఈ భూముల్ని దారికి తేవాలంటే ముందుగా నేలను చదును చేయాలి. చదును చేసేటప్పుడు భూమి కొంచెం వాలుగా ఉండేలా చేస్తే మురుగు నీరు సులభంగా బయటికి పోతుంది. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వేర్వేరుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత భూమిని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. పొలం చుట్టూ ఎత్తయిన కట్టలు కట్టాలి. మడుల్లో మంచి నీటినే నింపాలి. ఆ నీటిని నాలుగైదు రోజులు నిల్వ ఉంచాలి. ఎండ వేడిమికి ఇంకిపోగా మిగిలిన నీటిని బయటికి పంపాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే నేలలో చౌడు తీవ్రత తగ్గుతుంది. ఉదజని సూచికను బట్టి భూమిలో జిప్సమ్ వేసి దున్నాలి. నీరు పెట్టి వారం రోజుల పాటు అలాగే ఉంచాలి.<br />
<br />
వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూమి నుం డి కాల్షియం, పొటాషియం, సోడియం లవణాలు వరద నీటిలో కలిసి కొట్టుకుపోతాయి. నీటిలో అంతగా కరగని అల్యూమినియం, సిలికాన్, ఇనుము అవశేషాలు ఆక్సైడ్ లేదా సిలికేట్ రూపంలో భూమిలోనే ఉండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ నేలలు ఆమ్ల నేలలుగా మారతాయి. ఈ భూముల నుండి కొన్ని రకాల విష పదార్థాలు విడుదల కావడంతో మొక్కలు సరిగా పెరగవు. ఈ పరిస్థితిని నివారించాలంటే ముందుగా పొలాన్ని కలియదున్ని ఆ తర్వాత పొలం అంతటా సమానంగా పడేలా సున్నం పొడిని వెదజల్లి మరోసారి దున్నాలి. సేంద్రియ ఎరువులు వేయడానికి నాలుగైదు వారాల ముందు సున్నం చల్లాలి. ఆమ్ల గుణమున్న నేలల్లో అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ వంటి రసాయన ఎరువులు వేయకూడదు. </span> <span style="font-size: large;"><br />
<br />
వ్యవసాయ భూముల్లో నీటిలో కరిగే లవణాలు అధికంగా ఉన్నట్లరుతే మొక్కలు పోషకాలను, నీటిని తగినంతగా తీసుకోలేవు. ఈ సమస్యను నివారించాలంటే ముందుగా పొలాన్ని బాగా దమ్ము చేయాలి. మురుగు నీటిని బయటికి పంపాలి. ఈ విధంగా నాలుగైదు సార్లు చేస్తే భూమిలో లవణాల్ని పరిమిత స్థాయికి తేవచ్చు.</span> <span style="font-size: large;"><br />
<br />
<b>ఏ పంటకు ఏ భూమి అనుకూలం?</b></span> <span style="font-size: large;"><br />
<br />
వరిని అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయొచ్చు. కానీ మురుగు నీరు బయటికి పోయే వసతి ఉన్న బరువు నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరుతడి పంటలతో పోలిస్తే వరికి చౌడు నేలలు కొంత మేర అనుకూలమే. మొక్కజొన్నను ఇసుక, రేగడి, గరప నేలల్లో సాగు చేయొచ్చు. ఎర్ర గరప నేలలు, లోతైన మధ్య రకపు రేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు ఎక్కువగా నిలిచే ఒండ్రు నేలలు, బరువు నేలలు పనికిరావు. పేలాల మొక్కజొన్న రకాల్ని తేలికపాటి ఇసుక భూముల్లో వేసుకోవచ్చు. జొన్నను నల్ల నేలల్లో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది. తేలికపాటి ఎర్ర నేలల్లో కూడా పండించవచ్చు.</span> <span style="font-size: large;"><br />
<br />
కందిని నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, ఎర్ర చల్కా భూముల్లో సాగు చేయొచ్చు. నల్ల రేగడి నేలల్లో మురుగు నీరు బయటికి పోయే వసతి ఉంటే కంది వేయొచ్చు. చౌడు నేలలు, నీరు ఎక్కువగా నిలిచే నేలలు పనికిరావు. మినుము, సోయా చిక్కుడును నీరు ఇంకే, తేవును నిల్వ చేసుకునే భూముల్లో సాగు చేయొచ్చు. మురుగు నీటి పారుదల వసతి ఉన్న ఎర్ర, నల్ల నేలల్లో కూడా వేసుకోవచ్చు.</span> <span style="font-size: large;"><br />
<br />
వేరుశనగ సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. చల్కా భూముల్లో కూడా పండించవచ్చు. నువ్వుల సాగుకు తేమను నిలుపుకునే, మురుగు నీరు నిలువని తేలికైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆముదాన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీరు ఇంకిపోయే తేలిక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి.</span> <span style="font-size: large;"><br />
పత్తిని వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో సాగు చేయొచ్చు. వర్షాధారపు పత్తికి తేలికపాటి ఎర్ర నేలలు అనువైనవి కావు. నీటి పారుదల కింద తేలికైన ఎర్ర నేలలు, బరువైన నల్ల నేలల్లో వేసుకోవచ్చు. </span></div></td> </tr>
<tr> <td height="10"> </td></tr>
</tbody></table></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-56255624047226021812011-07-06T02:41:00.000-07:002011-07-06T02:41:46.807-07:00కంటికి రెప్పలా చూసుకుంటేనే డ్రిప్పు పదిలం<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div align="center"><img align="Middle" class="imgborder" height="299" src="http://www.sakshi.com/newsimages/contentimages/01032011/AGRI-DRIP1-3-11-38906.jpg" width="400" /></div><span style="font-size: large;">అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు ఎక్కువ నీటిని అందించాలన్న అభిప్రాయం చాలా మంది రైతుల్లో ఉంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పైర్లకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో నీరు అందించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. దీనికి సూక్ష్మ సాగు నీటి విధానం (మైక్రో ఇరిగేషన్) ఎంతగానో ఉపయోగపడుతుంది. సూక్ష్మ సాగు నీటి విధానంలో రెండు పద్ధతులున్నారుు. <br />
<br />
అవి 1.బిందు సేద్యం 2.తుంపర్ల సేద్యం. బిందు సేద్యానికి (డ్రిప్ ఇరిగేషన్) అవసరమైన పరికరాల్ని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకం (ఏపీఎంఐపీ) ద్వారా ప్రభుత్వం 90 శాతం రాయితీతో అందిస్తోంది. అయితే రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వీటిని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోతున్నారు. పరికరాలు దీర్ఘకాలం ఉపయోగపడాలంటే వాటిని సరైన రీతిలో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యం లో డ్రిప్ పరికరాల నిర్వహణ, సంరక్షణకు సంబంధించి నల్గొండ ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ సహాయ అధికారి బాబు ‘న్యూస్లైన్’కు పలు విషయాలు తెలియ జేశారు. ఆ వివరాలు...<br />
<br />
<b>శాండ్ ఫిల్టర్ను ఇలా శుభ్రపరచాలి...</b><br />
బావి నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు శాండ్ ఫిల్టర్ను అమరుస్తారు. ఇందులో ప్రత్యేకమైన ఇసుక ఉంటుంది. బావి నీటిని అందులోకి పంపించినప్పుడు నీటిలో ఏమైనా చెత్త, ఇతర వులినాలు ఉంటే అవి ఇసుకలోకి చేరి శుభ్రమైన నీరు మాత్రమే పైపుల ద్వారా మొక్కలకు అందుతుంది. ఇసుకలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించనట్లయితే నీటి ఒత్తిడి (ప్రెషర్) తగ్గుతుంది. అందువల్ల బిందు సేద్యానికి గుండె లాంటి శాండ్ ఫిల్టర్ను ప్రతి వారం శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఇసుకను చేతితో కలుపుతూ చెత్తను బయట పడేయాలి.<br />
<br />
<b>స్క్రీన్ ఫిల్టర్ను కూడా...</b><br />
బోరు నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు స్క్రీన్ ఫిల్టర్ను అమరుస్తారు. దీనిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. స్క్రీన్ ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఫిల్టర్ ఎలిమెంట్ను, సూక్ష్మ రంధ్రాలు ఉన్న స్టీల్ జాలీని శుభ్రపరచాలి. నీటి ధార కింద జాలీని ఉంచి మెత్తని బ్రష్తో రుద్దాలి. <br />
<br />
<b>పైపును ఎలా శుభ్రం చేయాలంటే...</b><br />
శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికీ సన్నని మట్టి కణాలు, ఇతర సేంద్రియ పదార్థాలు సబ్ మెయిన్ పీవీసీ పైపు వరకూ వస్తాయి. అక్కడి నుండి లాటరల్ ఇన్ లైన్ దిశగా వెళతాయి. వీటిని తొలగించడానికి సబ్ మెయిన్ పీవీసీ పైపు చివరి భాగంలో ఉండే ఫ్లష్ వాల్వ్లను వారానికో రోజు తెరవాలి. లోపల పేరుకున్న చెత్త, వులినాలు నీటి ప్రవాహంతో పాటు బయటికి వస్తారుు.<br />
<br />
<b>లాటరల్స్ మూసుకుపోతాయి...జాగ్రత్త</b><br />
ట్యూబ్ లాటరల్స్ను శుభ్రం చేయకపోతే డ్రిప్పర్ల రంధ్రాల్లో మలినాలు పేరుకొని మూసుకుపోతాయి. లాటరల్స్ను శుభ్రం చేయడానికి పైపు చివర ఎండ్ క్యాప్ ఉంటుంది. దీనిని వారం లేదా 15 రోజులకు ఒకసారి తెరిచి పంపు ద్వారా పూర్తి ప్రెషర్ తో నీటిని లోపలికి పంపాలి. నీటి ప్రవాహం వేగంగా ఉంటే లాటరల్స్లో ఉన్న చెత్త నీటితో పాటే బయటికి వస్తుంది. వర్షాకాలంలో డ్రిప్ పరికరాలను పెద్దగా ఉపయోగించరు కనుక పైపులో సాలీళ్లు గూడు కట్టుకుంటాయి. అందువల్ల డ్రిప్ను తిరిగి వాడేటప్పుడు ముందుగా నీటిని పూర్తి ప్రవాహ వేగంతో వదలాలి. <br />
<br />
<b>ఇలా వాడుకోండి...</b><br />
మోటారు ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ దగ్గర ఉన్న ప్రెషర్ గేజ్ సరిగా పని చేస్తున్నదో లేదో పరిశీలించాలి. గేజ్ మీటర్ పైన పాలిథిన్ కవర్ తొడగాలి. గేజ్లోని సూచిక పని చేయకపోతే నెమ్మదిగా తీసి సరి చేయాలి. నీటి వేగం సెకనుకు 1.5 మీటర్లు ఉంటేనే లాటరల్ పైపుకు నీరు అందుతుంది. మోటారు పంపు ఫుట్ వాల్వ్ దగ్గర వాచర్ పాడైనప్పుడు రైతులు అవగాహన లేక పేడ నీళ్లు ఉపయోగిస్తారు. <br />
<br />
<img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01032011/AGRI-FILTER1-3-11-38187.jpg" />దీని వల్ల మోటారు ఆన్ చేసేటప్పుడు పేడ నీరు ఫిల్టర్లోకి చేరి దానిపై భారం పడుతుంది. దీనిని నివారించేందుకు బైపాస్ ద్వారా మురుగు నీటిని బయటికి పంపాలి. శాండ్ ఫిల్టర్లో తప్పనిసరిగా నాలుగింట మూడు వంతులు ఇసుక ఉండాలి. డ్రిప్పర్లను శుభ్రం చేయడానికి వాటిని లాటరల్ నుండి బయటికి తీయకూడదు. తెరిచి శుభ్రం చేయాలి. లాటరల్ నుండి డ్రిప్పర్లను బయటికి తీస్తే కన్నాలు పెద్దవై లీకేజీలు మొదలవుతాయి. ఉడతలు, ఎలుకల వంటివి లాటరల్స్కు నష్టం కలిగిస్తుంటే లాటరల్స్ను నేలలో మూడు నాలుగు అంగుళాల లోతుకు పరిచి మట్టి కప్పాలి. <br />
<br />
డ్రిప్పర్లు పైకి ఉండేలా చూసుకోవాలి. నీటి కోసం పక్షులు లాటరల్స్ను కొరకకుండా అక్కడక్కడా నీటిని అందుబాటులో ఉంచాలి. డ్రిప్పర్ల చుట్టూ ఎంత మేరకు భూమి తడుస్తోందో తెలుసుకునేందుకు తరచుగా నేలను తవ్వి పరిశీలించాలి. లవణాలు, చెత్త పేరుకుపోయి డ్రిప్పర్లు మూసుకుపోతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేయాలి. వర్షాకాలంలో కూడా రోజూ కనీసం అరగంట పాటు మోటారు ఆన్ చేసి పరికరాలు పని చేసేలా చూసుకోవాలి.<br />
<br />
<b>ఏం చేయకూడదు?</b><br />
డ్రిప్ పరికరాల్ని వాడాల్సిన అవసరం లేనప్పుడు వాటిని అలాగే తోటలో వదిలెయ్యకూడదు. చుట్టలుగా చుట్టి భద్రపరచుకోవాలి. పైపుల్ని అలాగే ఉంచి చేలో చెత్తను కాల్చకూడదు. యాసిడ్ ద్రావణం తయారు చేసేందుకు యాసిడ్ను నీటిలో పోయాలే తప్ప నీటిని యాసిడ్లో పోయకూడదు. ఫిల్టర్లో జాలీ లేకుండా పరికరాల్ని పని చేయించకూడదు. ఫిల్టర్లోని జాలీని శుభ్రం చేయడానికి పదునైన వస్తువులు, పుల్లలు, ఇనుప బ్రష్లు వాడకూడదు. లాటరల్ పైపును బలంగా లాగకూడదు. డ్రిప్ పరికరాల ద్వారా అవసరమైన మేరకే చెట్లకు నీరు అందించాలి. అవసరానికి మించి ఎక్కువగా నీరు పెడితే పల్లాకు తెగులు వచ్చే ప్రమాదం ఉంది.</span> </div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1005574589812494394.post-24186102360604090522011-05-16T22:24:00.000-07:002011-05-16T22:40:24.569-07:00రైతు హైకూ * గ్రంథపు చెక్క<div dir="ltr" style="text-align: left;" trbidi="on"> <img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17052011/116-5-11-16640.jpg" /><br />
<span style="font-size: large;"><b>నేల ప్రసవించి<br />
మొలకలు పులకలు<br />
ముంగారు పైరు<br />
<br />
విరగ గాచిన</b><b><br />
గంపలు గంపలు<br />
రైతు కలలు</b></span> <br />
<span style="font-size: large;"><b><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17052011/316-5-11-1631.jpg" /><br />
</b></span> <br />
<br />
<br />
<br />
<br />
<span style="font-size: large;"><b> సంతల నిండా <br />
ఆశపడిన కళ్లు<br />
రైతు శ్రమలు<br />
<br />
అమ్ముడు పోదు</b><b><br />
యింటికీ చేరదు<br />
రైతు కష్టం</b></span> <br />
<span style="font-size: large;"><b><br />
<img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17052011/216-5-11-16875.jpg" /></b></span> <br />
<span style="font-size: large;"><b>శ్రమ ఫలాలు<br />
చెల్లని చిల్లిగవ్వలు<br />
ఉక్రోషం పాలు<br />
<br />
రైతు బతుకు<br />
పంటలో తాలు<br />
దిబ్బలపాలు</b></span> <br />
<br />
<div style="text-align: right;"> - జి. వెంకట కృష్ణ<br />
(‘కొన్ని రంగులు ఒక పద్యం’ నుంచి) </div></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0