పాడి పంటలు

Wednesday, July 20, 2011

గోల్డెన్‌రైస్ గోప్పేమీటీ..?

  http://learner.org/courses/envsci/visual/img_med/rice.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg

గోల్డెన్‌రైస్ గోప్పేమీటీ..?

గోల్డెన్ రైస్ అంటే బంగారపు బియ్యం అని కాదు కానీ బంగారు వర్ణంలో ఉన్న బియ్యం. ప్రస్తుతం మనం తింటున్న బియ్యం వల్ల తలెత్తుతున్న పోషకాహార లోపాలు, కంటి సమస్యలను అధిగమించే లక్ష్యంతో ఈ గోల్డెన్ రైస్‌కు అంకురార్పణ జరిగింది. జన్యుమార్పిడి విధానం ద్వారా తయారయ్యే గోల్డెన్‌రైస్ వర్ధమాన దేశాలకు వరం అని కొందరు చెబుతుంటే, ఆ బియ్యం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని వందన శివ వంటి ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరి దృష్టిని ఆకర్షిస్తున్న గోల్డెన్‌రైస్ విశేషాలు. పంచవ్యాప్తంగా వరి పంటపై జరుగుతున్న పరిశోధనల్లో గోల్డెన్ రైస్ ఒక కీలకమైన మలుపు.

వరి మొక్కలోకి విటమిన్ 'ఎ' మూల కారకం 'బీటాకెరోటిన్'ను సొంతంగా తయారు చేసుకోవటానికి అవసరమయ్యే జన్యువును ప్రవేశ పెట్టి, తయారు చేసిన వరి వంగడమే గోల్డెన్ రైస్. వరి సాధారణంగా 'బీటాకెరోటిన్'ను సొంతంగా తయారు చేసుకోలేదు. దీని వల్ల వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ 'ఎ' లోపం కనిపిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ 'ఎ' లోపం వల్ల ప్రజలు పలు రుగ్మతలకు లోనవుతున్నారు. విటమిన్ 'ఎ' లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది పిల్లలు అంధత్వానికి గురవుతున్నారని సర్వేలో తేలింది. అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారు.
http://globalization303.files.wordpress.com/2011/03/goldenrice.jpg
లోపాన్ని అధిగమించడమే లక్ష్యం
వరి ప్రధాన ఆహారంగా ఉన్న ప్రజల్లో కొన్ని ఆరోగ్య సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్ 'ఎ' లోపం పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నది. ఈ సమస్యను అధిగమించడం ఎలా అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. మనం తీసుకొనే ఆహారాన్నే ఈ లోపాన్ని అధిగమించే రీతిలో తయారు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు.

ఆ ఆలోచన ఫలితమే గోల్డెన్‌రైస్. స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జ్యూరిచ్, స్విట్జర్లాండుకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఇంగో పోట్రికస్, సెంటర్ ఫర్ అప్లైడ్ బయోసైన్సెస్, ఫ్రీబర్గ్ యూనివర్శిటీ, జర్మనీకి చెందిన డాక్టర్ పీటర్‌బేయర్‌లు 1982వ సంవత్సరంలో రాక్‌ఫిల్లర్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గోల్డెన్‌రైస్‌పై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. శాస్త్రవేత్తలు ప్రాథమికంగా జపానికా వర్గానికి చెందిన తైసీర300 వరి మొక్కలోకి డఫోడిల్ మొక్క, నేలలో జీవించే 'ఎరివీనియా' బ్యాక్టీరియాల నుంచి సేకరించిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా 1999 వ సంవత్సరం ఆగస్టు నెలలో గోల్డెన్ రైస్ తయారీ ప్రక్రియలో మొట్టమొదటి సారి విజయం సాధించారు.
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg

మనం తీసుకునే రైస్‌లోని నాలుగు యూనిట్ల బీటాకెరోటిన్ శరీరంలో ఒక యూనిట్ విటమిన్ 'ఎ' గా మార్పు చెందుతుందని కనుగొన్నారు. ఒక గ్రాము గోల్డెన్‌రైస్‌లో దాదాపు35 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అప్పటి నుంచి దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఈ రైస్ ఆవిష్కరణ కొత్త ఆలోచనలకు ఆజ్యం పోయటంతోపాటు బయోటెక్నాలజీ ఆధారిత పరిశోధనలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg

వివిధ దేశాలకు చెందిన నిపుణుల బృందం 2001వ సంవత్సరంలో ఫిలిఫ్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారంతో గోల్డెన్ రైస్ సామర్థ్యం, ఆహార పౌష్టికత, పర్యవసానాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. నిరుపేద దేశాల్లో పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్న శిశువుల పాలిట గోల్డెన్ రైస్ ఒక వరంగా ఉపయోగపడుతుందని నిర్ధారించారు. విటమిన్ 'ఎ' లోపాన్ని సవరించటంతోపాటు ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ ఆధారిత పరిశోధనలపై ఉన్న అపోహలను తొలిగించేందుకు కూడా గోల్డెన్‌రైస్ దోహదం చేసింది.

మానవీయ కోణం
గోల్డెన్ రైస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఇంగోపోట్రికస్, డాక్టర్ పీటర్‌బేయర్‌లు దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేథోసంపత్తి హక్కులను పేద దేశాలతో ఉచితంగా పంచుకునేందుకు ముందుకు వచ్చారు. తద్వారా శాస్త్ర పరిశోధనలకు మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. ఫలితంగా భారతదేశంతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో గోల్డెన్ రైస్‌పై పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. దీంతో అమెరికాలోని సింజెంటా అనే మల్టీ నేషనల్ కంపెనీ గోల్డెన్ రైస్-2 ను విడుదల చేసింది.

అమెరికాలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గోల్డెన్ రైస్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కీబోనెట్ వరి రకంలో మొక్కజొన్నలో ఉన్న జన్యువులను అదనంగా ప్రవేశ పెట్టడం ద్వారా గోల్డెన్‌రైస్-2కు రూపకల్పన చేశారు. ఈ బియ్యం బంగారువర్ణంలో ఉంటుంది. గోల్డెన్ రైస్-1 కంటే 2లో అ«ధికంగా బీటాకెరోటిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక గ్రాము గోల్డెన్ రైస్‌లో 36.7 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

పరిశోధనలు మునుముందుకు

గోల్డెన్‌రైస్1, 2 రకాలను ప్రపంచ శాస్త్రవేత్తలు వెలువరించిన నేపథ్యంలో భారతదేశంలోనూ దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అంధత్వాన్ని నివారించేందుకు వీలుగా భారతదేశంలో అందుబాటులో ఉన్న వరి వంగడాల్లో గోల్డెన్ రైస్ ను తయారుచేసే జన్యువును చొప్పించేందుకు పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో 40లక్షల హెక్టార్లలో ఈ గోల్డెన్ రైస్‌ను 1212 సంవత్సరాంతానికల్లా పండించాలనేలక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

దేశంలో లభ్యమవుతున్న స్వర్ణ, ఎంటియూ1010. ఏడీటీ 43 వరి వంగడాల్లో బీటాకెరోటిన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా గోల్డెన్ రైస్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ రైస్‌రీసెర్చ్ సహకారంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రైస్ రీసెర్చ్ డైరెక్టరేట్‌ల ఆధ్వర్యంలో గోల్డెన్‌రైస్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

దీంతోపాటు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోనూ దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రధానంగా ఫిలిఫ్పైన్స్, బంగ్లాదేశ్, భారతదేశాలు గోల్డెన్‌రైస్‌పై పరిశోధనలపై దృష్టి సారించాయి. శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ముందడుగు వేస్తున్న నేపథ్యంలో గోల్డెన్ రైస్ మనకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయంటున్నారు.

గోల్డెన్‌లో నిజమెంత?

గోల్డెన్ రైస్ రాకతో భవిష్యత్తులో విటమిన్'ఎ' లోపం నివారణతోపాటు అంధత్వం సమస్యలు తొలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే సామాజిక ఉద్యమకారులు మాత్రం గోల్డెన్ రైస్‌లో పరిశోధకులు చెబుతున్నంత విటమిన్-ఎ లేనే లేదని వాదిస్తున్నారు. గోల్డెన్ రైస్‌ను వండిన తరువాత అందులో విటమిన్-ఎ ఎంతవరకు ఉంటుందనే అంశంపై ఖచ్చితమైన లెక్కలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తున్నది. వరిలో జన్యుమార్పిడి పంటను అనుమతిస్తే ఈరకమైన పంటల వెల్లువ ప్రపంచాన్ని ముంచెత్తుతుందని, ఇది పర్యావరణానికి ఏ మాత్రం మంచిది కాదని గ్రీన్‌పీస్ సంస్థ హెచ్చరిస్తున్నది.

ప్రస్తుతం ఉన్న వరిపంటలో ఉన్న లోపాల్ని వేరే మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సింది బదులు జన్యుమార్పిడి పంటలు నెత్తికెత్తుకోవడం సమర్థనీయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఫ్రాన్సిస్కో బ్రాంకా అభిప్రాయపడ్డారు. గోల్డెన్‌రైస్‌పై మనదేశంలో జోరుగా సాగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వస్తాయా? ఆ బియ్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అవి ఎంత వరకు ప్రస్తుత బియ్యానికి ప్రత్యామ్నాయం అవుతాయనేవి శేషప్రశ్నలే!
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/29/Golden_Rice.jpg/300px-Golden_Rice.jpg

Sunday, July 17, 2011

ఉత్తమ రైతు ఊరీకే అవలేదు

"మా నాన్నగారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగి. నా బాల్యమంతా షిప్‌యార్డ్ కాలనీలోనే గడిచింది. మా చుట్టాలుపక్కాలంతా ఉద్యోగస్తులే. ఎవరూ వ్యాపారంలో లేరు. దాని వల్ల ఒకటి - నాకు పల్లెటూళ్ల గురించి ఏమీ తెలియదు. పల్లెటూరే తెలియకపోతే పశువుల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? రెండు - వ్యాపారానికి సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. ఇలాంటి నేపథ్యంలో నేను పత్రికలో ఒక ప్రకటన చూశాను.

పాయకరావుపేటలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడైన నరసింహారావుగారు డెయిరీ పెట్టాలనుకునే ఔత్సాహికులకు ఒక సెమినార్ నిర్వహిస్తున్నారని. దానికి హాజరయ్యాక ఆయన ఆర్నెల్ల పాటు ఇచ్చే శిక్షణను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్‌కామ్ చదువుతున్నప్పుడే నలుగురూ నడిచిన బాటలో నడవకూడదని, సొంతంగా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

ఏం చెయ్యాలి అన్నది మాత్రం స్పష్టంగా తెలిసేది కాదు. 2007 ఆగస్టులో ఈ సెమినార్‌కు హాజరయిన తర్వాత 'నేను డెయిరీ పెట్టాలి, అందులోనే రాణించాలి' అన్నది ధ్యేయంగా పెట్టుకున్నాను. ఆర్నెల్లపాటు నరసింహారావుగారి దగ్గర శిక్షణకు చేరాను. నాతోపాటూ మొత్తం ముప్ఫైమంది చేరారు. కాని చివరకు మిగిలింది న లుగురమే. అందులో ఇద్దరు 'గోపాలమిత్ర' ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు మాత్రం డెయిరీలు ప్రారంచాలని నిర్ణయించుకున్నాం.

నేర్చుకుంటూ...

అప్పటికి నాకున్నదల్లా విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలోని ఏటికొప్పాక గ్రామం దగ్గర 9 ఎకరాల భూమి, రెండు ఆవులు, రెండు గేదెలు. అంతే. నగరాన్ని వదిలేశాను. అక్కడే నివసించడం మొదలుపెట్టాను. లక్షల పెట్టుబడి ఏమీ పెట్టలేదు నేను. నా దగ్గర అంత డబ్బు ఉండేదే కాదు. నెలకో రెండు చొప్పున జెర్సీ ఆవులను కొనడం ప్రారంభించాను. పాల డబ్బులు కూడినప్పుడల్లా ఆవులను కొనేవాణ్ని. దానివల్ల ఒకేసారి బరువు పడినట్టు అనిపించలేదు.

ఇంకొక జాగ్రత్త ఏం తీసుకున్నానంటే శిక్షణలో కొంత, వైద్యుల నుంచి కొంత, పుస్తకాలు చదివి కొంతా - వెరసి పశువైద్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాను. అనారోగ్య లక్షణాలను గుర్తించడం, సరైన మందులివ్వడం, ఇంజెక్షన్లు చేయడం వంటివన్నీ నాకు వచ్చు. వైద్యులు వచ్చే వరకూ ఆగి, అప్పుడు చికిత్స ప్రారంభిస్తే ఒకోసారి చేయిదాటిపోతుంది.

అలాకాకుండా అన్ని రకాల మందులూ నా దగ్గర నిల్వ ఉంచుకుంటాను. ఇక్కడ ఒక నిజం మాత్రం చెప్పి తీరాలి. ఒకటి మాత్రం నిజం - మీరు మనసు పెట్టి డెయిరీ నిర్వహణకు ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం వందశాతం సహకారాన్ని అందిస్తుంది. నాకు పశుసంవర్థక శాఖ అధికారులు, వైద్యులు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను డెయిరీ పెట్ట్టిన రెండు మూడేళ్లలోనే పాలు లీటరు తొమ్మిది రూపాయల నుంచి ఇరవైకి చేరుకున్నాయి. డిమాండు చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. ప్రభుత్వ డెయిరీలే కాకుండా ప్రైవేటు డెయిరీలు సైతంగా బాగా విజయవంతంగా నడుస్తున్నాయి. వాటన్నిటికీ పాల అవసరం ఉంది. అందువల్ల ఉత్సాహమున్న యువ త ఎవరైనా డెయిరీ వ్యాపారంలోకి రావొచ్చు. అయితే డెయిరీ నిర్వహణకు పెట్టుబడి డబ్బు ఒక్కటే కాదు. బోలెడంత ఓపిక, సహనం ఉంటేనే ఇందులోకి రావాలి.

ఎక్కడ ఫెయిలవుతున్నారంటే...

నిజానికి చాలామందే ఉత్సాహంగా వచ్చి డెయిరీలు పెడుతుంటారు. కానీ విజయం సాధించలేక చతికిలబడుతున్నారు. నేను విశ్లేషించినదాన్ని బట్టి దీనికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి. 'నేను డబ్బు పెట్టి అజమాయిషీ చేస్తాను, నువ్వు పనిచెయ్యి' అనే ధోరణి ఈ వ్యాపారంలో అస్సలు పనికిరాదు. రోజూ ఉదయం మూడు నాలుగు గంటలు, సాయంత్రం నాలుగ్గంటలు - మొత్తం ఎనిమిది పది గంటలు కొట్టంలో గడపాల్సిందే.

రెండోది పశువుల మేత. ఏది చవగ్గా వస్తే అది పెడుతుంటారు యజమానులు. పసిపిల్లలకూ, మనుషులకూ లాగానే పశువులకూ సమీకృత ఆహారాన్ని అందించాలి. పాలు ఎక్కువ కావాలి, దాణా ఏదోటి పెడతామనే ఆలోచన వదులుకోవాలి. నేను ఎనిమిది రకాల ఆహారాన్ని అందిస్తాను. గోధుమ పొట్టు, పత్తిగింజల చెక్క, కొమ్ముశెనగలు, మినప్పొట్టు, వరినూకలను పచ్చిగడ్డిలో కలిపి పెడతాం.

ఉదయం మధ్యాహ్నం సాయంత్రాల్లో వేర్వేరు రకాలు - అదికూడా పశువుకో బేసిన్లో చొప్పున వేసి పెడతాం. దీనివల్ల ఏ ఆవు ఏం తిన్నది, ఎంత తిన్నది, ఆహారం తీసుకోవడంలో ఎక్కడైనా సమస్యలున్నాయా అన్నది తెలుస్తుంది. నాకున్న తొమ్మిది ఎకరాలుగాక మరికొంత భూమిని రైతుల నుంచి కౌలుకు తీసుకొని ఐదు రకాల గడ్డిని పెంచుతున్నాను. పూణె, కోయంబత్తూరుల నుంచి విత్తనాలు తీసుకొచ్చి పంట వేశాం. వీటికి తోడు వరిగడ్డిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతాం. మూడోది - పశువుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ప్రతిరోజూ పర్యవేక్షించి తెలుసుకోవాలి.

మా దగ్గరున్న ప్రతీ ఆవూ ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఈనిందో, ఎప్పుడే అనారోగ్యానికి గురయిందో, ఏ మందులు వాడామో, ఏ రోజు ఎన్ని పాలు ఇచ్చిందో... ఇలా అన్ని వివరాలనూ ల్యాప్‌టాప్‌లో భద్రపరిచాను. దీంతో ప్రతి ఆవు గురించిన మొత్తం సమాచారం నాకు క్షుణ్ణంగా తెలుసు. నాలుగో అంశం పరిశుభ్రత.

అధిక దిగుబడినిస్తాయని అందరూ జెర్సీ ఆవులనే కొంటారు. కానీ అవి వేడి వాతావరణంలో మనలేవు. అందుకే రేకుల షెడ్లలో ఉండలేక రోగాల పాలయి నీరసించి మరణిస్తాయి. దీనికి విరుగుడుగా నేనేం చేశానంటే - డబ్బు సమకూరేదాకా తాటాకులతోనే పైకప్పు వేయించా. కాస్త నిలదొక్కుకున్నాక బంగాళా పెంకులు రెండు వరుసలుగా వేయించటంతో మా షెడ్లు చల్లగా ఉంటాయి. గాలీవెలుతురూ ధారాళంగా వస్తాయి.

రోజుకు మూడు నాలుగుసార్లు పేడ ఎత్తేస్తాం, మూత్రమంతా పంట పొలాల్లోకి వెళ్లేలా కాలువలు తీశాం. దీనివల్ల ఎప్పుడు చూసినా ఇదంతా శుభ్రంగా ఉంటుంది. అలాగే అన్ని పశువులనూ ఒకేచోట ఉంచను. చిన్న పెయ్యలన్నీ ఒక షెడ్లో, చూడి ఆవులన్నీ ఒకచోట... ఇలా విభజించుకుంటాను. దీనివల్ల వాటికి మేత వెయ్యడం, బాగోగులు చూడటం సులువు. ఇన్సూరెన్స్ కూడా సరిగా చేసుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే లాభాల బాట పట్టడం ఎవ్వరికైనా సాధ్యమే.

సాంకేతికానుభవం...

ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత శ్రమించినా మానవ వనరులను జాగ్రత్తగా చూసుకోవడం వీటన్నిటి కన్నా ముఖ్యం. ప్రస్తుతానికి నాతో సహా పద్నాలుగు మందిమి పనిచేస్తున్నాం. వాళ్లందరికీ మంచి వేతనాలు, భోజనం అందేలా చూసుకుంటాను. అలాగే ఊళ్లో ఎవరి పశువులకు ఏ అవసరం వచ్చినా వెళ్లి చూస్తాను. కొత్త తరం తమ సాంకేతికతను పెద్దల అనుభవంతో మేళవించి ముందడుగు వెయ్యాలన్నదే నేను నేర్చుకున్న సూత్రం.

ఇప్పుడు నా దగ్గర మొత్తం నా దగ్గర 135 (హెచ్.ఎఫ్ - హోలిస్టీన్ ఫ్రెష్యన్ అనే జాతి) ఆవులున్నాయి. అందులో ఎనభై ఇక్కడ పుట్టినవే. అలాగే రోజుకు 500 లీటర్ల పాల దిగుబడి ఉంది. రెండేళ్లలో నా దగ్గర పుట్టినవే వంద ఆవులుండాలని, రోజుకు వెయ్యి లీటర్ల పాల దిగుబడి ఉండాలన్నది నా లక్ష్యం. "మనం వేసే ప్రతి అడుగుకూ అంగుళం దూరంలో ధ్యేయాన్ని పెడతాడు దేవుడు. అందుకే స్వర్గాన్ని అంత ఎత్తులో కట్టాడు.

కొందరే అక్కడికి చేరుకోగలరు అంగలేసి అలసిపోనివాళ్లు....'' ఈ కొటేషన్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. అందుకే నేను ధ్యేయాన్ని అందుకోవడం కోసం ఎన్ని అంగలైనా వెయ్యదలచుకున్నాను...
తక్కువ మొత్తాల్లో డబ్బుకు ఆశపడి పెయ్యలను అమ్మేస్తుంటారు యజమానులు. అవే ఎదిగి ఆవులైనప్పుడు కొనాలంటే చాలా సొమ్ము వెచ్చించాలి. నేను పెయ్యలనూ, ఆవులనూ ఎంత దగ్గరివారికైనా ఇవ్వను. ఒకసారి మాత్రం ఒకాయన చాలా బలవంతపెట్టి ఒకావును తీసుకెళ్లాడు. దాన్ని చెట్టు నీడన కట్టేసి ఇంత గడ్డి పడేసేవాడు. అది అనారోగ్యంతో చనిపోయింది. ఆరోజు మాత్రం చాలా బాధ పడ్డాను. సరైన శ్రద్ధ పెడితే అది బతికి ఉండేది కదా అనిపిస్తుంది.

-పిన్నమనేని సుబ్బరాజు సెల్ నంబర్ : 9295404698 
* అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ

Saturday, July 16, 2011

సెలబ్రిటీ ఆవు

ఒకప్పుడు విస్తృత సంఖ్యలో ఉన్న పుంగనూరు పశుజాతి సంఖ్య ప్రస్తుతం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్రం మొత్తంమీద వీటి సంఖ్య 70. హైదరాబాద్‌లో ఇరవై వరకు ఉన్నాయి. ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు బంజారాహిల్స్‌కు చెందిన పొనుగోటి శ్రీనివాసరావు, ఎల్బీనగర్‌కు చెందిన నాగేశ్వరరావు, ఉప్పల్‌లో రామదాస్‌లతో పాటు నగర శివారులోని నర్సాపూర్ సువిజ్ఞాన ఆశ్రమంలో పుంగనూరు ఆవులను సంరక్షిస్తున్నారు. వీరితో పాటు నగరంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు, సినీనటులతో పాటు ఓ ఎమ్మెల్యే వద్ద కూడా ఈ ఆవులున్నాయి. ప్రస్తుతం పుంగనూరు ఆవు కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు.

లీటరు పాల ధర.. వందల్లో...

పుంగనూరు ఆవులు అరుదైన పోషక విలువలతో కూడిన పాలను ఇస్తాయి. ఇందులో 10 నుంచి 12 శాతం వెన్న లభిస్తుంది. సాధారణంగా ఆవుపాలలో అత్యధిక వెన్నశాతం 4 మాత్రమే. ఏడాదిలో తొమ్మిది నెలల పాటు పాలిస్తాయి. ఈ పాలను ఆయుర్వేద ఔషధ తయారీలోనూ వాడుతుండటంతో లీటరు పాల ధర రూ.వందల్లో పలుకుతోంది.

ఇంటింటా.. సెంటిమెంట్...

పుంగనూరు ఆవు ఉండటం ఓ సెంటిమెంట్‌గా చాలామంది భావిస్తున్నారు. ఉదయం లేవగానే ఈ ఆవు మొహం చూసే ఇతర పనులు చేసే వీఐపీలున్నారు.

కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక సమీక్ష సమావేశాలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లేవాడ్ని. ఒక సారి వైఎస్సార్‌కు పుంగనూరు జాతి గురించి వివరించా. ఆయన సహకారంతో రెండు ఆవుల్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఉచితంగా పొందా. ప్రస్తుతం మా ఇంట్లో మూడు ఆవులున్నాయి. కుటుంబసభ్యులకంటే మిన్నగా పెంచుకుంటా. పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. ప్రత్యేక షెడ్డు, రెండు ఫ్యాన్లు, దోమతెరలు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశా. పట్టణాల్లో పెంచుకోవడం చాలా సులువు.
-రాందాస్, బోడుప్పల్

ఎన్నో ఔషధగుణాలు...

పుంగనూరు జాతి ఈ ప్రాంతానికి, వాతావరణానికి ఎంతో అనువైంది. ఈ ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వివిధ సమస్యలపై మా ఆశ్రమానికి వ చ్చేవారికి పుంగనూరు ఆవుపాలతో కూడిన ఔషధాన్ని ఇస్తాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
- గురు సత్యవీర్,
సువిజ్ఞాన ఆశ్రమం, నర్సాపూర్

ఇష్టమనే పెంచుతున్నా...

పుంగనూరు పశువులంటే ఎంతో ప్రేమ. ఈ ఆవుల్ని పెంచితే అంతా మంచే జరుగుతుందన్న సెంటిమెంట్ ఉంది. ఈ జాతి ఆవులు మార్కెట్లో లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఇష్టపడే వారు రూ.లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
- ఉలిపెద్ది నాగేశ్వరరావు

ఎన్టీఆర్ హయాంలో...

ఆంధ్రప్రదేశ్‌లో పుంగనూ రు జాతి ఆవులు అంతరించిపోతున్నాయని 1983లో అప్పటి సీఎం నందమూరి తారకరామారావు ఈ జాతిని కాపాడాలని గుజ రాత్ నుంచి ఆవులను కొనుగోలు చేసి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులకు సబ్సిడీ ద్వారా అందజేశారు.

కృషి చేస్తా...

పుంగనూరు జాతి అంటే ఎంతో మక్కువ. వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వీటి పరిరక్షణకు కృషి చేస్తా.
- పొనుగోటి శ్రీనివాసరావు

Wednesday, July 6, 2011

నేల మంచిదైతేనే పంట ‘ పండుతుంది. ’


రాష్ట్రంలో అనేక రకాల నేలలు ఉన్నాయి. అయితే వీటిలో పంటలు పండించడానికి అనువైన సారవంతమైన భూములు కొన్ని మాత్రమే. చాలా మంది రైతులకు ఏ పంటకు ఏ భూమి అనువైనదన్న విషయంపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో తమ భూమికి అనువుగా లేని పంటల్ని సాగు చేస్తూ నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ భూమిలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు పొందవచ్చో కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.హరీష్ కుమార్ శర్మ సూచిస్తున్నారు. ఆ వివరాలు...

సారవంతమై ఉండాలి

పంట బాగా పండాలంటే భూమి సారవంతమై ఉండాలి. రసాయన ఎరువులు వేస్తే ఏ భూమిలో అయినా పంట పండుతుందని రైతులు అపోహ పడుతుంటారు. రసాయన ఎరువులు వేసుకుంటూ పోతే కొన్నేళ్ల పాటు పంట పండే మాట నిజమే అయినా తర్వాతి కాలంలో ఆ భూములు నిస్సారంగా మారతాయి. మనం వేసే ఎరువులు పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వాలంటే భూమి సారవంతమై ఉండాల్సిందే. అంతేకాదు... దాని భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే భూమిలో వేసిన ఏ ఎరువునైనా మొక్క సమర్థవంతంగా గ్రహిస్తుంది. నాణ్యమైన, అధిక దిగుబడులు అందిస్తుంది.

ఏం చేయాలి?

సాగు భూముల్లో సారం పెరగాలంటే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, చెరకు మడ్డి, వర్మి కంపోస్ట్‌ను విరివిగా వాడాలి. దీనివల్ల నేల గుల్ల బారుతుంది. దానికి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. మొక్కల ఎదుగుదలకు దోహదపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. అలాగే మొక్కలకు అవసరమైన కొన్ని పోషక పదార్థాలు కూడా అందుతాయి.

పొలం నుండి మురుగు నీరు బయటికి పోయే సౌకర్యం లేకపోతే భూమి భౌతిక, రసాయునిక పరిస్థితి (ఆరోగ్యం) దెబ్బ తింటుంది. వ్యవసాయ భూముల్లో నీరు బాగా నిలిచిపోతే వరి మినహా మిగిలిన పంటలు తట్టుకోలేవు. పంట చేలో నీరు నిలిస్తే మొక్కల ఆకులు పసుపుపచ్చగా, ఎర్రగా మారి గిడసబారతాయి. నీరు నిలిచిన కొద్దీ వ్యవసాయ భూములు చౌడు భూములుగా మారతాయి. అందువల్ల పంట చేలో మురుగు నీటి పారుదల సదుపాయం తప్పనిసరిగా ఉండాలి.


సమస్యాత్మక భూములను దారికి తేవాలంటే...

రాష్ట్రంలో 8.6 లక్షల ఎకరాలు ఉప్పు, చౌడు భూములే. ఉప్పు నేలల్ని తెల్ల చౌడు నేలలని, చౌడు నేలల్ని నల్ల చౌడు లేదా క్షార భూములని పిలుస్తారు. ఈ భూముల్ని దారికి తేవాలంటే ముందుగా నేలను చదును చేయాలి. చదును చేసేటప్పుడు భూమి కొంచెం వాలుగా ఉండేలా చేస్తే మురుగు నీరు సులభంగా బయటికి పోతుంది. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వేర్వేరుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత భూమిని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. పొలం చుట్టూ ఎత్తయిన కట్టలు కట్టాలి. మడుల్లో మంచి నీటినే నింపాలి. ఆ నీటిని నాలుగైదు రోజులు నిల్వ ఉంచాలి. ఎండ వేడిమికి ఇంకిపోగా మిగిలిన నీటిని బయటికి పంపాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే నేలలో చౌడు తీవ్రత తగ్గుతుంది. ఉదజని సూచికను బట్టి భూమిలో జిప్సమ్ వేసి దున్నాలి. నీరు పెట్టి వారం రోజుల పాటు అలాగే ఉంచాలి.

వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూమి నుం డి కాల్షియం, పొటాషియం, సోడియం లవణాలు వరద నీటిలో కలిసి కొట్టుకుపోతాయి. నీటిలో అంతగా కరగని అల్యూమినియం, సిలికాన్, ఇనుము అవశేషాలు ఆక్సైడ్ లేదా సిలికేట్ రూపంలో భూమిలోనే ఉండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ నేలలు ఆమ్ల నేలలుగా మారతాయి. ఈ భూముల నుండి కొన్ని రకాల విష పదార్థాలు విడుదల కావడంతో మొక్కలు సరిగా పెరగవు. ఈ పరిస్థితిని నివారించాలంటే ముందుగా పొలాన్ని కలియదున్ని ఆ తర్వాత పొలం అంతటా సమానంగా పడేలా సున్నం పొడిని వెదజల్లి మరోసారి దున్నాలి. సేంద్రియ ఎరువులు వేయడానికి నాలుగైదు వారాల ముందు సున్నం చల్లాలి. ఆమ్ల గుణమున్న నేలల్లో అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ వంటి రసాయన ఎరువులు వేయకూడదు.


వ్యవసాయ భూముల్లో నీటిలో కరిగే లవణాలు అధికంగా ఉన్నట్లరుతే మొక్కలు పోషకాలను, నీటిని తగినంతగా తీసుకోలేవు. ఈ సమస్యను నివారించాలంటే ముందుగా పొలాన్ని బాగా దమ్ము చేయాలి. మురుగు నీటిని బయటికి పంపాలి. ఈ విధంగా నాలుగైదు సార్లు చేస్తే భూమిలో లవణాల్ని పరిమిత స్థాయికి తేవచ్చు.


ఏ పంటకు ఏ భూమి అనుకూలం?


వరిని అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయొచ్చు. కానీ మురుగు నీరు బయటికి పోయే వసతి ఉన్న బరువు నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరుతడి పంటలతో పోలిస్తే వరికి చౌడు నేలలు కొంత మేర అనుకూలమే. మొక్కజొన్నను ఇసుక, రేగడి, గరప నేలల్లో సాగు చేయొచ్చు. ఎర్ర గరప నేలలు, లోతైన మధ్య రకపు రేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు ఎక్కువగా నిలిచే ఒండ్రు నేలలు, బరువు నేలలు పనికిరావు. పేలాల మొక్కజొన్న రకాల్ని తేలికపాటి ఇసుక భూముల్లో వేసుకోవచ్చు. జొన్నను నల్ల నేలల్లో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది. తేలికపాటి ఎర్ర నేలల్లో కూడా పండించవచ్చు.


కందిని నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, ఎర్ర చల్కా భూముల్లో సాగు చేయొచ్చు. నల్ల రేగడి నేలల్లో మురుగు నీరు బయటికి పోయే వసతి ఉంటే కంది వేయొచ్చు. చౌడు నేలలు, నీరు ఎక్కువగా నిలిచే నేలలు పనికిరావు. మినుము, సోయా చిక్కుడును నీరు ఇంకే, తేవును నిల్వ చేసుకునే భూముల్లో సాగు చేయొచ్చు. మురుగు నీటి పారుదల వసతి ఉన్న ఎర్ర, నల్ల నేలల్లో కూడా వేసుకోవచ్చు.


వేరుశనగ సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. చల్కా భూముల్లో కూడా పండించవచ్చు. నువ్వుల సాగుకు తేమను నిలుపుకునే, మురుగు నీరు నిలువని తేలికైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆముదాన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీరు ఇంకిపోయే తేలిక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి.

పత్తిని వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో సాగు చేయొచ్చు. వర్షాధారపు పత్తికి తేలికపాటి ఎర్ర నేలలు అనువైనవి కావు. నీటి పారుదల కింద తేలికైన ఎర్ర నేలలు, బరువైన నల్ల నేలల్లో వేసుకోవచ్చు.

కంటికి రెప్పలా చూసుకుంటేనే డ్రిప్పు పదిలం

అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు ఎక్కువ నీటిని అందించాలన్న అభిప్రాయం చాలా మంది రైతుల్లో ఉంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పైర్లకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో నీరు అందించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. దీనికి సూక్ష్మ సాగు నీటి విధానం (మైక్రో ఇరిగేషన్) ఎంతగానో ఉపయోగపడుతుంది. సూక్ష్మ సాగు నీటి విధానంలో రెండు పద్ధతులున్నారుు.

అవి 1.బిందు సేద్యం 2.తుంపర్ల సేద్యం. బిందు సేద్యానికి (డ్రిప్ ఇరిగేషన్) అవసరమైన పరికరాల్ని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకం (ఏపీఎంఐపీ) ద్వారా ప్రభుత్వం 90 శాతం రాయితీతో అందిస్తోంది. అయితే రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వీటిని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోతున్నారు. పరికరాలు దీర్ఘకాలం ఉపయోగపడాలంటే వాటిని సరైన రీతిలో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యం లో డ్రిప్ పరికరాల నిర్వహణ, సంరక్షణకు సంబంధించి నల్గొండ ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ సహాయ అధికారి బాబు ‘న్యూస్‌లైన్’కు పలు విషయాలు తెలియ జేశారు. ఆ వివరాలు...

శాండ్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రపరచాలి...
బావి నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు శాండ్ ఫిల్టర్‌ను అమరుస్తారు. ఇందులో ప్రత్యేకమైన ఇసుక ఉంటుంది. బావి నీటిని అందులోకి పంపించినప్పుడు నీటిలో ఏమైనా చెత్త, ఇతర వులినాలు ఉంటే అవి ఇసుకలోకి చేరి శుభ్రమైన నీరు మాత్రమే పైపుల ద్వారా మొక్కలకు అందుతుంది. ఇసుకలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించనట్లయితే నీటి ఒత్తిడి (ప్రెషర్) తగ్గుతుంది. అందువల్ల బిందు సేద్యానికి గుండె లాంటి శాండ్ ఫిల్టర్‌ను ప్రతి వారం శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఇసుకను చేతితో కలుపుతూ చెత్తను బయట పడేయాలి.

స్క్రీన్ ఫిల్టర్‌ను కూడా...
బోరు నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు స్క్రీన్ ఫిల్టర్‌ను అమరుస్తారు. దీనిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. స్క్రీన్ ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఫిల్టర్ ఎలిమెంట్‌ను, సూక్ష్మ రంధ్రాలు ఉన్న స్టీల్ జాలీని శుభ్రపరచాలి. నీటి ధార కింద జాలీని ఉంచి మెత్తని బ్రష్‌తో రుద్దాలి.

పైపును ఎలా శుభ్రం చేయాలంటే...
శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికీ సన్నని మట్టి కణాలు, ఇతర సేంద్రియ పదార్థాలు సబ్ మెయిన్ పీవీసీ పైపు వరకూ వస్తాయి. అక్కడి నుండి లాటరల్ ఇన్ లైన్ దిశగా వెళతాయి. వీటిని తొలగించడానికి సబ్ మెయిన్ పీవీసీ పైపు చివరి భాగంలో ఉండే ఫ్లష్ వాల్వ్‌లను వారానికో రోజు తెరవాలి. లోపల పేరుకున్న చెత్త, వులినాలు నీటి ప్రవాహంతో పాటు బయటికి వస్తారుు.

లాటరల్స్ మూసుకుపోతాయి...జాగ్రత్త
ట్యూబ్ లాటరల్స్‌ను శుభ్రం చేయకపోతే డ్రిప్పర్ల రంధ్రాల్లో మలినాలు పేరుకొని మూసుకుపోతాయి. లాటరల్స్‌ను శుభ్రం చేయడానికి పైపు చివర ఎండ్ క్యాప్ ఉంటుంది. దీనిని వారం లేదా 15 రోజులకు ఒకసారి తెరిచి పంపు ద్వారా పూర్తి ప్రెషర్ తో నీటిని లోపలికి పంపాలి. నీటి ప్రవాహం వేగంగా ఉంటే లాటరల్స్‌లో ఉన్న చెత్త నీటితో పాటే బయటికి వస్తుంది. వర్షాకాలంలో డ్రిప్ పరికరాలను పెద్దగా ఉపయోగించరు కనుక పైపులో సాలీళ్లు గూడు కట్టుకుంటాయి. అందువల్ల డ్రిప్‌ను తిరిగి వాడేటప్పుడు ముందుగా నీటిని పూర్తి ప్రవాహ వేగంతో వదలాలి.

ఇలా వాడుకోండి...
మోటారు ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ దగ్గర ఉన్న ప్రెషర్ గేజ్ సరిగా పని చేస్తున్నదో లేదో పరిశీలించాలి. గేజ్ మీటర్ పైన పాలిథిన్ కవర్ తొడగాలి. గేజ్‌లోని సూచిక పని చేయకపోతే నెమ్మదిగా తీసి సరి చేయాలి. నీటి వేగం సెకనుకు 1.5 మీటర్లు ఉంటేనే లాటరల్ పైపుకు నీరు అందుతుంది. మోటారు పంపు ఫుట్ వాల్వ్ దగ్గర వాచర్ పాడైనప్పుడు రైతులు అవగాహన లేక పేడ నీళ్లు ఉపయోగిస్తారు.

దీని వల్ల మోటారు ఆన్ చేసేటప్పుడు పేడ నీరు ఫిల్టర్‌లోకి చేరి దానిపై భారం పడుతుంది. దీనిని నివారించేందుకు బైపాస్ ద్వారా మురుగు నీటిని బయటికి పంపాలి. శాండ్ ఫిల్టర్‌లో తప్పనిసరిగా నాలుగింట మూడు వంతులు ఇసుక ఉండాలి. డ్రిప్పర్లను శుభ్రం చేయడానికి వాటిని లాటరల్ నుండి బయటికి తీయకూడదు. తెరిచి శుభ్రం చేయాలి. లాటరల్ నుండి డ్రిప్పర్లను బయటికి తీస్తే కన్నాలు పెద్దవై లీకేజీలు మొదలవుతాయి. ఉడతలు, ఎలుకల వంటివి లాటరల్స్‌కు నష్టం కలిగిస్తుంటే లాటరల్స్‌ను నేలలో మూడు నాలుగు అంగుళాల లోతుకు పరిచి మట్టి కప్పాలి.

డ్రిప్పర్లు పైకి ఉండేలా చూసుకోవాలి. నీటి కోసం పక్షులు లాటరల్స్‌ను కొరకకుండా అక్కడక్కడా నీటిని అందుబాటులో ఉంచాలి. డ్రిప్పర్ల చుట్టూ ఎంత మేరకు భూమి తడుస్తోందో తెలుసుకునేందుకు తరచుగా నేలను తవ్వి పరిశీలించాలి. లవణాలు, చెత్త పేరుకుపోయి డ్రిప్పర్లు మూసుకుపోతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్‌మెంట్ చేయాలి. వర్షాకాలంలో కూడా రోజూ కనీసం అరగంట పాటు మోటారు ఆన్ చేసి పరికరాలు పని చేసేలా చూసుకోవాలి.

ఏం చేయకూడదు?
డ్రిప్ పరికరాల్ని వాడాల్సిన అవసరం లేనప్పుడు వాటిని అలాగే తోటలో వదిలెయ్యకూడదు. చుట్టలుగా చుట్టి భద్రపరచుకోవాలి. పైపుల్ని అలాగే ఉంచి చేలో చెత్తను కాల్చకూడదు. యాసిడ్ ద్రావణం తయారు చేసేందుకు యాసిడ్‌ను నీటిలో పోయాలే తప్ప నీటిని యాసిడ్‌లో పోయకూడదు. ఫిల్టర్‌లో జాలీ లేకుండా పరికరాల్ని పని చేయించకూడదు. ఫిల్టర్‌లోని జాలీని శుభ్రం చేయడానికి పదునైన వస్తువులు, పుల్లలు, ఇనుప బ్రష్‌లు వాడకూడదు. లాటరల్ పైపును బలంగా లాగకూడదు. డ్రిప్ పరికరాల ద్వారా అవసరమైన మేరకే చెట్లకు నీరు అందించాలి. అవసరానికి మించి ఎక్కువగా నీరు పెడితే పల్లాకు తెగులు వచ్చే ప్రమాదం ఉంది.

Gouthamaraju as WUA